తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత 30 సంవత్సరాల క్రితం పోరాటం సాధిస్తూ వస్తుందని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు మాదిగ మాదిగ ఉపకులాలకు హక్కుల కోసం కృష్ణ మాదిగ జులై ఏడున. ప్రకాశం జిల్లా నుండి ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ను స్థాపించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని అహర్నిశలు కొనసాగించారని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు ఇట్టి కార్యక్రమాన్ని మాదిగ కులాల ఉపకులాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పసుల సుధాకర్ పసుల కమలాకర్. పసుల డేవిడ్. రాజు. బూడిద సంతోష్. పసుల రఘు. బొల్లారం . నానక్. బందా రం ప్రేమ్. దుమాటి రాజయ్య. బొల్లారం దుర్గయ్య. తిరుపతి. జంగంపల్లి రాజు. తదితరులు పాల్గొన్నారు

మణిక్ రావు జన్మదిన వేడుకలు.

జహీరాబాద్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మణిక్ రావు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు జన్మదినం సందర్భంగా జహీరాబాద్ నాయకులు కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు .

ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు రోగులను పళ్ళు పంపిణీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి పార్టీ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ బంజారా నాయకులు గోపాల్ బానోత్ మరియు సంజయ్ పవార్ గారి ఆధ్వర్యంలో లో ఎమ్మెల్యే మాణిక్ రావు గారి జన్మదిన సందర్బంగా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రేడ్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో నాయకులు మండల ముఖ్య నాయకులు దేవిదాస్ జాదవ్, పార్టీ నాయకులు జితేందర్ మాజీ సర్పంచ్, శంకర్ చౌహన్, జ్ఞానందర్ బానోత్, చందర్ సామి, బిక్కు, ఖిరుసింగ్, రాజు చౌహన్,యువ నాయకులు సంతోష్ జాదవ్, విన్నీ పవార్, రవికిరణ్ సంతు చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు
స్థానిక ముద్దు బిడ్డ, శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేషం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజిమ్, సీనియర్ నాయకులు నామ రావికిరణ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్,మాజీ కౌన్సిల్లర్ అబ్దుల్లా, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, బిఆర్ఎస్వి అధ్యక్షులు రాకేష్,ఎస్సి సెల్ పట్టణ్ణ అధ్యక్షులు శివప్ప,
పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉప సర్పంచులు ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ,బిఆర్ఎస్వి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భవ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల పట్టణ అధ్యక్షుడు బుర్ర అభిజ్ఞ గౌడ్ ఆధ్వర్యంలో ఎబివిపి జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం అభిజ్ఞ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని 1949లో నలుగురి విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు అన్ని యూనివర్సిటీలలో కళాశాలలో అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ పని దేశం ధర్మం కోసం పనిచేసే విద్యార్థి సంఘం జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎబివిపి అని వారు అన్నారు..

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు
పాల్గొన్నారు.

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
మహాదేవపూర్ నేటి ధాత్రి :

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిఅని పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్నమెంట్ 108 వాహనం ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు చేరవేసిన మహానేత అని కొనియాడారు వైయస్సార్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారు, ఫ్యాక్స్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయి రామారావు గారు,మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్ గారు,మాజీ పాక్స్ చైర్మన్ వామన్ రావు గారు,అంబట్ పల్లి మాజీ సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు గారు, దేవస్థానం డైరెక్టర్ పద్మ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తడకల జగదీశ్,దాగం సంతోష్, రాఘవేంద్ర,కడర్ల నాగరాజు, చెక్రధర్,పోత రామకృష్ణ, చెంద్రశేఖర్ రెడ్డి,అయిత తిరుపతి రెడ్డి, శంకర్, బాపు లక్ష్మయ్య తదితరులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రికి ఆదర్శమని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 108 వాహనం, పేదలకు ఆరోగ్యశ్రీ ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ప్రజలకు చేరవేసిన మహానేత అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల వేణు, బుడిగ శ్రీనివాస్, గోపతి బానేష్,గోపు రాజం,రామ కృష్ణ,బొద్దుల ప్రేమ్ సాగర్,పసరకొండ కృష్ణ,గోళ్ళ మల్లేష్,రామ్ సాయి,రవీందర్,గూడ సత్తయ్య, లచ్చులు, మహిళ నాయకురాళ్లు పందుల సునీత, కమల,జాలిగపు రాజేశ్వరి, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిని ఆశీర్వదించిన ఆర్టీసీ సిబ్బంది.

