దేశం మెచ్చే స్థాయిలో ఎదగాలి
వనవాసీ నిర్వహణలో దాతల సహకారం మరువలేనిది
వనవాసీ గౌరవ సలహాదారు బివిఎస్ఎల్
నేటిదాత్రి చర్ల
విద్యార్దులను సంస్కారవంతమైన వారిగా తీర్చిదిద్దుతూ చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవరుస్తున్నామని వనవాసీ కల్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు గుమ్మడి మదుసూదన్ రావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి శ్రీదేవి విద్యార్ది నిలయంకు పరుపులు స్టీల్ డ్రమ్ లను అందచేసారు ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింహారావు ప్రసంగించారు నిరుపేద ఆదివాసీ విద్యార్దులను ఇక్కడ చేర్పించి వారికి వసతితో పాటు విద్యను అందచేసి భవిష్యత్ కు బంగారుబాట వేస్తున్నామని వెల్లడించారు వనవాసీ సంస్ద దాతల సహకారంతో నడుస్తుందని దాతల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు ఇందుకు నిలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అబినందనీయమని పేర్కొన్నారు వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ గిరిజన వికాసం కొరకు దేశ వ్యాపితంగా సంస్ద విద్యార్ది నిలయాలతో పాటు గ్రామాలలో విద్యా కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు శ్రీదేవి మాట్లాడుతూ వనవాసీ సంస్దకు తనవంతు సహకారం అందచేస్తానని, విద్యార్దుల చదువులకు సహకరించడం సంతోషకరమని అన్నారు వనవాసీ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు శివరాజు కిషోర్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, సుధీర్ పాల్గొన్నారు.
