ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను…

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్డు ఇంచార్జ్ పి. అరవింద్
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డులో పారిశుద్ధ్య లోపంతోని మురికి కాలువలు నిండుకుండ లాగా మారి అందులో విపరీతమైన దోమలు దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుంటే అ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అరవింద్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినారు ఇందుకు స్పందించిన అరవింద్ పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన జహీరాబాద్ పరిపాలన సంఘం మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్ సిబ్బందితో చెప్పి వార్డులో ఉన్న మురికి కాలువలు చెత్తకుప్పలు తొలగించి పిచ్చి త్వరలో మురికి కాలువలలో దోమల మందులను పిచికారి చేస్తామని అదేవిధంగా వీధి కుక్కలు పందులు లేకుండా చూస్తామని వాడి ఇంచార్జ్ అరవింద్ గారికి హామీ ఇచ్చారు ఇందుకు సంతోషించిన 19వ వార్డు ప్రజలు అరవింద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినారు ప్రజలతో మాట్లాడుతూ అరవింద్ నేనెప్పుడూ ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తేవాలని నాతో అయినంత వరకు సమస్యలను పరిష్కరిస్తారని నాతో కానీ యెడల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ప్రజా సమస్యలు తీరేలా చూస్తానని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజా ప్రభుత్వమని తెలిపినారు,

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం…

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం

◆-: ఖాదర్ నగర్ వాగులో పేరుకుపోయిన చెత్త తొలగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను సమూలంగా పరిష్కరించి కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించెందుకు కృషి చేస్తామని 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం అన్నారు. శుక్రవారం నాడు పట్టణంలోని ఫయాజ్ నగర్ వార్డులో భాగమైన ఖాదర్ నగర్ కాలనిలో గల వాగులో పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో కౌన్సిలర్ ప్రతినిధి మొహమ్మద్ అక్రం జేసిబి యంత్రం సహాయంతో చెత్తను తొలగింపజేసి వాగులో నీటిని సజావుగా వెళ్లేందుకు చెత్తను తీసివేయించారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ వార్డు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన చెత్త బుట్టలో వేసి తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా వేసి ట్రాక్టర్ లో వేయాలని కోరారు.

గ్రామంలో విస్తృత కాలువల శుభ్రత: ప్రజారోగ్యానికి పెద్దపీట…

గ్రామంలో విస్తృత కాలువల శుభ్రత: ప్రజారోగ్యానికి పెద్దపీట

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మోరీ కాలువల శుభ్రత కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, పంచాయతీ సభ్యులు, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో పారిశుధ్య కార్మికులు ఈ పనులు చేపట్టారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, మురుగు నీటిని తొలగించడం ద్వారా దోమల బెడద తగ్గి ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రవహిస్తుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

నేటి ధాత్రి ఎఫెక్ట్…స్పందించిన మున్సిపల్ అధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

పారిశుద్ధ్యం పడకేసిందా…?
నేటి ధాత్రి కథనానికి కేసముద్రం మున్సిపాలిటీ అధికారులు పారిశుధ్యం పై స్పందించి తక్షణమే పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగింది

సైడ్ డ్రైనేజీ కాలువ పిచ్చి మొక్కల తొలగింపు చెత్తకుప్పల తొలగింపు మున్సిపల్ కార్మికుల చే పారిశుద్ధ్యం పనులు చేయడం జరిగింది. కథనానికి స్పందించిన అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version