రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష.

రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్ట కొడుతున్న సిసిఐ అధికారులు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ చేపట్టే చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. లేనిపక్షంలో ఈ దీక్షను ఇంకా ఉదృతం చేసి మాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని లారీ యజమానులు తెలిపారు.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి.

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం ఎమ్మెల్యే

నేటి ధాత్రి:

 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వద్ద మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ప్రజా ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామాల్లో ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ స్వరాజ్య సంస్థ అధ్యక్ష  కార్యదర్శులు పప్పుల సుధాకర్ తల్లూరి సలేందర్ కుమార్ కో-ఆర్డినేటర్ వట్టెం రాములమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం.

‘భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం’

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూభారతి అవగాహన సదస్సు ఫారంలో రైతు పేరు గ్రామం పేరు రెవెన్యూ శివారు పేరు.

సర్వేనెంబర్, భూమి విషయంలో ఎదుర్కొంటున్న సమస్య తదితర వివరాలు పొందుపరచాలన్నారు.

రెండు భూభారతి రైతుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు రెండు రెవెన్యూ గ్రామంలో భూభారతి రైతు అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

మండలంలోని ఆయా గ్రామాలలో భూముల సమస్యలు నెలకొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పండ్లు పంపిణీ.

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పళ్ళు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలో షేక్ సోహెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల శివారులోని శ్రీ కితకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఝరాసంగం జరిగిన వేడుకల్లో
మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ఫారూఖ్ పటేల్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా స్థావరం పై రైడ్ చేసిన పోత్కపల్లి పోలీసులు..

గుడుంబా స్థావరం పై రైడ్ చేసిన పోత్కపల్లి పోలీసులు..

గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు…పోత్కాపల్లి ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో పోత్కపల్లి ఎస్సై దీీకొండ రమేష్ సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం మరియు 5 లీటర్ల గుడుంబా ను పట్టుకొని దానిని తయారుచేసిన బోదాసు పద్మ భర్త పేరు సదయ్య వయసు 40 సంవత్సరాలు కులం వడ్డెర కొలనూరు గ్రామం అనే ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ సెల్ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ కిషన్, కానిస్టేబుల్స్ రాజేందర్ రాములు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

#ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉడత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3కోడిగుడ్లు ,నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రుపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడి టీచర్ రజిత ,ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఊరటీ నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి , ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత ఆనవాళ్లు..

ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత ఆనవాళ్లు.. రామతీర్థం చరిత్ర తెలుసా?

 

Ramateertham Temple: నేటి ధాత్రి:

 

 

రామతీర్థం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని గ్రామ పంచాయతీ.

ఇది విజయనగరం నగరానికి 12 కి.మీ. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ  రామాలయం ప్రదేశాలలో రామతీర్థం ఒకటి.

ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత ఆనవాళ్లు ఉన్నాయి. మరి అవేంటి.? ఈ క్షేత్ర చరిత్ర ఏంటి.? ఈరోజు మనం చూద్దాం..

 

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు దీనికి పక్కనే ఉన్న బోదికొండను కూడా సందర్శించవచ్చు.

16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.

దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు.

Ramateertham Temple

 

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు. 

రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ, దాని అద్భుతమైన లక్షణాలు, చరిత్రతో ప్రత్యేకమైనది.
ఈ కొండ, పురాణాలలోని పాత్రలతో, చారిత్రక సంఘటనలతో అనుసంధానమై, అనేక రహస్యాలను దాచుకుంది.
బోదికొండకి చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉంది.
బోదికొండ, ఒక ఏకశిల. అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ.
ఈ కొండపై రాములవారి దేవాలయం నిర్మించబడింది.
స్థలపురాణం ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు.
శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు, ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలందుకుంటున్నాయి.
ఈ కొండపై ఉన్న ఒక కొలను, దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైనది.
ఇక్కడ వేసిన నాణేలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం ఉంది.
ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎండిపోదు.
Ramateertham Temple
భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోదికొండపై ఉంది.
ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లుగా చెబుతారు.
ఈ ప్రదేశం  నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరుకైన మార్గాలు, అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.
Ramateertham Temple
సీతమ్మవారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి.
సీతమ్మవారు లవకుశులను ఇక్కడ ఆడించినట్లుగా చెబుతారు.
కొండ కింద, సీతమ్మవారి పురుటి మంచానికి సంబంధించినట్లు చెప్పబడే ప్రదేశం ఉంది.
రాళ్ళ నుండి ఇంగువ వాసన వస్తుందని కూడా చెబుతారు.
Ramateertham Temple
ఇవి మాత్రమే కాదు..
ఈ కొండపై జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
దీనిపై మీరు బౌద్ధారామం, అలాగే శిధిల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు.
రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు, ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బోదికొండను కూడా సందర్శించండి.
Ramateertham Temple

