భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు

– తహసిల్దార్ జాలీ సునీత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మొగుళ్లపల్లి తహసిల్దార్ జాలీ సునీత తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి మరియు పోతుగల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసిల్దార్ సునీత రైతుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి..రిజిస్టర్ లో నమోదు చేశారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ప్రజలు రెవెన్యూ సదస్సులలో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. అలాగే నేడు గురువారం మండలంలోని రంగాపురం మరియు అంకుషాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని భూములకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారు వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ జాలీ సునీత సూచించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ రంగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ రామకృష్ణ మరియు రెవెన్యూ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం చేసే మిల్లులపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారుమంగళవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగోలు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగర్ కర్నూల్ వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారున్నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారువనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే
బియ్యం ఎవరు చేస్తారని మిల్లర్ల ను ప్రశ్నించారు తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని
స్పష్టం చేశారు.ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుండా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు సమీక్షలు పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పండిం చారని అన్నారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో రెడ్డి రావులకు అమృత అధికారం వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు విషాంధకారం లభించింది ఈ అశుభ సందర్భంలో తెలంగాణ అమరవీరుల స్థూపాలపై “తెలంగాణలో బలైపోయిన అమరవీరులంతా బీసీ ఎస్సీ ఎస్టీ” లు- “అధికారంలోకి వచ్చిందంట అగ్రకుల దొరలు” అనే రెండు లైన్లు అని భూపాలపళ్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద రాయడం జరిగిందన్నారు ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మేల్కొని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో అంతర్భాగమై 93 శాతం ఉండేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాసగాని దేవేందర్ గౌడ్ ,హాబీబ్ పాషా కండే రవి, పుల్ల అశోక్, పర్ల పెళ్లి కుమార్ ,నేరెళ్ల రమేష్ ,కోరళ్ళ శ్యామ్, రవీందర్ బోయిని ప్రసాద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

ఓపెను జిమ్ కొరకు ప్లేస్ పరిశీలన కమిటీ సభ్యుల సమావేశం.

కల్వకుర్తి/ నేటిదాత్రి :

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని యోగ గ్రూప్ సభ్యులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రోజు వాకింగ్ మరియు ఎక్ససైజ్ చేస్తుంటారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో చివరిలో’ ఓపెన్ జిమ్ ఉంటే బాగుంటుందని గత నెల రోజుల క్రితం ఆనంద్ కుమార్, కల్వకుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల పట్టణ అధ్యక్షులు వాస శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిని పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు తో మాట్లాడి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో చర్చించి “ఓపెన్ జిమ్”మంజూరు చేయించినట్లు తెలిసినది. ఇందులో భాగంలోనే మంగళవారం పాఠశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించినారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు.

అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న రామగిరికృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డాక్టర్. ఏ శ్రీనివాస్ హెడ్ కెవికె. డాక్టర్ అర్చన ఎస్ఎంఎస్ అనిమల్ హస్బండ్రీ. డాక్టర్. నీరజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐ సి ఏ ఆర్ హైదరాబాద్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ. ఐటి శాఖ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు సాధారణంగా ఎప్పుడు వేసి వరి పంట కాకుండా ఇతర కూరగాయలు . మరియు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటలు సాగు చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా ఎదగాలని మరియు పెరటి కోళ్ల పెంపకం. పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా. మరియు గొర్రెలు, ఆవులు, బర్రెలు. పెంచి వాటి ద్వారా ఆర్థికంగా రైతు లాభం పొందవచ్చని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామాన్ని మూడు సంవత్సరాలు దత్తత తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు శ్రీనివాస్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ , సెక్రటరీ మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ చిగురు స్రవంతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో డైరెక్టర్ పోతు పెద్ది రమణారెడ్డి.రైతులు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

తొర్రూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్పష్టం చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు..

పట్టాల పంపిణీ అనంతరం, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి మండలంలో పథకాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు..

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ.

