నల్లా ఓదెలు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు.!

నల్లా ఓదెలు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు మొక్కుబడి తీర్చుకున్న వేటూరి సత్యనారాయణ

మందమర్రి నేటి ధాత్రి

మాజీ ప్రభుత్వ విప్, మందమర్రి నేత నల్లా ఓదెలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా స్వస్థలమైన మందమర్రికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఓదెలు త్వరగా కోలుకోవాలని కోరాగట్టు అంజనేయ స్వామికి మొక్కుబడి పెట్టిన వేటూరి సత్యనారాయణ తన మొక్కుబడిని నెరవేర్చుకున్నారు. ఓదెలు ఆరోగ్యంగా తిరిగి వచ్చారని తెలుసుకున్న వెంటనే, వేటూరి సత్యనారాయణ మంగళవారం రోజున కోరగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో “ఓదెన్న ” పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కుబడి తీర్చుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, “మనసారా మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకోవడం అనేది భక్తికి నిదర్శనం. ఓదెలు గారు శీఘ్రంగా కోలుకోవడంలో ఆంజనేయ స్వామి కరుణ ఉందని నేను నమ్ముతాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్టూరు సత్యనారాయణ. నారా లింగన్న. ముంజం నరసయ్య. జెర్రీగల రవి బండారు సత్యనారాయణ. . వాసాల శంకరి సంఘీ సంతోష్ ఏర్పుల రవి ఆగునూరి పోశం తుంగపిండి శంకర్. తదితరులు పాల్గొన్నారు

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

యువత వ్యసనాలకు బానిస కావద్దు….

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version