ప్రాథమిక పాఠశాలల పట్ల వివక్ష తగదు.

ఉన్నత విద్యకు ప్రాథమిక విద్య పునాది

ప్రాథమిక పాఠశాలల పట్ల వివక్ష తగదు

ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్నీ నియమించాలి

ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం ను నియమించాలి

నడికూడ,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలనీ పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఎందుకంటే బడిబాట తర్వాత నమోదు అయిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాల్సిన ఉపాధ్యాయుల సర్దు బాటును బడి బాటకు ముందు ఎలా చేస్తారు.

ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి అని,అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరే ఉపాధ్యాయులు పద్దెనిమిది సబ్జెక్టులు ఎలా బోధించడం సాధ్యమవుతుంది.

ప్రైమరీలో సబ్జెక్టులు లేదనే భావన అధికారుల్లో ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించాలి.అదే ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు లేకున్నా సబ్జెక్టు ఒక టీచర్ ను నియమిస్తారు.

ఇక్కడే అర్థమవుతుంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పట్ల ఉన్న వివక్షత.

ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో అదే విధంగా ఉన్నత విద్యకు కూడ ప్రాథమిక విద్య అంతే ముఖ్యమని ప్రభుత్వం తెలుసుకోవాలి.

అప్పుడే ప్రాథమిక విద్య మెరుగై ఉన్నత విద్యలో సత్ఫలితాలను అందిస్తుంది.

ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం నిర్వహించడానికి, గుణాత్మకమైన విద్య అందించడానికి ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయులు, తరగతికి గదికి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించకుండా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు పేరుతో ఏకపక్షంగా తీసేస్తే ఆ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం మరియు గుణాత్మక విద్య అనేది ఎలా సాధ్యమవుతుంది.

ఒకవేళ ఈ ప్రజా ప్రభుత్వం కనుక బడుగు బలహీన వర్గాల పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి.

ఇప్పుడిప్పుడే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపిస్తున్న సమయంలో మీరు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టే విధంగా తీసుకొచ్చిన ఈ ఉత్తర్వులను వేంటనే రద్దు చేయాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.

మిగులు టీచర్లున్నట్లు జూన్ మాసంలోనే ఎలా తెలుస్తుంది.

చాలా ప్రాంతాల్లో సర్కారు బడుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తున్నారు.

మేం ఇంటికి తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నింటే,అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు.

పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లులేకపోతే ఎలా..?

జులై, ఆగస్టు మాసాల్లో చేయాల్సిన సర్దుబాటును జూన్లోనే చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందస్తు బడిబాట మరియు రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మకమైన విద్య,ఆంగ్ల భాషలో బోధనతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసానిచ్చి పాఠశాలలో విద్యార్థులను నమోదు చేయిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం అనేది ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్మ వైఖరికి నిదర్శనంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే

ఈ అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు వెనుకకు తీసుకోవాలని నడికూడ మండల శాఖ పక్షాన కోరుచున్నాము.

బడిబాట ముగిసిన తర్వాత జులై మాసంలో సర్దుబాటు చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు.

భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం.

భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసినమహిళలకు సత్కారం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ భగవద్గీత 700శ్లోకాలను కంఠస్థం చేసిన మహిళలకు సిరిసిల్ల గీతా ప్రచార సేవ సమితి ఘన సత్కారం గీతాశ్రమంలో ఉదయం 11 గంటలకు కోడo నారాయణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య కార్య నిర్వహణలో జరిగిన సమావేశంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూర్ లో నిర్వహించిన 700 శ్లోకాల కంఠస్థం చేసిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకం విజయ ,జి సంగీత, జి ప్రశస్తి, మహిళలకు బంగారు పతకం శాలువాతో సత్కారం పొందిన సిరిసిల్ల జిల్లా వాసులలో ముగ్గురు సిరిసిల్ల లోకల్ వారైతే ,ఆవునూరు వారు ఇద్దరూ ఒకే ఇంటి కుటుంబానికి చెందిన వారై తల్లి, కూతురు ఈ అవార్డులు పొందడం విశేషం. మహిళలకు.డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ విశేషంగా భగవద్గీత అంటే అర్థం పరమార్థం తెలిసిన ఈ ఐదుగురిని సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఘనంగా గీత ఆశ్రమంలో ఉదయం సన్మానించింది వీరికి శాలువా గ్రంథాలతో ఘనంగా నారాయణ నందగిరి స్వాముల చేతుల మీదుగా సన్మానించింది. భవిష్యత్తులో భావితరానికి భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయించాల్సిందిగా గీత ప్రచార సేవా సమితి కోరింది. ఈ కార్యక్రమంలో గీత గజ్జెల్లి రామచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ మొదలైన వారు సుమారు వందమంది దాకా పాల్గొన్నారు.

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్..

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్.. ఈ ప్రాంతాలకు అస్సలు వెళ్లకండి

 

నేటిదాత్రి :

 

 

 

 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలో రెండు కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో మరణం నమోదు అయ్యింది..

యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ,పశ్చిమ బెంగాల్ ,కర్ణాటకలోనే ఉన్నాయి ..

కేరళలో అత్యధికంగా 1416 యాక్టివ్ కేసులున్నాయి,మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు.

కేరళలో తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతు 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు..

మహారాష్ట్రలో 70, 73 ఏళ్ల మహిళలు మృతి చెందారు..

తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మృతి చెందింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో 28,తెలంగాణలో 4 యాక్టివ్ కేసులున్నాయి..

ఒడిశాలో 15 యాక్టివ్ కేసులు,కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

2020-21-22 తరువాత కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది..

వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణంగా గుర్తించారు వైద్య అధికారులు..

COVID 19 వేరియంట్ ఓమిక్రాన్ NB.1.8.1, భారతదేశం అంతటా కేసుల పెరుగుదలకు కారణం.

ఇది అంటువ్యాధి, పరివర్తన చెందే వ్యాప్తి చెందే లక్షణం కలిగింది..అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది

కోవిడ్ లక్షణాలు..

 

జ్వరం, దగ్గు,జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట ముక్కు కారటం వంటివి తాజాగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)వెల్లడించింది… ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది… సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం , పరిశుభ్రత పాటించడం కోవిడ్ దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలుగా కొనసాగుతున్నాయి..

దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులకు,ప్రజలకు సూచనలు జారీ చేశాయి..

 

పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పునరుద్ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉంచాయి.

అనేక ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి..

ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది.

13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు..
పాములను పట్టి అడవిలో వదులుదామకున్నాడు..
కట్ చేస్తే..
పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు..
అసలు విషయం తెలిస్తే కోవిడ్ కేసుల పెరుగుదల..
కేంద్రానికి నోటీసులు..

 

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కోవిడ్ శాంపిల్స్ సేకరణ, సేకరణ కేంద్రాలు,శాంపిల్స్ రవాణాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..

జనవరి 27, 2023న డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ డాక్టర్ రోహిత్ జైన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు..

కోవిడ్ శాంపిల్స్ సేకరణ విధానాలు, సేకరణ కేంద్రాల పనితీరు నమూనాల రవాణాకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదని జైన్ పేర్కొన్నారు.

దీంతో కోవిడ్ పరీక్షల విధానంపై ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ (CGSC) మోనికా అరోరాను ఆదేశించింది.

