బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు.

బసవేశ్వరుడు చూపిన మార్గంలో కాంగ్రెస్ సర్కారు : సీఎం రేవంత్ రెడ్డీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర బాగంగానే బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు బాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

 ప్రభుత్వ బడులు బాగు చెయకపొతే పేదలకు విద్య.

 ప్రభుత్వ బడులు బాగు చెయకపొతే పేదలకు విద్య దూరమయ్యె ప్రమాదం
 రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారు ఆర్.వెంకట్ రెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

ప్రభుత్వ బడులను బాగుచేయకపొతె పేదలు,దళిత బహుజనులకు విద్య దూరమయ్యే ప్రమాదం పొంచి వున్నదని రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారులు,యంవిఎఫ్ జాతీయ కార్యదర్శి ఆర్.వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ ( డిబిఎఫ్) ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో గురువారంనాడు భారత రాజ్యాంగం హక్కులు,చట్టాలు,సామాజిక,ఆర్ధిక రాజకీయ పరిస్థితులు నాయకత్వ లక్షణాల పై శిక్షణ శిబిరం నిర్వహించారు. విద్యా హక్కులు అమలు పరిస్థితి సవాళ్ళు పరిష్కారాలు అనే అంశం పై రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ఆర్.వెంకట్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి మా భర్తలు తాగె మద్యం ద్వారా వచ్చె ఆదాయం తో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని మహిళలు సూచిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి ప్రభుత్వానికి విద్యా కమిషన్ ద్వారా సూచించామని తెలిపారు. ప్రవేట్ పాఠశాలకుదీటుగా ప్రతి మండలం నాలుగు ఆధునిక పాఠశాలలను నిర్మించాలని,ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని,ప్రవేట్ పాఠశాల ఫిజుల దొపిడిని ఆరికట్టాలని కొరమని చెప్పారు.ప్రభుత్వ విద్య పరిరక్షణకు ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత చెపట్టాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చెయాలని,ప్రవెట్ పాఠశాలలో 25 శాతం రిజర్వేషన్ లను కల్పించాలన్నారు.రాజకీయ నాయకుల,డబ్బులు వున్న వారి ధనవంతుల,పేదల పిల్లలకు సమాన విద్య ను అందించాలన్నారు.ప్రభుత్వ, ప్రవెట్ పాఠశాలలో చదువుతున్న 50 శాతం పిల్లలకు బడికి పొయిన చదువు రావడం లేదన్నారు 1960 సంవత్సరం నాటికి అందరికి విద్యను అందించాలి డాక్టర్ అంబేద్కర్ చెప్పాడని గుర్తు చేశారు.ప్రభుత్వ విద్య రక్షణకు విద్య యుద్దం ఉద్యమం చేపట్టాలన్నారు. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ నాయకత్వ లక్షణాల పై మాట్లాడుతూ బుద్దుడు పూలే అంబేడ్కర్‌ సిద్దాంతం వెలుగులు నాయకులు త్యాగన్ని అలవర్చుకొవాలన్నారు.నాయకులకు వినె లక్షణం వుండాలన్నారు.ఓర్పు,సహనం,నిస్వార్థాలను అలవర్చుకొవాలన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా వుండాలన్నారు.మానవత్వాన్ని పెంపొందించుకొని సమాజ మార్పు కొసం అంకిత భావంతో పని చెసె చిత్తశుద్ధి కలిగిన నాయకులుగా ఎదగలన్నారు. సమాచార హక్కు చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆయుధం లాంటి దన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొవాలన్నారు.ఉపాధి,భూమి,విద్య తదితర పధకాల అమలు పై సమాచారాన్ని తెలుసుకొవచ్చాన్నారు.ఈ శిక్షణ శిబిరాన్ని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్ సమన్వయం చేయగా, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కర్ణాకర్,సిద్దిపేట జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు,కామారెడ్డి జిల్లా నాయకులు ప్రభాకర్, బి ప్రభాకర్,మహిళ కార్యకర్త ,నిజాంపేట మండల డిబిఎఫ్ అధ్యక్షులు బ్యాగరి చంద్రం, బ్యాగరి రాజు, నాయకులు యాదుల్, నర్సింలు,రామస్వామి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు,పాటలు గ్రూపుల వారిగా పలు అంశాల పై చర్చించారు.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని
నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా, కరోనా వచ్చిన కేసీఆర్ ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి యాసంగిని మూడెకరాలకు పరిమితం చేశారున్నారు.
కేసీఆర్ పది వేలు ఇస్తే మేం రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చినా ఇప్పటివరకు రైతుబంధు ఊసే లేదు. జహీరాబాద్, నారాయణఖేడ్ లకు కేసీఆర్ హయాంలో అత్యధికంగా 100 కోట్ల రూపాయల రైతుబంధు వచ్చేది. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో గత నాలుగు నెలలుగా చనిపోయిన రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఆరోపించారు. మెదక్, సిద్దిపేటకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు సప్లై చేయాలని, మరికొన్ని జిల్లాలు స్టేట్ సీడ్ కార్పొరేషన్ సీడ్ పంపిణీ బాధ్యతలు అప్పగించారన్నారు.ఇద్దరు కలిసి స్టేట్ కు, ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు..బీరు విస్కీ ధరలు పెంచి చివరకు విత్తనాల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి రైతులకు పంచాడని అదే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైన్స్ ధరలు పెంచావు, జనుము, జీలుగ తదితర పచ్చిరొట్టె ఎరువుల ధరలు పెంచి రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతు బీమాలు ఇస్తలేవని ధ్వజమెత్తారు. ఇచ్చేది ఎగవేస్తున్నావ్ ఉల్ట రైతుల వద్ద గుంజేస్తున్నావ్ వంటూ ..ఈ వైఖరిని ఏమనుకోవాలన్నారు. ధాన్యానికి బోనస్ బోనస్ అని బోగస్ చేసేస్తున్నావని, యాసంగిలో సన్న వడ్లకు ఇచ్చే బోనస్ రూ.850 కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించ లేదని ఆరోపించారు.బోనస్ పైసలు, రైతు బంధు డబ్బులు, యాసంగిలో ఒక్క పైసా ఇవ్వని రైతులను మోసం, దగా చేసిన రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నాడనిప్రశ్నించారు. యూరియా బఫర్ స్టాక్ తగ్గిపోయిందని, గత ప్రభుత్వం వేసవిలోనే ఎరువులు కొరత లేకుండా చూసేదన్నారు. 25 శాతం ధాన్యం ఇంకా కల్లాలోనే ఉందని కరీంనగర్ మెదక్, నల్గొండ వరంగల్ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బస్తాల్లోని ధాన్యం మొలకెత్తి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అన్ని సెంటర్లలో అదే పరిస్థితి ఉందంటూ.. అధికారులు నీ మాట వినడం లేదా అని ఎద్దేవాచేశారు. అప్పుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ నీ పరువునే కాక రాష్ట్రం పరువును తీయడం అది కాదని, నీ పరువు నీవు తీసుకున్న పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయకని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు నా సొంత నిధులని కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా?జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్ ఏం ఇచ్చిండు? ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.25కోట్లను వాపస్ తీసుకున్నడు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేసీఆర్ రూ.30 కోట్లు ఇస్తే వాటిని కూడా వాపస్ తీసుకున్నాడు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నడని ఆరోపించారు.జహీరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి కి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులని వెంటనే ఇవ్వాలి. పాతవి ఇచ్చి కొత్తగా వంద కోట్ల రూపాయలని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు. సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుని పునరుద్దరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ లకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరపున డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా జాడి మల్కాపూర్ బయలుదేరి వెళ్లి దుర్గమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు, స్థానిక నేతలు ఎం.శివకుమార్, మాణిక్యం, గుండప్ప, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ ఇతర జిల్లా, స్థానిక నేతలు ఉన్నారు.