చిన్నారిని ఆశీర్వదించిన ఆర్టీసీ సిబ్బంది.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కానిస్టెబుల్ బానోత్ దేవేందర్ చిన్న కుతురు హరిని రాతోడ్ మొదటి పుట్టిన రోజు వేడుకలు డిపో సిబ్బంది పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో డిపో హెడ్ వీరారెడ్డి, గోవర్దన్,ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్, రమేష్ కోచ్ బిల్డర్ మల్లేశం, పెయింటర్ గణెష్ హాజరైయ్యారు.

ఘనంగా మొహరం వేడుకలు .

ఘనంగా మొహరం వేడుకలు .. సిద్ధిక్ సాహెబ్ పీర్ల మసీదుకు పోటెత్తిన భక్తులు

జహీరాబాద్ నేటి ధాత్రి:
 
జహీరాబాద్ మాణిక్ ప్రభు మహిళలో సిద్ధిక్ సాహెబ్ పీర్లను మొహమ్మద్ అహ్మద్ సాహెబ్ కు చూసేందుకు భక్తజనం పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.భక్తుల రాకతో నియోజకవర్గలో సందడి నెలకొంది. భక్తులు మేళ తాళాలతో పీర్ల చావడీని దర్శించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు హసన్, హుస్సేన్ లకు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొందరు బెల్లం, పుట్నాలు, గోధుమలతో తయారుచేసిన మలీజా నైవేద్యాన్ని సమర్పించుకున్నారు.అత్యంత వైభవంగా జరిగే మొహరం ఉత్సవాల్లో భాగంగా చిరు వ్యాపారులు గాజులు, మిఠాయి, ఆట వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ.!

ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

M R P S మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌ శ్రీ మంద కృష మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మండల ఇంచార్జ్ రేణుకుంట్ల సంపత్ మాదిగ హాజరైజెండా ఆవిష్కరణ చేశారు స్వీట్ల పండ్లు పంపిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తదనంతరం మండల సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాల ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజం అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో B J P భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి B J P జిల్లా నాయకులు శవ శేషగిరి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జీడీ సంపత్ మాదిగ అంతడుపుల సారంగపని మాదిగ రొంటాల రాజ్ కుమార్ మాదిగ మంద సాంబయ్య మాదిగ బండారి రామస్వామి మాదిగ పుల్యాల భగత్ మాదిగ వివిధ గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు . .
రాయికల్. నేటి ధాత్రి. జులై 07
రాయికల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను వేణు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మంచి వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎబిసిడి వర్గీకరణను నేడు సాధించారని కొనియాడారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాపురపు నర్సయ్య, తలారి రాజేష్, వెంకటేష్, ప్రకాశ్, రాజేష్, సాయిలు, దిల్ రాజు, నిగ రాజేష్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు.!

మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు గ్రామ పెద్దలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము సాయంత్రం పగటి సవార్లు మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు.పీర్లకు చక్కెర,గంధం, కొబ్బరిగిన్నెలు, దట్టీలు, పూల దండలు సమర్పించి ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. ధూపంతో ప్రత్యేక మొక్కులు చేశారు. పెద్ద సవారి కార్యక్రమంలో భాగంగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి.11-00ల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో పీర్లను ఊరేగించి, మసీదుకు దర్గాలకు.తీసుకెళ్లి మగ్గబెట్టి పూర్తి చేస్తారు

జహీరాబాద్ : పీర్ల పండుగ (మొహర్రం)ను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నాగుల కట్ట దగ్గర ఏర్పాటు చేసే పీర్లను ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగించారు. అహ్మద్ సాహెబ్ సాయంత్రం పట్టణంలోని పీర్లు వెళ్లి కలవడంతో అక్కడ జాతరను తలపించింది.

 

ఝరాసంగం: మండల కేంద్రంతో పాటు చిలేపల్లి మేడపల్లి కంబాలపల్లి బొప్పనపల్లి కుడు సంఘం తుమ్మనపల్లి తదితర గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీర్లకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆదివారం పీర్ల ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో పీర్ల పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలకు షర్బత్‌ను పంపిణీ చేశారు.

మొగుడంపల్లి : మండల ధన సిరి జాడి మల్కాపూర్ ఇప్పేపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్‌ వార్డు సభ్యుడు, ఉప సర్పంచ్‌ తదితరులు ఉత్సవాల్లో పాల్గొని పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కోహీర్: మండల పరిగిలో పీర్లతో నిర్వహించిన ఊరేగింపు వైస్ చైర్మన్ షాకేర్ పాల్గొని మాట్లాడారు. మొహర్రం మత సామరస్యానికి పత్రీకగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.