గ్రామ గ్రామానికి నాణ్యత మైన విత్తనాల పంపిణీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి 
https://youtu.be/lZAh9MZCMGM?si=gwWCHvLV1oSiHtzR
     
  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం (ఎపిసోడ్-56) కార్యక్రమానికి శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గారు, శ్రీ.. నేరెళ్ళ రమేశ్, ADA, భూపాలపల్లి , శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త  మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక లో  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. బి. గోపి, డైరెక్టర్ ఒఫ్ అగ్రికల్చర్          శ్రీ.ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు ప్రసంగం చేయడం జరిగింది,  వానాకాలనికి అనువైన సన్న వరి ధాన్యం రకాల గురుంచి చర్చించడం జరిగింది, వాతావరణ ఆధారిత వానాకాల  వ్యవసాయం పై రైతులకు సలహా ఇవ్వడం జరిగింది, అలాగే “నాణ్యమైన విత్తనం” నిర్వహణపై చర్చించడం జరిగింది,  రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆయా రైతు వేదికల ద్వారా “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగింది.   మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం”  అనే కార్యక్రమంలో  వరి రకం WGL-962 మరియు పెసర రకం MGG-385 అనే విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ” కార్యక్రమంలో శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి , శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి గారు, శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త, స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.

అడ్డంగా నిలువు దోపిడి…

అడ్డంగా నిలువు దోపిడి…

బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో ఫర్మిషన్…

ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు…

జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్…

పాఠశాలల్లోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు..

యూనిఫాం,బెల్ట్,బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే…

ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేలకు పైగా వసూలు…

పెద్ద తరగతి విద్యార్థి నుంచి రూ. 20 వేలకు పైగా వసూలు…

మెంటనేన్స్ షరా మామూలే…

అడ్డంగా నిలువు దోపిడీ నోరు మెదపని విద్యాశాఖ…

జిల్లాలో అధికారుల పర్యవేక్షణ కరువు..

నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకుంటున్న అధికారులు…

జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…

నేటి ధాత్రి –

 

 

 

 

గార్ల :-పాఠ్య పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైనా మా దగ్గరే కొనాలి..! లేకుంటే అనుమతించేది లేదు..,అంటూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అడ్డంగా దోచుకుంటున్నాయి. ప్రతీది వారి వద్దే కొనాలని షరతులు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం పాఠశాలలను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వారు నిర్ణయించిందే ధర. వర్క్ పుస్తకాలు..,నోటు పుస్తకాలు.., డ్రాయింగ్ బుక్స్..,అంటూ బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ నోరు మెదపడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్..,
జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై దోపిడికి తెగబడుతున్నాయి. పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైన మా దగ్గరే కొనాలి…! అంటూ హుక్కుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను బహిరంగంగానే పీల్చి పిప్పి చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర. బయట మార్కెట్ లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్.., లేకుంటే క్లాస్ లో నుమతించేది లేదని తెగేసి చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్లకు కనిపించడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై పాఠశాలలో విక్రయిస్తున్న స్టేషనరీ ధరలు ఇలా ఉన్నాయి. యూని ఫాం (ఒకజత) రూ.1500 నుంచి రూ.3000, బెల్ట్ రూ.150 నుంచి 200, టై రూ.100, బ్యాగు రూ.600 నుంచి రూ. 800, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ రూ. 4000 నుంచి రూ.6000 వరకు విక్రయినున్నారు. ఇవి చాలదన్నట్లు వర్క్ బుక్ ల పేరుతో రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీది ఇక్కడే కొనాలన్న నిబంధనలు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి కనీస చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ మండల విద్యాధికారి అనుమతి ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి నగదు వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలాది రూపాయల ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్, స్పోర్ట్, స్పెషల్ డేస్, కమ్యూ నికేషన్ ప్రోగ్రాం ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, షూ అంటూ అందిన కాడికి అందినంత దోచుకుంటున్నాయి.

కనిపించని మౌళిక వసతులు….!

Government Subjects.

 

 

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. పూర్తిస్థాయి మౌలిక వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపెట్ట వచ్చు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు సరిపడా ఆటస్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలా అరకొర వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడీ అదనంగా ఉంటోంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుందనుకున్నా..,గరిష్టంగా రూ.1500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలు పుస్తకాల ఖర్చు సరిపోతుంది. అయితే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలవరకు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోననే భయంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం మానేశారు. ఇది ఆసరాగా చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహకులు దోపిడీని పెంచారు.