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.

కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

*కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక
విధానాలు మానుకోవాలి*

BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణంలోని BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలు అవలాంభిస్తూ 4 లేబర్ కోడ్ తెచ్చి కార్మికులను బానిసలను చేసే విధంగా చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ రోజు తంగళ్లపల్లిలో బీడీ కార్మికులతో కలసి ఫ్లకార్డులతో నిరసన చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వo కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.లక్షలాది మంది ఆధారపడి జీవనోపాది పొందుతున్న బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టి ఈ రోజు ఉపాధి లేకుండా చేసి బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసి కార్మికులను రోడ్డుపాలు చేస్తోందని మండిపడ్డారు.జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీడీ కార్మికులందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం.

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం

 

 

అల్గునూర్ సివోఈ నుండి బాయ్స్ హాస్టల్ పిల్లలను వేరే హాస్టల్ కు తరలించవద్దు -మచ్చ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

 

2007 సంవత్సరంలో ఉత్తర తెలంగాణ విద్యార్థుల కొరకు అత్యుత్తమ విద్యను ఐఐటి మరియు నీట్ పరీక్షల గూర్చి ఆనాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామంలో స్థాపించటం జరిగిందని, గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కోఎడ్యుకేషన్ విధానంలో ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు స్థాపించి ఎన్నో ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరిగింది.

కారణాలేవైనప్పటికీ నేడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ , కోఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్న ఈకళాశాలను కేవలము బాలికలకు మాత్రమే పరిమితం చేస్తూ బాలురకు ఉత్తమ విద్యా విధానాన్ని దూరం చేస్తున్న వైనం కుట్రతో కూడుకున్నదని భావించక తప్పడం లేదు.

ఏకారణం చేతనో ఉత్తర తెలంగాణ బాలురకు ప్రీమియర్ సివోఈ పాఠశాలను దూరం చేస్తూ ఈప్రాంతపు వారికి తీరని అన్యాయము చేస్తున్నారు.

