కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి వార్డు ప్రజలను కోరారు. నర్సంపేట పట్టణంలోని 30వ వార్డులో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన వార్డు సభలో 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోని ఇందిరమ్మ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి జరుగుతోందని పేర్కొన్నారు.వార్డు సభలో మహిళలు తమ ప్రాంతంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని వినతిపత్రం సమర్పించగా, వాటి తొలగింపుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, డివిజన్ ఆర్‌పి, మున్సిపల్ జవాన్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న..

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న

◆-: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు రవి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,12వార్డు ఇంచార్జి ఇనాయత్,కౌన్సిలర్ అరుణ్ కుమార్,14వార్డు ఇంచార్జి రాజ్ కుమార్,నరేష్ బబ్లూ,నర్సింహా యాదవ్,మోహీన్,పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా…

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

కౌన్సిలర్ లతో వార్డుల్లో పర్యటించిన చైర్ పర్సన్ పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17, 9వ వార్డుల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 17వ వార్డు కౌన్సిలర్ సలావుద్దీన్ అయూబ్ ఖాన్,సంబంధిత అధికారులతో కలిసి తో కలిసి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లు పర్యటించారు. 17వ వార్డు మరియు 9వ వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.అర్హులందరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించే పథకాలు అందిస్తామని తెలిపారు.వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే స్పందించి తమదృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు కాట శ్రీనివాస్, జూలూరి కావ్య, వాటర్ సప్లై కొల్లూరి రంజిత్, వార్డు జవాన్ మాదాసి భరత్, మాజీ కౌన్సిలరు మేర్గు సాంబయ్య, మాజీ ఎంపీటీసీ పేరం బాబు రావు, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, 9వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల వీరస్వామి, మేరుగు కిరణ్, ఆకుల శ్రీను, దండు నవీన్, బండారు శివ, నామాసు వెంకటేశ్వర్లు, సల్మాన్, సాయి, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version