వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.

బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి 

గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు  హాజరైనారు

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా.

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.

కారేపల్లి నేటి ధాత్రి.

 

 

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

ఖానాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పి ఎ సి ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.సన్నరకం వడ్లకు క్వింటాకు రూ500బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వ్యవసాయ సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి.

వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.

 

MLA

పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.

 

MLA

తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.

500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత ఆయా గ్రామ అంగన్వాడీ టీచర్స్ పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం మిట్టపల్లి,కుందారం గ్రామపంచాయతీలలో అంగన్వాడి సిబ్బందీలు వేరువేరుగా పోషణ పక్షం కార్యక్రమాలు చేపట్టారు.మిట్టపల్లిలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటి ప్రాముఖ్యతను తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేశారు. కుందారంలో వివో సంఘం మహిళలకు పోషణ పక్షం గురించి చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి తీసుకునే వివిధ పోషక పదార్థాల గురించి వివరించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేసి,ప్రతి ఒక్కరు వాటిని రోజువారి ఆహార దినచర్యలో చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, మహిళలు,వివో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

 

మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

 

MLA

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

హాజరైన కలెక్టర్ సత్య శారదా , అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెక్కొండ మండలంలోని గొట్ల కొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచనలు క్రమం తప్పకుండా పాటించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యాసంగి పంటలో వరి సాగు పెరిగిందని వరి ధాన్యం కొనుగోలలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

 

Farmers

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డి సి ఎస్ ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డి ఎం సంధ్యారాణి, డి పిఎం భవాని, తాసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్, నెక్కొండ వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, లతోపాటు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పార్వతమ్మ, పెండ్యాల హరిప్రసాద్, చల్ల శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, తిరుమల్ చౌహాన్, చల్ల పాపిరెడ్డి, సాయి కృష్ణ, భాను ప్రసాద్, సింగం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దూదిమెట్ల కొమురయ్య, నైజాం, గొట్లకొండ వివో అధ్యక్షులు సునీత, సరోజ, పార్వతి, జ్యోతి, నీలమ్మ, వి ఓ ఏలు సూర్య, ఏకాంబరం, గొట్లకొండ గ్రామ రైతులు, మహిళా సంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని కౌకొండ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించిన పోషణ మాసపక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహారంతోనే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.ప్రతి బిడ్డకి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతతో పాటు, పిల్లలకి స్థానిక ఆహార పదార్థాలు,చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసి అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలని తల్లులకు సూచించారు. అనంతరం పిల్లల ఎదుగుదల ఎత్తు బరువు కొలతలు పరిశీలించారు.తల్లులకు బాలింతలకు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమ్రోన్,స్వరూప, అరుణ,కల్పన,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’

 

అలంపూర్ / నేటి ధాత్రి.

 

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి‌. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనె‌ల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version