తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత 30 సంవత్సరాల క్రితం పోరాటం సాధిస్తూ వస్తుందని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు మాదిగ మాదిగ ఉపకులాలకు హక్కుల కోసం కృష్ణ మాదిగ జులై ఏడున. ప్రకాశం జిల్లా నుండి ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ను స్థాపించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని అహర్నిశలు కొనసాగించారని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు ఇట్టి కార్యక్రమాన్ని మాదిగ కులాల ఉపకులాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పసుల సుధాకర్ పసుల కమలాకర్. పసుల డేవిడ్. రాజు. బూడిద సంతోష్. పసుల రఘు. బొల్లారం . నానక్. బందా రం ప్రేమ్. దుమాటి రాజయ్య. బొల్లారం దుర్గయ్య. తిరుపతి. జంగంపల్లి రాజు. తదితరులు పాల్గొన్నారు