మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొట్టాడు, గాయాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల కేంద్రంలో రాత్రి 9:40 గంటలకు సిద్ధి హోటల్ ఎదురుగా 15 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బాలుడికి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
