జోరుగా సాగుతున్న న్యాల్కల్ ఎన్హెచ్-50 విస్తరణ పనులు…

జోరుగా సాగుతున్న న్యాల్కల్ ఎన్హెచ్-50 విస్తరణ పనులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని డప్పూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి-50 విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు వెళ్లే ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం సుమారు ₹512 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తోంది. ఈ పనులు పూర్తయితే తెలంగాణ-కర్ణాటక మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అధికారులు వాహనదారులను జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version