10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, సెల్‌ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు…

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఈనెల 14 నుండి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకిరాన్ని రానున్నదని
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు ,వరంగల్ జిల్లా 47, జనగామ జిల్లాలో 39 మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 14 శనివారం నుండి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163, (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు 14 తేది నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు. ఈ పరీక్షల సమయంలో ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version