ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల పిఆర్సి పెండింగ్ డీలను చెల్లించేలా అసెంబ్లీలో లేవనెత్తాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి తెలిపారు.
