తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను…

తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను

ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

జన్మనిచ్చిన కన్నతల్లి పేరు తో ప్రతి ఒక్కరు మొక్కను నాటి అది వృక్షమయ్యే వరకు సహకరించాలి ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహమ్మద్ సలీం తెలిపారు తల్లి పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కోమటి కొండాపూర్ మరియు వర్షకొండ గ్రామాలలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా మరియు సంబంధిత గ్రామ ప్రజలందరూ కూడా వారికి అన్వైనటువంటి స్థలాలలో వారికి జన్మనిచ్చినటువంటి తల్లి పేరున మొక్కలు నాటి సంరక్షించుకోవడం వలన రాబోయే తరానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వారవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ మరియు పంచాయతీ కార్యదర్శి సరిత ప్రవీణ్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22 నుండి ప్రారంభం అవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు ఈ వో రామన్ గౌడ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు 22న మహాలక్ష్మి అమ్మవారు 23న సంతాన లక్ష్మి 24న ధైర్యలక్ష్మి 25న విజయలక్ష్మి 26న ధనలక్ష్మి 27న గజలక్ష్మి 28న ఐశ్వర్య లక్ష్మి 29 న శౌర్యలక్ష్మి.30న సౌభాగ్య లక్ష్మి దుర్గాష్టమి 1న ఆదిలక్ష్మి దేవి 2 న విజయదశమి దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు సాయంత్రం 6 గంటలకు శమి పూజ ఉంటుందని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు శమి వినియోగం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు భక్తులు నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొనేవారు అభిషేకాలు అర్చనలు పూజలు చేయించేవారు ఆలయంలో సంప్రదించాలని వారు కోరారు

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్…

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్

* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ పుట్టిన రోజునుపురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలో బుధవారం కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నపిల్లల కు డయాబెటిస్, డెంటల్, కలరా, సాదరణ ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 74 మంది యువత రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సహకారం అందించిన యువతను అభినందించారు.

 

 

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరేంద్ర మోడీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేరంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశప్రగతి పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
పార్లమెంట్ లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించి సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బిజెపి యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి , మండల అధ్యక్షులు శ్రీకాంత్, అనంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కొంచెం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శర్వలింగం, మాణిక రెడ్డి, శర్వలింగం, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, పెద్దోళ్ల కృష్ణ, బిజెపి శ్రేణులు వైద్య అధికారులు, అంగనివాడి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T144714.916.wav?_=1

 

సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం పట్టి సిద్ధాపూర్ వద్ద జహీరాబాద్-తాండూర్ రహదారిపై శుక్రవారం ఉదయం చిరుత పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్, కుంచారం నుంచి జహీరాబాద్ వెళ్లే మార్గాల్లో రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. ఐదు నుంచి ఆరు మంది గుంపులుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఈ సమాచారాన్ని వినయ్ పవర్, AITF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, NHCR చైర్మన్ అందించారు.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T143955.810.wav?_=2

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T135203.980.wav?_=3

 

రోడ్డు పక్కనే అతి పెద్ద గుంతలు
అదుపు తప్పితే ప్రమాదమే

రాయికల్, సెప్టెంబర్ 19, నేటి ధాత్రి,:

 

రాయికల్ మండలంలోని కట్క పూర్ నుండి జగిత్యాల వెళ్లే రోడ్డు మార్గంలో విరాపూర్ గ్రామ పరిధిలో రోడ్లు కు గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గతంలో ఉన్న దానికంటే అతిపెద్దగా గుంతలు రోడ్డుకు పక్కనే ఏర్పడడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది గతంలో ఇదే ప్రదేశంలో ఓ వాహన ప్రమాదం జరిగి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది అలాంటి దారణలు మళ్లీ పున వృతం కాకూడదు అంటే రోడ్డు రవాణా అధికారులు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వాహన చోదకు లకు ప్రమాదంగా మారిన ఈ గుంతలను తక్షణమే పూడ్చ వలసిందిగా ప్రజలు కోరుతున్నారు
ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ మండల అధ్యక్షులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T134612.031.wav?_=4

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ మండల అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల ఈదులపల్లి రచ్చయ్య స్వామి కుమారుడు బసవరాజ్ జన్మదినాన్ని శుభాకాంక్షలు పురస్కరించుకుని, టీజీఐడిసి మాజీ చైర్మన్, మహమ్మద్ తన్వీర్ ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతు రావు పటేల్ శాలువా పూలమాలలతో సన్మానించి కప్ కేక్ కట్ చేసి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీటీసీ జడ్పిటిసి శంకర్ పటేల్, నర్సింలు పటేల్ మల్లన్న పటేల్, బాలభాయ్ బాలరాజ్ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T134126.783.wav?_=5

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతం వాటర్ ట్యాంక్ ఏరియా 9వ వార్డు అధ్యక్షుడు గడ్డల మధుసూదన్ ఆధ్వర్యంలో పోచమ్మ గుడి ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ ప్రాంత మహిళల కొరకు బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని,పోచమ్మ గుడి ఆవరణంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, మహిళలు భక్తితో పాల్గొనే బతుకమ్మ వేడుకలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ తల్లి పూజలో భాగంగా శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాల్గొన్నారు.