తదుపరి విచారణ జూలై 18న కొనసాగనుంది.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు

ఐక్యవేదిక అధ్యర్య ములో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి మున్సిపాలిటీ కి విలీన గ్రామన్ని రాజనగరం అమ్మ చెరువు కట్టను అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కట్ట పైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దాని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెంటనే పూర్తి చేయాలని, కట్ట పై వెలిసిన టవర్ లైట్లు రావడం లేదని వనపర్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని మున్సిపల్ ఇంజనీర్ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ చెప్పారు చెరువు కట్టపై శానిటేషన్ పనులు చేయడం లేదని, తుమ్మ చెట్లు పెరిగి నాయని రాత్రిపూట వెళ్లే వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార ని సతీష్ తెలిపారు విష సర్పాలు తిరుగుతున్న సమయంలో రాత్రి పుట వాహనాల ప్రజలు కట్ట పై ప్రయాణిస్తుంటారని రోడ్డు ప్రమాదం ఏర్పడుతుందని సతీష్ తెలిపారు. 12వ వార్డు రాజనగరాన్ని వనపర్తి మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని, విలీన గ్రామాలైన మర్రికుంట శ్రీనివాసపురం, నాగవరం రాజనగరం, జంగమయ్య పల్లి వార్డులను అభివృద్ధి చేయాలని జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు
జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వెంట తో పట్టణ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,కురుమూర్తి,శివకుమార్, గుంట్ల వెంకటేష్, రాజు,కృష్ణయ్య, శ్రీనివాసులు రాజనగరం గ్రామ ప్రజలు ఉన్నారు

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు.

 

మేడిగడ్డ బ్యారేజ్ నేటి ధాత్రి:

 

 

 

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

 

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది

  • తొలగించినా, సురక్షితం చేయాలన్నా మీ పనే
  • సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళిక అందించాలి
  • ఇతర బ్లాక్‌లపై ప్రభావం పడకుండా చూడాలి
  • 3 బ్యారేజీల్లో ఒకేరకమైన నిర్మాణ లోపాలు
  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక స్పష్టంగా చెప్పింది
  • ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ అని, దాని నివేదికకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నివేదికలోని కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను అంగీకరించి, కొన్నింటిని తిరస్కరించడం కుదరదని, నివేదికను మొత్తంగా చూడాలని మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆ సంస్థకు ఘాటైన లేఖను రాసింది. కాళేశ్వరం ప్రాజె క్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్మాణ లోపాలు కూడా కారణమని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజీ కుంగిందని, ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) తేల్చిందని ప్రస్తావించింది. మేడిగడ్డలోని బ్లాక్‌-7లో రాఫ్ట్‌, పిల్లర్లతో పలుచోట్ల పగుళ్లు వచ్చాయని నివేదికలోని పదహారవ అంశంలో పేర్కొన్నారని గుర్తు చేసింది.

బ్లాక్‌-7ను తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం నిర్మాణ సంస్థ బాధ్యతేనని, ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా దాని పనేనని ప్రస్తావించింది. మేడిగడ్డ సమగ్ర పునరుద్ధరణకు ప్రణాళికను ఎల్‌ అండ్‌ టీ అందించాలని తేల్చిచెప్పింది. ఎన్‌డీఎ్‌సఏ నివేదికలో కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అంగీకరించేది లేదని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించింది. సుందిళ్ల, అన్నారంలో తలెత్తిన సమస్యలకు కారణమైన నిర్మాణ లోపాలు, నాణ్యత లోపాలు మేడిగడ్డలో పరిస్థితికి కూడా కారణమై ఉండవచ్చని ఎన్‌డీఎ్‌సఏ చెబితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం మాని, నివేదికనే తప్పుపట్టే దిశగా ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థకు, నీటిపారుదల శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలోని 8, 16, 30, 32.2, 32.3, 34, 35.1, 38 అంశాల ప్రకారం ఎల్‌ అండ్‌ టీ నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణ పటిష్టత, దానిపై ఆధారపడిన ప్రజల జీవనాధారం నేపథ్యంలో మళ్లీ వైఫల్యాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డలో నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపాలు, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మా ణం జరుగక పోవడం వంటి సమస్యలను ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిందని ప్రస్తావించింది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించింది, బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసిందని గుర్తు చేసింది.