విద్యాశాఖ అధికారుల తనిఖీలు నిల్…!

వాస్తవానికి ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు నిషేధం. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి పుస్తకాల అమ్మకాలను అడ్డుకోవాల్సి ఉంది. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే విద్యాసంస్థల నిర్వా హకులు బహిరంగానే పుస్తకాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఏ తరగతికి ఎంత చెల్లించాలి? నోట్ పుస్తకాలకు ఎంతా?, బెల్టుషూ వంటిది ఎంతా?.. ధరలు నిర్ణయించి వసూలు చేస్తు న్నాయి. ప్రతి వస్తువు కొనుగోలుకు రసీదు ఇవ్వాలన్న నిబంధన తూట్లు పొడిచి తెల్లకాగితంపై రేట్లు వేసి దోచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ తో పోల్చితే ఈ ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. నిర్దిష్ట గడువు నిర్ణయించి పుస్తకాలు కొనుగోలు చేయాలని లేకుంటే క్లాస్ లోకి అనుమతించేది లేదని చెబుతున్నాయి. ఇవేమీ అధికారులకు కనిపించడం లేదు. నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాల దోపిడీ యధేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

11 కె.వి విద్యుత్ వైర్ పంట పొలాలలో యమ పాశాలుగా తయారయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 11 కె.వి విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయి. ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కింది నుండి చేయి చాచితే చేయికి వైర్లు తగులుతున్నాయన్నారు. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీని పై సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ.

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్ర:

ఝరాసంగం మండల పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి బర్దిపూర్ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం – రాజేంద్రనగర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ హాజరై ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పెసర రకం MGG-295 మరియు కంది WRGE-96 రకాల యొక్క లక్షణాలు మరియు పంట సాగు మెలకువలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమం కింద ఝరాసంగం మండలానికి MGG-295 అనే పెసర రకం 80 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) అలాగే WRGE -97అనే కంది రకం మన మండలానికి 50 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) కేటాయించడం జరిగింది అని తెలిపారు. పంట పూర్తి కాలంలో వివిధ దశల్లో క్షేత్ర సందర్శన నిర్వహిస్తామని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఝరాసంగం చైర్మన్ గౌస్ ఉద్దీన్ మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, మల్లన్న పటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, హరికృష్ణ, ఙ్ఞానం, రేణుక వేదవతి, భారతి మరియు రైతులు మల్ల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

భూ భారతి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.

— భూ భారతి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
• ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
• తహసిల్దార్ శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మండల తాహసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో తమ గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యల పరిష్కారానికి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండల స్థాయి సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సులో ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు గ్రామంలో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ధరణి ఆపరేటర్ రాజు, సిబ్బంది కళ్యాణ్, నవీన్, గ్రామ ప్రజలు ఉన్నారు.

ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు.

ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ 6 వేల మంది సర్వేయర్లను నియమించి ప్రజల భూ సమస్యలను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎంపీఓ తిరుపతి బాపూరావు, ఎస్సై జాడి శ్రీధర్, పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇతర సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల సమావేశం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలు సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని,సమాచారం మేరకు,మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం పై 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినట్టు తెలిపారు.ఆ దాడులను ఖండిస్తూ రాజారాం కు ఎలాంటి హాని తలపెట్టిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని అన్నారు.దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై దాడులకు,ప్రతి దాడులకు హిందూ సమాజం సిద్దంగా ఉంది అని, తెలియజేస్తూ ఖబర్దార్ మతోన్మాద శక్తుల్లారా, ఖబర్దార్,అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కర్ణ కంటి రవీందర్,రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్ కొట్టినటేశ్వర్,వి హెచ్ పి కోశాధికారి బైరి విష్ణు దాస్,సందేశ్గుప్తా,శివాజీ సేన ఉదేయ్,శ్రీకాంత్,సంతోష్,బద్రి నారాయణ,వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుణ్ణి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ప్రజా క్షేత్రంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్.

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version