బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు
తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి ఈనెల 27న ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని తొర్రూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతానములు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం నేడు కొమ్మనపల్లి, చింతలపల్లి టీక్య తండా, పెద్దమంగ్య తండా, వెలికట్టే, భోజ్య తండా ఈదులకుంట తండా నాంచారి మడూర్ ,గుడి బండ తండా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో మాజీ తొర్రూరు మండలం ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ ఎస్కే అంకుష్ ,కాలు నాయక్, ఈనపెళ్లి శ్రీనివాస్ ,పాపిరెడ్డి , పులి వెంకన్న ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రజితోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని “శేఖర్ రావు” పిలుపు.
“నేటిధాత్రి” వరంగల్.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ అందరి వ్యక్తి, అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయడం సరికాదన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుతున్నట్లుగానే అన్నివర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు.
పది విభిన్న మతాలు, 25 వేల కులాలున్న మన భారత దేశంలో కాలమాన పరిస్థితులకు, ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు కొనియాడారు.
Congress
భారత రాజ్యంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సాగే ఈ యాత్రలో దళిత, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు కోరారు.
సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నర్సింహరావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డీబీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకా హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ అన్నారు.ఈనెల 25,26,27 నా మూడు రోజులపాటు జరగనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ ఔట్సోర్సింగ్ పర్మనెంట్ పోస్టులను భర్తీ చేయాలి మూడు రోజులపాటు విద్యారంగ సమస్యలపై చర్చ జరనుంది విద్యార్థులు ఈ మహాసభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,బన్నీ,అజయ్ కుమార్,ప్రణయ్,విజయ్,బంటి పాల్గొన్నారు.
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో జరగనున్న బి ఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ తాజా మాజీ ఎంపీపీ మంజుల నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తుంకులపల్లి సంతోష్ రావు , మోత్కు మల్లేశం, వేమారెడ్డి, పరిగి రమేష్ కుమార్ , బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఒకలక్ష కిలోమీటర్ల మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి
ధర్మసమాజ్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు నాగ మహారాజ్ నేటి ధాత్రి:
పరకాల నేటిధాత్రి మండలంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీల హక్కులు మరియు రాజ్యాధికార సాధన జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టబోయే ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.ఈ కసందర్బంగా పరకాల మండల అధ్యక్షులు నాగరాజు మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ప్రజలైన బీసీ,ఎస్సీ,ఎస్టీలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని అందిస్తూ ఈ దేశంలోనే ఎవరూ ఇంతవరకు చేయని సాహసోపేతమైన ఒక లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర అంతర్లీనంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తూ వీరిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అధిక సంఖ్యలో వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు,ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్,సూర్యం,ప్రవీణ్, ప్రభాస్,సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్లో మెగా జాబ్ మేళా..
నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం
వరంగల్ తూర్పు, నేటిధాత్రి:
వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. వరంగల్లో మెగా జాబ్మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు మాట్లాడుతూ, 60 కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం చేశాం అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని, ఎవరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి అని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. మా ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని, ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, తూర్పు కార్పొరేటర్లు, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం
మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగుల విశేష స్పందనతో కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ మేళాకు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ప్రాంగణం నిండిపోవడంతో, పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ రంగాల్లో మొత్తం 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జాబ్ మేళాలో తొక్కిసలాట, పలువురికి గాయాలు
భారీగా సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు.
హోటల్ ప్రధాన ద్వారం అద్దం పగిలి ముగ్గురు మహిళ నిరుద్యోగులకు గాయాలు.
వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి. ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరు కావడంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో అద్దం పగిలి పలువురికి గాయాలయ్యాయి. ఈ జాబ్ మేళాకు సుమారు 10వేల మంది వరకు హాజరైనా, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, హాలు సరిపోలేదని నిరుద్యోగులు విమర్శించారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు హాజరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.
డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.
మంచిర్యాల గాంధీ పార్కులో జరిగే బిసి నిరసన దీక్షను విజయవంతం చేయాలి
మంచిర్యాల,నేటి ధాత్రి:
బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ పార్కు స్టేషన్ రోడ్డు మంచిర్యాల నందు ఉదయం10 గంటలకు జరిగే నిరసన దీక్షలో బీసీ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు విద్యార్థి మేధావులు పాల్గొనాలని కోరుకుంటున్నాం.దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో సమగ్ర కులగణన జరిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ,స్థానిక సంస్థల్లో 42%కి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించాలి.ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఉద్యమకారుడు,బత్తుల సిద్దేశ్వర్ ఢిల్లీ కేంద్రంగా అమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.ఈ దీక్ష ఏడవ రోజుకు చేరడం జరిగింది.కావున అమరణ దీక్షకు మద్దతుగా రేపు మంచిర్యాల జిల్లాలో నిరసన దీక్షలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాల నాయకులు,కుల సంఘాల నాయకులు మరియు ప్రతి బీసీ బిడ్డ పాల్గొనలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మనోహర్, గుమ్ముల శ్రీనివాస్, మహేష్ వర్మ ,పిట్టల రవీందర్ ఎండి లతీఫ్,ఎల్తాపు రాజశేఖర్,దాస్యపు దీపక్ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.
కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఐకే 1ఎ గనిలో జరిగిన గేట్ మీటింగ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు,వేజ్ బోర్డ్ శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మే 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఒక్కరోజు టోకెన్ సమ్మె జరుగుతుందని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు 44 కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగు కోడ్ లు గా మార్చి ఏప్రిల్ నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ దేశంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20 నా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని,అందులో భాగంగా సింగరేణిలో కూడా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి తీరాలన్నారు.దేశానికి ఆదాయం అనుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని దీనివలన దేశ ప్రజలకు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సింగరేణి సంస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వద్దని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లందు,కోయగూడెం ఓసిపి ని సత్తుపల్లి ఓసీలను ప్రైవేటు వారికి ఇచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని సింగరేణికే ఇవ్వాలని తాడిచర్ల 2, భూపాలపల్లి,వెంకటాపూర్ 2 గనులను వేలం వేయకుండా సింగరేణి ఇవ్వాలని మణుగూరు ఓసి టు ను ఎక్స్టెన్షన్ చేయాలని గోలేటి 1, మాదారం వన్ గనులు ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తదితర హక్కుల కోసం గుర్తింపు సంఘం తో పాటు అన్ని కార్మిక సంఘాలను కలిసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మే 20 న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా,బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు,మైనింగ్ స్టాఫ్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి రాజేశ్వర్ రావు,ఫిట్ కార్యదర్శులు నవీన్ రెడ్డి,అగు శ్రీకాంత్,మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ కార్యదర్శి బాలకృష్ణ ,అడ్డు శ్రీనివాస్,కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్,ఫిట్ ఉపాధ్యక్షులు పెద్దన్న సత్తయ్య వెంకటేష్ రమేష్ శెట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…
గంగాధర ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం
గంగాధర నేటిధాత్రి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలనలో ప్రశ్నార్థకంగా మారిన రాజ్యాంగ పరిరక్షణ కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. గురువారం గంగాధర లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని ప్రతి గడపను తడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో ఏప్రిల్ నెల మొదటి వారంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొంటారని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళ, ఎస్టి, యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య, కొల్లిపాక స్వామి, దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దికొండ మధు, పెంచాల చందు, గరికంటి కరుణాకర్, బొడ్డు మహేష్, ముచ్చ శంకరయ్య, దూలం వీరేశం గౌడ్, నాయకులు తాళ్ళ శ్రీనివాస్, రాచమల్ల భాస్కర్, గుజ్జుల బాపురెడ్డి, రేండ్ల శ్రీనివాస్, చిప్ప చక్రపాణి, గంగాధర సుదర్శన్, పోత్తూరి ప్రభాకర్, అంజయ్య, వేముల అంజి, ముద్దం నగేష్, ఆనంద్, సాయి గౌడ్, రాజేశం, మ్యాక వినోద్,కరిం, మంత్రి మహేందర్ ,కుమార్, తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి ఆడెపు రాజమౌళి 23/03/2025 ఆదివారం, సమయం:ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ కార్యాలయం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించింది, దున్నేవానికి భూమి ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికై ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాటం చేసింది,సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము కావున నియోజకవర్గ ప్రజలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ జిల్లా సంస్థ సభ్యులు గుండా చంద్ర మాణిక్యం మేకల రాజేశం నాయకులు రత్నం రాజం కుందేళ్ళ శంకర్ గుండా ప్రదీప్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభను విజయవంతం చేయండి..
*శ్రామిక మహిళ స్వేచ్ఛ శ్రమ శక్తిని హరించే విధానాలను తిప్పికొట్టండి..
*పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపు..
తిరుపతి నేటిధాత్రి :
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ఒంగోలులో జరుగుతున్న రెండు ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని మహిళలకు పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఒంగోలులో జరుగుతున్న రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.అరుణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కొరవడిందన్నారుఇంటిలోనూ పనిచేసే చోట మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, దీనికి తోడు మహిళల శ్రమశక్తి దారుణంగా దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా మహిళలు పురుషులతో సమానమేనని చెబుతున్నా శ్రమ శక్తి దోపిడీ మాత్రం అధికంగా ఉందన్నారు. సమాన వేతనాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక దారుణ పరిస్థితుల్లో జీవితాలను నడుపుతున్నారని చెప్పారు.దీనికి తోడు కుల మతాల పేరుతో మహిళలను మరింతగా బందీలుగా మారుస్తున్నారని తెలిపారు.ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు చైతన్యవంతులై దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలకు చట్టబద్ధ వేతనాలు, హక్కులు అమలు కాని దుస్థితి నెలకొని ఉందని వివరించారు. వీటికి వ్యతిరేకంగా ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు ఆర్.అన్నపూర్ణ, సుజాత, గంగాదేవి, ఎ.లక్ష్మీ, ఈ. కవిత తదితరులు పాల్గొన్నారు..
ఇ విజయం తాత్కాలికమే `బీఆర్ఎస్, బీజేపీ చీకటి రాజకీయలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం `రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే `వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య వర్దన్నపేట,నేటిదాత్రి: వర్ధన్నపేట మండల కేంద్రము లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యువేట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం బీజేపీ, బిఆర్ఎస్ చీకటి రాజకీయలతోనే జరిగింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని గత పదేళ్ళలో బీఆర్ఎస్ చేసిన అడ్డగోలు అవినీతి తో కేసీఆర్ కుటుంబం అనేక కేసులలో కీలకంగా ఉన్నారని దీంతో క్విడ్ ప్రో కో పద్ధతిన బిఆర్ఎస్ బీజేపీ లు వారి వారి లాభాల కోసం పని చేస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే ఈ ఒప్పందాలు అమలు అవుతున్నాయి . పార్లమెంట్ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పూర్తిగా లోపాయకారి ఒప్పందం తో బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే బీజేపీ 8 సీట్లు గెలిచింది అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ 22 మంది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్న కూడా పోటీకి దూరంగా ఉండి బీజేపీని గెలిపించింది. ఇది తాత్కాలిక విజయమే ఈ ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు ఏమి సంబంధం ఉండదని రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే అని వెంకటయ్య అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.