లేఖలోని ముఖ్యాంశాలు

  • బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతినడానికి, కటా్‌ఫల అసలు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక పోవడానికి గ్రౌటింగ్‌ చేయడమే కారణం.
  • ఏడో బ్లాక్‌లోని 17, 20, 21 పిల్లర్ల కటా్‌ఫలలో రంధ్రాలు కనిపించాయి. పిల్లర్ల కింది నుంచి ఇసుక జారడంతో పిల్లర్లు కుంగాయి.
  • ఏవిధంగా నిర్మాణంజరిగింది.? వినియోగించిన సామగ్రి పరీక్షలకు సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద లేవు.
  • నిర్మాణానికి ఏయే సామగ్రి వినియోగించారు? అధికారుల ఆమోదం ఉందా? అంటే ఆధారాలు లేవు.
  • సిమెంట్‌, కాంక్రీట్‌లో నీళ్లు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది, ఆ వేడిని చల్లబరచడానికి ఎంత సమయం పడుతుందనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు. ఆ పత్రాలు నీటిపారుదల శాఖ క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కూడా ఇవ్వలేదు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు.

ఘనంగా మాజీ మంత్రి హరీశ్​రావు​ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్‌ రావు పుట్టినరోజు సందర్భంగా ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం తమ మండల బృందంతో నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు శక్తిని ప్ర‌సాదించాలని కోరుకున్నారు.

ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాల‌ని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.

కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Former Minister Harish Rao’s

 

 

అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో మండల మైనారిటీ యువనాయకులు షేక్ సోహైల్ మరియు పరమేశ్వర్ పాటిల్ శివశంకర్ పాటిల్ ఆధ్వర్యంలో పండ్లను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ పాటేల్ ఫారూఖ్ పటేల్ ప్రభు పటేల్.

గోపాల కృష్ణ పాటిల్.బస్వరాజ్ పాటిల్ శివశంకర్ పాటిల్ భాయ్ వెంకటరెడ్డి నాగేశ్సజ్జన్.

నాభి పటేల్ లాలప్ప గొల్ల నర్సిములు ఆంజనేయులు నర్సిములు మాణిక్యదవ్ కిషన్ రాథోడ్ సీను తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది.!

Gas Cylinder: వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం ఇదే?

 

నేటిధాత్రి

 

 

 

Gas Cylinder Red Color: ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్..

Gas Cylinder Red Color: ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. మీకు వీటన్నింటి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ అనేక ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది? సాధారణంగా ఎరుపు రంగు అనేది ప్రమాదానికి చిహ్నంగా భావిస్తారు. ఏదైనా ప్రమాదం సమయంలో దానిని ఆపేందుకు ఎరుపు రంగులు ఉపయోగిస్తారు.

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వంటగదిలో ఉపయోగించే సిలిండర్ పెట్రోలియం వాయువు (LPG)తో నిండి ఉంటుంది. LPG కాకుండా , వివిధ రంగుల సిలిండర్లలో నిండిన అనేక ఇతర వాయువులు ఉన్నాయి. ఇంట్లో ఉంచే LPG సిలిండర్ ఎల్లప్పుడూ ఎరుపు రంగులో ఉండటానికి కారణం తెలుసుకుందాం.

మనందరికీ తెలిసినట్లుగా, ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతంగా పరిగణిస్తారు. అందుకే సిలిండర్‌లో కూడా ప్రమాదం ఉంది కాబట్టి సిలిండర్‌కు ఎరుపు రంగు వేస్తారు. దాని లోపల నింపే ఎల్‌పీజీ గ్యాస్ మండేది. దానిని సరిగ్గా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించవచ్చు. ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే గ్యాస్ సిలిండర్లకు ఎరుపు రంగు వేస్తారు. ఇది కాకుండా, గ్యాస్ సిలిండర్ LPG తో నిండి ఉంటుంది. అందుకే ప్రజలు దానిని సులభంగా గుర్తించగలిగేలా దానికి ఎరుపు రంగు వేస్తారు.

ఇది కూడా చదవండి: Indian Currency: 500 రూపాయల నోట్లు కూడా రద్దు అవుతాయా..? ఇవే 3 పెద్ద కారణాలు

ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి?

ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) కాకుండా, అనేక ఇతర రకాల వాయువులను ఉపయోగిస్తారు. దీనితో పాటు సంపీడన సహజ వాయువు ( CNG ), పైపుల ద్వారా నడిచే సహజ వాయువు ( PNG ), ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, హీలియం వాయువులు కూడా ఉన్నాయి. అన్ని వాయువులకు వాటి స్వంత ఉపయోగాలు ఉన్నాయి. అవి సరిగ్గా, జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా చేస్తాయి.

