మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని
ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం అయినట్లు సమాచారం అలాగే సమీపాన ఉన్న స్థానిక చర్చిలో షార్ట్ సర్క్యూట్ తో చర్చిలోని వస్తువులన్నీ కాలిపోయాయి అలాగే స్థానిక రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ ఫ్యాన్లు కంప్యూటర్లు కాలిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్స్ కార్డు ఆన్లైన్ కోసం వచ్చిన రైతులు రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో రైతులందరూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు ఇంత జరిగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అటువైపు రాకపోవడం గమనార్హం, ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను తెలుసుకొని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు, రైతు వేదికలో కూడా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో బయటికి పరిగెత్తారు అనంతరం రైతులు రైతు వేదిక ముందు గల ప్రదేశంలో అగ్రికల్చర్ అధికారి మొబైల్ ఫోన్లో రైతుల ఆధార్ కార్డులు ఆన్లైన్ చేసుకుంటున్నారు, కాబట్టి రైతుల బాధలు స్థానిక ప్రజల బాధలు అర్థం చేసుకొని రైతు వేదికలో విద్యుత్ సమస్యను తొందరగా పరిష్కరించి పరిష్కరించి రైతుల కు సహకరించాలని అన్నారు ఏది ఏమైనా ఎంపీడీవో పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కావున వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.