పరీక్ష కేంద్రాల వద్ద అతిక్రమిస్తే చర్యలు తప్పవు
దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి
దుగ్గొండి,నేటిధాత్రి:
ఈనెల 14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకానునట్లు ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అలాగే ఎగ్జామ్ సెంటర్ లకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరువకూడదని తెలిపారు.
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను మాస్ కాపీయింగ్ చేసేందుకు గాని ఎవరికైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేయడానికి వస్తే, వారి వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినవస్తుందని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
