వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.!

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.

Silver Jubilee

27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,
గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

ముసాపెట్ మండలం.మహ్మద్ హుసేన్ పల్లి గ్రామాని కి చెందిన మాజీ సర్పంచ్ నిర్మల కాశీ నాథ్ సాగర్ సోదరుడు వెంకటయ్య కుమారుడు శేఖర్ దీపిక వివాహా వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్ల శేషయ్య సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ చెన్నారెడ్డి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారు

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు…

విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల ప్రధానోత్సవం…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.

Education

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

6వ రోజు అగ్నిమాపక వారోష్టత్సవాలు.

6వ రోజు అగ్నిమాపక వారోష్టత్సవాలు

గ్యాస్ గోదాంలో ప్రమాద నివారణ చర్యల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది

పరకాల నేటిధాత్రి

 

పరకాల పట్టణ పరిధిలోని ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ గోదాంలో శుక్రవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్యరంలో 6వ రోజు వారోత్సవాలు నిర్వహించారు.గ్యాస్ గోదాం వద్ద మేనేజర్,సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యల గురించి అవగాహన కల్పించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషర్స్ ఏర్పాటు చేసుకోవాలని,నిర్దేశించిన సమయంలో వాటిని రిఫిల్ చేసుకోవాలని మరియు ఎలా ఉపయోగించాలి అని అవగాహన కల్పించారు.వాటర్ హైడ్రెన్డ్స్, స్పింక్లార్ల్ను ఏర్పాటు చేసుకోవాలని,రేడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉంచాలని అతి ఉష్టాన్ని వెలువరిచే విదుత్ దీపాలను నియమించి, హలొజెన్ దీపాలను వాడవలని తెలిపారు.అత్యవసర సమయాలలో గోదాము సిబ్బందికి,సెక్యూరిటీకి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది ఎల్ఎఫ్.చారి,డ్రైవర్ గణేష్,అగ్ని మాపకులు అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

Graduation Day

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.!

ఘనంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగామండల విద్యాధికారి అంబాటి వేణు కుమార్ హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్, మాజీ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ చిలువేరి స్వప్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, మ్యాకల నాగరాజు, మడ్డి మనోజ్, ఉత్కం శ్రీనివాస్, మచ్చ పవన్ కళ్యాణ్, మంద రాజశేఖర్, కత్తి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ & మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కాలువ పూలమాలలతో కేక్ కట్ చేసి
జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు వైద్యనాథ్ అఖిల్ మియా బసవరాజ్ జాలేందర్ మహేష్ సునీల్ సిద్దూ సాయినాథ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆసుపత్రిలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి

పరకాల ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు. 

దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 
నెక్కొండ,నేటిధాత్రి:*

నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.!

అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ గారు అందించిన సేవలు ఆమోగమని భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ గారు దేశ రాజ్యంగాన్నీ తీర్చిదిద్దారని అన్నారు,వారు ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు డి.మాణిక్ ప్రభుగౌడ్ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,శివ కుమార్,పి.జి.ఈశ్వర్,యస్, గోపాల్,చెంగల్ జైపాల్,బి. వేణుగోపాల్,యస్.శ్రీనివాస్, రాజేందర్,దిలీప్,ప్రేమ్ కుమార్, ప్రకాష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నాగారం లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.

నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

చిట్యాలమండలం లోని చల్లగరిగ గ్రామంలో నేడు అంబేద్కర్ చౌరస్తాలో డా: బిఆర్ అంబేద్కర్ 134,వ జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త నోముల శివశంకర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి అశోక్ గార్ల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి,స్విట్స్ పంచిపెట్టాడం జరిగింది, అనంతరం
మాట్లాడుతూ డా: బిఆర్ అంబేద్కర్ గురించి 120 దేశ ల రాజ్యాంగం లను అవపాసన పట్టీ ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పాలన విదానాన్ని,తేలిపిన విశ్వ మేధావి అని కొనియాడారు, ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజు గారు, సినియర్ నాయకులు నల్ల రాజిరెడ్డి , సిరి పెళ్లి జంపయ్య గారు, నోముల నాగరాజు గారు,సోమిడి రఘుపతి ,జరిపోతుల ఓదేలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,దూడపాక సరోత్తం, మరియు, బిసి ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు..

బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్
134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో
డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు.
అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి,
మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు

పరకాల అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య

బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు

 

పరకాల నేటిధాత్రి

 

సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.

అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు

అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్మించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కన్నె అరుణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ కన్వీనర్ రెడ్డి మల్ల సుఖేందర్ పోకల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులుకోసిని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు ఇటికల మహేందర్ సహాయ కార్యదర్శి రెడ్డి మల్ల ఆశీర్వాద్ మహేష్ బలగం భాస్కర్ గౌడ్ నిఖిల్ బాబు అధ్యక్షులు జంగం కిషన్ బుజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version