గౌలిదొడ్డిలో మల్టీజోన్ రెండు నందు బాలురకి మరియు బాలికలకు వేరువేరుగా ఉత్తమ విద్యకొరకు సివోఈలను స్థాపించడం జరిగింది.

రాష్ట్రస్థాయి అడ్మిషన్ విధానము ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి ఎంపికగా ఈకరీంనగర్ ఉండేది.

కానీ మేనేజ్మెంట్ అనాలోచిత కారణంగా మల్టీ జోన్ వన్ నందు బాలురకు నేడు సివోఈ విద్యా విధానము దూరమైనది.

గౌలిదొడ్డిలో బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా కళాశాలలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా, కరీంనగర్లో వేరువేరుగా పెట్టినట్లయితే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది మీరు గమనించిన సమస్యలకు పరిష్కారం దొరికినట్లై అందరికీ న్యాయం జరుగుతుంది.

కరీంనగర్ లోని చింతకుంటను బాలికల కోసం మరియు ప్రస్తుత సివోఈ కరీంనగర్ నీ బాలుర కోసము నడిపినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అల్గునూర్ సివోఈ అలానే కోనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రిన్సిపాల్ డా.బి.సంతోష్ డమార్

పరకాల నేటిధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే నాణ్యమని విద్యాబోదన అందుతుందని పరకాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సంతోష్ కుమార్ అన్నారు.అపార అనుభవం మరియు సెట్,నెట్,పిహెచ్డి పిడిఎఫ్ లాంటి విద్యా అర్హలు కలిగిన అజ్ఞ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే ఉంటారనే విషయాన్ని గమనించాలని చెప్పారు.దోస్త్ మొదటి ప్రక్రియ ఈ నెల 21 వతేదీతో ముగుస్తుండని ఇంటర్,డిప్లమ పూర్తి చేసిన విద్యార్థిని,విద్యార్థులు పరకాల మరియు పరిసర గ్రామలలోని వారు దోస్త్ కేంద్రంను సంప్రదించి అడ్మిషన్ పొందాలని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.వివరాలకు కళాశాల దోస్తీ కోఆర్డినేటక్ డా.మల్లయ్య చరిత్ర అధ్యాపకులు,పోస్తే టెక్నికల్ అసిస్టెంట్,కంప్యూటర్ అధ్యాపకులు డాక్టర్.దుప్పటి సంజయ్ కుమార్ లని సంప్రదించాలని తెలిపారు.

ప్రభుత్వ భూములను కాపాడండి.

ప్రభుత్వ భూములను కాపాడండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం సమర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రి మండలం లో మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి పై అధికారులకు, వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మేధా చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన కొండూరు విద్యార్థులు.

“రాయపర్తి, నేటిధాత్రి*

 

 

మేధా చారిటబుల్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ లో జెడ్ పి హెచ్ ఎస్ కొండూరు పాఠశాల విద్యార్థులు గంకిడి సాయి వర్ధన్, బొబ్బల వర్షిత్ రెడ్డి లు సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత తెలియజేశారు. వీరికి శ్రీ మేధా ట్రస్ట్ నుండి సుమారు మూడు నుండి నాలుగు లక్షల విలువైన రెండు సంవత్సరాల ఉచిత విద్యను ప్రఖ్యాత నారాయణ, శ్రీ చైతన్య కాలేజిలలో అందిస్తారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఆచార్యులు, సత్యనారాయణ, రఘు, నాగరాజు, వెంకటరమణ, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్య నాయక్ , స్వామి, అమర స్వర్ణ ,శివకృష్ణ  అభినందించారు.

తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండల గ్రామాల్లో బంగ్లాగడ్డ కాలనీ ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు బంగ్లాగడ్డ కాలనీ చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు.

 

Jhara Sangam

జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో నీరు వృథాగా పోతున్నది.అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

Jhara Sangam

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య.

*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి..

ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…

కేసముద్రం  నేటి ధాత్రి:

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.

ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ.!

ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి

సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి,ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలియజేశారు.సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,హౌసింగ్ ఏఈ కాంక్ష,పంచాయతీ కార్యదర్శి ఏ.సత్యనారాయణ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

రెచ్చిపోయి వసూళ్లు.!

రెచ్చిపోయి వసూళ్లు.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.

collect

 

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.

collect

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.

మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది.

ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది.

ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది.

ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది.

ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు.

ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు.

అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం.!

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం
వనపర్తి నేటిధాత్రి

 

 

. సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని నేటికీ 207 సంవత్సరాలు అవుతుందని, ఆయన సిద్ధాంత రచన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై 177 సంవత్సరాలు అవుతుందని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేరళ తరహ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ ,జిఎస్ గోపి, బాల్ రెడ్డి ,ఏం. రాజు ,ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, ఆర్. ఎన్. రమేష్, బి. వెంకటేష్, బాల్య నాయక్, గుంటి వెంకటేష్ ,ఎం. పరమేశ్వరా చారి, ఎం. కృష్ణయ్య, ఎస్. రాజు, బి వెంకటేష్, ఎం. వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version