న్యాల్కల్ : మండల డప్పూర్ మల్గి మెటల్ కుంట హద్నూర్ తదితర గ్రామాల్లో ఆటాపాటలతో అలావ్‌ ఆడుతూ పీర్లను ఊరేగించారు. సాయంత్రం సమీపంలోని చెరువుల్లో పీర్లను నిమజ్జనం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మహమ్మద్ జుబేర్ (హౌసింగ్ బోర్డ్) గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా శనివారము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,విజిలెన్స్ మెంబర్ రామకృష్ బంటు,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకట్ ,నాయకులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు ముర్తుజా,జాకీర్,సలీం,అవేజ్,విజయ్ రాథోడ్ ,ఫహీం,తదితరులు.

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి;

బిజెపి జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి జహీరాబాద్ లో డాల్ఫిన్ బర్త్డే సెలబ్రేషన్స్ పాయింట్ లో శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో జరుగుతున్నా వారహిదేవి నవరాత్రి మహోత్సవులో శుక్రవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దేవగిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

నాట్స్ సంబరాలు ప్రారంభం…

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన మరో వైపు వెరసి.. టాంపా తెలుగుదనంలో తడిసి పరవిశించింది.

వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నర్తనశాల పేరుతో దిగువ భాగాన్ని, రంగస్థలం పేరుతో పైభాగాన్ని ఈ వేడుకల నిర్వహణ కోసం నామకరణం చేశారు. రంగస్థల వేదికపై బ్యాంక్వెట్ విందు నిర్వహించారు.

సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేశారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రారంభమైన నాట్స్ నేడు అమెరికాలో తెలుగు సంఘాల సేవా కార్యక్రమాల్లోనే కాకుండా మహాసభల నిర్వహణలో సరికొత్త రికార్డు నెలకొల్పిందని, వేడుకలు విజయవంతం చేయడంలో తనకు సహకరించిన వారందరికీ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ టాంపా అనే ఊరు పేరును ఇకపై నది, అమెరికా సంస్కృతి అని కాకుండా.. నాట్స్ సంబరాలు జరిగిన నగరంగా గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆయన స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జయ్ కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన జులై 4వ తేదీన ప్రవాస భారతీయ సంఘమైన నాట్స్ సంబరాల్లో పాల్గొనడం అమెరికాలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. డా. దేవయ్య, రుద్రమ్మ పగిడిపాటి దంపతులకు విశేష సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. రచయితలు కళ్యాణ్ చక్రవర్తిని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, రామజోగయ్య శాస్త్రిని మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బుల్లితెర నటీనటుల హాస్యవల్లరి అలరించింది.

సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తారలు జయసుధ, రజిత, సుధీర్‌బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, మెహెర్ రమేష్, థమన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ అతిథుల వద్దకు వెళ్లి వారితో ఫోటోలు దిగి మరీ సభా ప్రాంగణమంతా సందడి చేశారు.

ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, నాదెండ్ల మనోహర్‌లతో పాటు మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి మీనా, జయసుధ, నటుడు సాయికుమార్ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. బ్యాంక్వెట్‌కు చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరితో ముగింపు పలికారు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.

Assistant Commandant Jagadeeshwar Rao, officers

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మహేంద్రనాథ్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు.

మహేంద్రనాథ్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు…

మహాదేవపూర్ జూన్ 28 (నేటి ధాత్రి ):

యాదవ జాతి ముద్దు బిడ్డ అఖిల భారతీయ యాదవ సంఘం మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తి దారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు “శ్రీ సందనవేన మహేంద్రనాథ్ యాదవ్” గారి జన్మదిన సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, స్విట్స్ పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కన్నెవేణి ఐలయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు కాటవేణి రాజయ్య యాదవ్, కాట్రేవుల నవీన్ యాదవ్, పర్శవేని నగేష్ యాదవ్, ములుకల తిరుపతి యాదవ్, పిడుగు బాపు యాదవ్, దాసరి దేవేందర్ యాదవ్, సిద్ది శంకర్ యాదవ్, బత్తిని మల్లేష్ యాదవ్, అఖిల్ యాదవ్, కొమురయ్య యాదవ్, రాకేష్ యాదవ్, జాగరి రాజయ్య యాదవ్, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…*

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version