ఏ గ్యాస్‌కి ఏ రంగు సిలిండర్?

  • ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ తెల్లగా పెయింట్ చేసి ఉంటుంది. మీరు ఆసుపత్రులలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను చూడవచ్చు.
  • నైట్రోజన్ వాయువు సిలిండర్ నల్లగా పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును టైర్లలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు. మీరు ఈ సిలిండర్‌ను పెట్రోల్ పంపులు, టైర్ ఫిల్లింగ్ దుకాణాలు లేదా పంక్చర్ మరమ్మతు దుకాణాలలో పొందుతారు.
  • హీలియం వాయువు సిలిండర్ గోధుమ రంగులో పెయింట్ వేసి ఉంటుంది. ఈ వాయువును బెలూన్లలో గాలిని నింపడానికి ఉపయోగిస్తారు. దీని కారణంగా బెలూన్లు ఆకాశం వైపు వెళ్తాయి.
  • మీరు తరచుగా ‘లాఫింగ్ గ్యాస్’ గురించి విని ఉండవచ్చు. ఈ వాయువు సిలిండర్ నీలం రంగులో పెయింట్ వేసి ఉంటుంది. దానిలో నైట్రస్ ఆక్సైడ్ వాయువు నిండి ఉంటుంది.
  • కార్బన్ డయాక్సైడ్ వాయువు కోసం సిలిండర్లు బూడిద రంగులో పెయింట్ వేసి ఉంటుంది. వ్యాపారాలు, కర్మాగారాలు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Vehicle Number Plate: నంబర్ ప్లేట్ల రంగుల రహస్యం.. తెలుపు, పసుపు, ఆకుపచ్చ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని డి. ఎస్.పి సైదా అన్నారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను సోదర భావంతో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలనరు సమావేశంలో హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా,విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు కుల,మతాలకు అతీతంగా పండగలను జరుపుకోవాలని చెప్పారు.సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు.

బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా!

Gold Price: బంగారం ధర రూ.12,000 తగ్గుతుందా? కారణం ఏంటో తెలుసా..?

 

నేటి ధాత్రి:

 

 

 

 

Gold Price: కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా మాట్లాడుతూ..

ప్రస్తుతం బంగారం ధర కొంతవరకు పెరుగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బంగారం ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్- మే నెలల్లో బంగారం ధర 10 శాతం మెరుగుదల కనిపించింది..

 

గత కొన్ని నెలలుగా బంగారం ధర చాలా హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

కొన్ని రోజుల క్రితం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది.

ఆ తర్వాత ధరలో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 97,000 రూపాయలుగా ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం ధర దాదాపు 12,000 రూపాయల వరకు తగ్గవచ్చు.

బంగారం ధర 10 గ్రాములకు 80,000 నుండి 85,000 రూపాయల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు.

కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా మాట్లాడుతూ..

ప్రస్తుతం బంగారం ధర కొంతవరకు పెరుగుతున్నప్పటికీ, రాబోయే కాలంలో బంగారం ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర 10 శాతం మెరుగుదల కనిపించింది.

కానీ రాబోయే కాలంలో ప్రస్తుత రేటు వద్ద రూ. 12,000 తగ్గుదల కనిపించవచ్చు.

బంగారం రూ. 80,000, రూ. 85,000 మధ్య ఉండవచ్చు. పాకిస్తాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ తర్వాత బంగారం ధరలు తగ్గాయి.

బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,000 తగ్గింది..

ఇప్పుడు రాబోయే కాలంలో బంగారం మరింత చౌకగా మారవచ్చు.

దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది

కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..ఇక మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రద్దు!
మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
సమయం లేదు మిత్రమా..! జూన్‌ 14 వరకే అవకాశం.. ఆ తర్వాత..

1. బంగారం ధరలు పెరిగినప్పుడు, మార్కెట్లో లాభాలు వస్తుంటాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు పెరిగాయి. దీనివల్ల లాభాలు ఆర్జించడానికి బంగారాన్ని అమ్మే అవకాశం ఉంటుంది. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.

