వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.

 

MLA

పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.

 

MLA

తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.

500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత ఆయా గ్రామ అంగన్వాడీ టీచర్స్ పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం మిట్టపల్లి,కుందారం గ్రామపంచాయతీలలో అంగన్వాడి సిబ్బందీలు వేరువేరుగా పోషణ పక్షం కార్యక్రమాలు చేపట్టారు.మిట్టపల్లిలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటి ప్రాముఖ్యతను తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేశారు. కుందారంలో వివో సంఘం మహిళలకు పోషణ పక్షం గురించి చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి తీసుకునే వివిధ పోషక పదార్థాల గురించి వివరించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేసి,ప్రతి ఒక్కరు వాటిని రోజువారి ఆహార దినచర్యలో చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, మహిళలు,వివో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

 

మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

 

MLA

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

హాజరైన కలెక్టర్ సత్య శారదా , అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నెక్కొండ మండలంలోని గొట్ల కొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారద లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచనలు క్రమం తప్పకుండా పాటించి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యాసంగి పంటలో వరి సాగు పెరిగిందని వరి ధాన్యం కొనుగోలలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

 

Farmers

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డి సి ఎస్ ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డి ఎం సంధ్యారాణి, డి పిఎం భవాని, తాసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్, నెక్కొండ వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీఎం శ్రీనివాస్, లతోపాటు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పార్వతమ్మ, పెండ్యాల హరిప్రసాద్, చల్ల శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, తిరుమల్ చౌహాన్, చల్ల పాపిరెడ్డి, సాయి కృష్ణ, భాను ప్రసాద్, సింగం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దూదిమెట్ల కొమురయ్య, నైజాం, గొట్లకొండ వివో అధ్యక్షులు సునీత, సరోజ, పార్వతి, జ్యోతి, నీలమ్మ, వి ఓ ఏలు సూర్య, ఏకాంబరం, గొట్లకొండ గ్రామ రైతులు, మహిళా సంఘల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసపక్షం కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని కౌకొండ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించిన పోషణ మాసపక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషకాహారంతోనే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు.ప్రతి బిడ్డకి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతతో పాటు, పిల్లలకి స్థానిక ఆహార పదార్థాలు,చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసి అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలని తల్లులకు సూచించారు. అనంతరం పిల్లల ఎదుగుదల ఎత్తు బరువు కొలతలు పరిశీలించారు.తల్లులకు బాలింతలకు పోషణ ఆహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కమ్రోన్,స్వరూప, అరుణ,కల్పన,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’

 

అలంపూర్ / నేటి ధాత్రి.

 

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి‌. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనె‌ల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభోత్సవం

చలివేంద్రం ప్రారంభోత్సవం

మాజీ కౌన్సిలర్ కొమురెల్లి అనిత సుధాకర్ రెడ్డి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ ప్రధాన రహదారి రోడ్ నెంబర్ – 1 వద్ద శ్రీ సాయి గ్రాండ్ మినీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అధినేత శ్రీ ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం (వాటర్ ఫ్రీజర్)ను స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించినారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి వేసవి కాలంలో క్రమం తప్పకుండ బాటసారుల దాహర్తిని దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా చల్లని తాగునీటిని అందించాలని చల్లని ఫ్రీజ్ వాటర్ ఏర్పాటు చేసిన ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారి సేవలు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు కార్యక్రమంలో కోమిరెల్లి సుధాకర్ రెడ్డి,మోకు జగన్ మోహన్ రెడ్డి,కొత్త గోపాల్ రెడ్డి,మామిడి నవీన్ రెడ్డి,పైళ్ల మల్లా రెడ్డి,సారా బాల్ రాజ్, కోమిరెల్లి వీరారెడ్డి,ఉచిడి అంజన్ రెడ్డి,ఏనుగు రమణ రెడ్డి, పండగ నర్సింహా,మర్రి లక్ష్మా రెడ్డి,మోడల నర్సింహా,ఈశ్వర్,గుమ్మడి వేణు,భాష తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం రసూల్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కోవాల్సిన పోషకాహారం గురించి పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు,పండ్లు ఆకుకూరలు,చిరుధాన్యాలు,పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు చిరు ధాన్యాలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలియజేశారు.పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం మాత్రమే పెట్టాలని సూచించడం జరిగింది.ఇందులో భాగంగా అక్షరాభ్యాసం,సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల,ఆయా,గర్భిణీలు బాలింతలు,పిల్లల తల్లి తండ్రులు,ఇతరులు పాల్గొనడం జరిగింది.                           

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు

తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటోవాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కాశిబుగ్గ చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం.

కాశిబుగ్గ చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం.

కాశిబుగ్గ వర్తక సంఘం

కాశిబుగ్గ నేటిధాత్రి

శుక్రవారం రోజున లక్ష్మి గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ చౌరస్తాలో కాశిబుగ్గ వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి,19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత, భాస్కర్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు.అదేవిధంగా మజ్జిగ కూడా పంపిణీ చేయటం జరిగింది.లక్ష్మి గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఎండాకాలంలో 80 రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. రామనాథం రఘు కిషోర్, ప్రవీణ దంపతులు ఎన్నారై వారి సహకారంతో ఫ్రిడ్జ్ ద్వారా మినరల్ చల్లని నీళ్లను ప్రజలకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా దాతల సహకారంతో 80 రోజులపాటు రోజు మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం రోజు మజ్జిగ దాతగా లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు వంగరి ప్రవీణ్ జ్ఞాపకార్థం వారి భార్య వంగరి కళ్యాణి నిర్వహించడం జరిగినది. లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గము సభ్యులు ప్రతిరోజు సేవలు అందించడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భయ్యా స్వామి, మండల శ్రీరాములు, వడిచెర్ల సదానందం, గుళ్ళపల్లి రాజ్ కుమార్, ఓరుగంటి కొమురయ్య, మండల సురేష్,దుస్స కృష్ణ, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు మరియు లక్ష్మీగణపతి సహకార సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది

సొమ్ము కేంద్రానిది
సోకు రాష్ట్రానిది

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో బియ్యం మాత్రమే

ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది

ఊర నవీన్ రావు
మండల అధ్యక్షులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం
ప్రతి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం ఒక్కో కిలో కు40 రూపాయలను వెచ్చిస్తున్నది
ఈ మొత్తం కూడా కేంద్రమే భరిస్తున్నది అలాగే కరోనా ఆపద సమయం నుంచి పేదలకు ఇబ్బంది కాకుండా ఉచిత పథకాన్ని నిరాటంకంగా ఇప్పటికీ కేంద్రం కొనసాగిస్తున్నది కేంద్రం ఐదు కిలోలు అందియగా రాష్ట్రం ఒక్క కిలో మాత్రమే కలుపుతున్నారు
సన్నబియ్యానికి 10 రూపాయలు మాత్రమే కలిపిన రాష్ట్ర ప్రభుత్వం
దీంతో మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుతుంది ఇవన్నీ స్థానిక ఎన్నికల కోసమే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లో
విఫలమై ప్రజలను మార్చడానికి
కేంద్ర పథకాన్ని కూడా వాడుకోవడానికి దిగజారారు ఇక మీ మాయ మాటలు ప్రజలు నమ్మరు. రాబోయే కాలంలో స్థానికఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. అని ఆయన అన్నారు.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇంచార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ రమాదేవి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ ఐ ప్రీతి, కంప్యూటర్ శ్రీకాంత్ గౌడ్, కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version