జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం..

జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు

శంకర్ పల్లి,నేటి ధాత్రి జూలై 5:
శుక్రవారం ఎల్బి స్టేడియంలో నిర్వహించిన “జై బాపు – జై భీం – జై సంవిధాన్” సభకు ప్రజలు భారీగా హాజరై సభను ఘనవిజయంతో ముగించేందుకు తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“సాంఘిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, యువతకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజ్యాంగ మూల్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ సభ ఒక గొప్ప మాదిరిగా నిలిచింది” అని అన్నారు. సభ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన యువత సంఘాలు, స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సభ అనంతరం ప్రజల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించిందని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version