2. ప్రపంచ సంఘటనలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ స్థాయిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అమెరికా సుంకాలపై తన వైఖరిని మృదువుగా చేసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. దీని వలన బంగారం ధర తగ్గుదల ఉండవచ్చు.

3.బంగారం ధరలో ఆర్‌బిఐ ద్రవ్య విధానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జూన్ 6న ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బంగారం ధరపై ప్రభావం చూపవచ్చు. ధరలో తగ్గుదల ఉండవచ్చు.

4. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. ఫెడ్ రేట్లను తగ్గిస్తే బంగారానికి మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు. వడ్డీ రేట్లలో కోత ఉంటే బంగారం ధర తగ్గవచ్చు.

ఇది కూడా చదవండి: Minimum Balance: ఈ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రద్దు!

ఇది కూడా చదవండి: Aadhar Card: సమయం లేదు మిత్రమా..! జూన్‌ 14 వరకే అవకాశం.. ఆ తర్వాత..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

నాలుగు రోజుల తరువాత మిగిలిపోయిన రోడ్ల కటింగ్ ప్రారంభo.

వనపర్తి లో రోడ్ల విస్తరణలో చేపట్టుటకు ఇండ్లు షాపులో యజమానులతో సలహాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే తూడి

నాలుగు రోజుల తరువాత మిగిలిపోయిన రోడ్ల కటింగ్ ప్రారంభo

వనపర్తి నేటిధాత్రి:

గత ప్రభుత్వం లో వనపర్తి లో రోడ్ల విస్తరణ లో ఆస్తులు నష్టపోయిన వారికి న్యాయం జరగలేదని వనపర్తి పట్టణంలో మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే మెగా రెడ్డి పాన్గల్ ల్ రోడ్ లో ఇండ్లు షాపులు వ్యాపార సంస్థల నష్టపోయే ప్రజలను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలను సూచనలను తీసుకున్నారు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయము మేరకు రోడ్ల విస్తరణ చేపడతామని ఎమ్మెల్యే మెగా రెడ్డి చెప్పారు .గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు పెద్దమనుషులు పానగల్ రోడ్డు గాంధీ చౌక్ హై స్కూల్ రోడ్డు లో ఆస్తులు నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయింపు లో మూడో ఫ్లోర్ రెండో ఫ్లోర్ కేటాయించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ప్రజలు తమతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మెగా రెడ్డి చెప్పారు వనపర్తి లో రోడ్ల విస్తరణకు ప్రజలు సు ముఖంగా ఉన్నారని కొందరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మరికొందరు డబుల్ బెడ్ రూమ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కేటాయించాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారని ప్రజా అదృష్టమేరకే రోడ్ల విస్తరణ చేపడతామని రోడ్ల కాటింగ్ నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు . వనపర్తి లో దాదాపు 1,20,000 జనాభా ఉన్నదని ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రోడ్ల కటింగ్ చేపడతామని చెప్పారు ఎమ్మెల్యే మెగా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు . రాజావారి పాలిటెక్నిక్ కళ శాల కర్నూల్ రోడ్ కొత్తకొత్త కోట రాజవారి పాలిటెక్నిక్ నుండి వివేకానంద రోడ్ రోడ్ల విస్తరణలో నష్టపోయే ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నవారికి గత ప్రభుత్వం లో ఓకే డబుల్ బెడ్ రూము కేటాయించారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశారని ఎమ్మెల్యే చెప్పారు విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు చీర్లసత్యం సాగర్ నందిమల్ల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి.

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి:

నేటి ధాత్రి:

 

 

 

  • విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు ధనుష్
  • వ్యతిరేక ప్రచారాలు చేసుకోండి ఏమీ కాదన్న ధనుష్
  • అభిమానులు ఎప్పుడూ తనవెంటే ఉన్నారన్న ధనుష్
  • ఈ నెల 20న విడుదల కానున్న కుబేర

ఇలాంటి సర్కస్‌లు వద్దు.. మానుకోండి అంటూ విమర్శకులకు నటుడు ధనుష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించారు.

తాజాగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

‘నేనెప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా మూవీలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తారో చేసుకోండి. నా మూవీల విడుదలకు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేమి చెయ్యలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత వ్యతిరేక ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని ధనుష్ కుండబద్దలు కొట్టారు. 

error: Content is protected !!
Exit mobile version