అమూల్యమైన క్షణం – మధురమైన స్మృతి..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T133620.280.wav?_=6

 

అమూల్యమైన క్షణం – మధురమైన స్మృతి..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

2024 డీఎస్సీ లో ఉపాధ్యాయులుగా ఎంపికై, మొహమ్మద్ సమియోద్దీన్ న్యాల్కల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పూర్వ ఉన్నత పాఠశాల చాల్కి విద్యార్థులు, వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సారిగా వారి పాఠశాల కి సందర్శించారు తమ ఉపాధ్యాయ ఉద్యోగ జీవితంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 2025) సందర్భంగా, ఎల్లప్పుడూ గుర్తుండేలా జడ్పీహెచ్ఎస్ మామిడ్జి పాఠశాలను సందర్శించి సన్మాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఈ రోజును మరింత ప్రత్యేకతతో, స్ఫూర్తిదాయకంగా మార్చారన్నారు,.

దసరా సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T133130.824.wav?_=7

 

దసరా సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..

★ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. దసరా సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. దొంగతనాల నియంత్రణకు జిల్లా పోలీసు వారి సూచనలు ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం మంచిది షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. • ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ సూచించారు.

పండగ వేల ఆఫర్స్ వల్ల మోసపోవద్దు

◆:- సోషల్ మీడియాలో కనిపించే చిప్పి

మండల ప్రజలు ఆన్లైన్ ఆఫర్లతో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపారు. ప్రతి ఆఫర్ డిస్కౌంట్ లింక్స్ మరియు ఏపీకే ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయోద్దని అన్నారు. అలాంటి లింక్స్ ఫార్వర్డ్ చేయొద్దన్నారు. ఈ కేవైసీ, ఏపీకే లేదా ఇతర ఏపీకే ఫైల్ లాంటి ఓపెన్ చేస్తే మీ ఫోను హ్యాక్ అవుతుందని కావున ఎవరైనా మోసపూరిత లింక్స్ లేదా అటువంటి గమనించి వెంటనే 1930 కాల్ కు చేయాలని సూచించారు.

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T132101.418.wav?_=8

 

సిరిసిల్ల పట్టణం లోని కుక్కల బెడద

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో కుక్కల పెడదా ఉన్నది.
రహదారి వెంబడి వెళ్లే బాటసారులను కుక్కల గుంపుగా తయారై అనేకమందిని కరవడం జరుగుతున్నది. ఇలా రోజు కరుస్తూ అనేక మందిని భయాందోళన కు గురిచేస్తూ హాస్పిటల్లో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.

 

సుమారు రెండు నెలల నుండి ఇలాంటి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతున్న, అధికారులు గాని పట్టణ నాయకులు గాని పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు మరియు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలపడం జరిగినది. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు గానీ, సిబ్బంది గాని,
చర్య తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా సిరిసిల్ల పట్టణ వాసులు తెలిపారు.

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.

లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.

అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.

కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.

రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.

“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్

రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.

urea shortage in Nizampet, Medak

సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.

urea shortage in Nizampet, Medak

యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

urea shortage in Nizampet, Medak
urea shortage in Nizampet, Medak

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ

కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ
-కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..

– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.

గంగమ్మ దేవస్థానం కొత్త కమిటీకి ఘన సత్కారం…

గంగమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన – సుమన్ బాబు..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్

 

తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా ఏర్పాటైన చైర్మన్ మహేష్ యాదవ్, కమిటీ సభ్యులు రుద్ర కిషోర్, విమల, వరలక్ష్మి, మధులత, గుణ, భాగ్య వల్లి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, శ్యామల, లక్ష్మనరావు లను.. గురువారం గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు ఘనంగా సత్కరించారు. చైర్మన్, కమిటీ సభ్యులందరికీ జనసేన నాయకులు సుధాకర్, పవన్ కుమార్, సుమంత్ లలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారుకూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ కమిటీ సభ్యుల ద్వారా గంగమ్మ తల్లిని భక్తులకు మరింత చేరువయ్యేలా చేయాలని, ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని సుమన్ బాబు కోరారు. ఈ క్రమంలో ఆముదాల వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పవన్ ముకేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు..

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు..
లక్ష రూపాయల బహుమతి అవకాశం
– జిల్లా కన్వినర్ మేడికాల అంజయ్య

చందుర్తి, నేటిధాత్రి:

 

 

రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, తెలంగాణ (ఎస్ ఏల్ టీ ఏ -టి ఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లు మేడికాల అంజయ్య, రాచర్ల వేణుమాధవ్, సత్య ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే ఈ అవకాశం ఉందన్నారు. 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు, రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించిన తెలంగాణ కవులైన 11మంది గురించి వ్యాసం రాయాలన్నారు. ఆ కవులు, 1)బమ్మెర పోతన ,2)దాశరధి కృష్ణమాచార్య ,3)సుద్దాల హనుమంతు, 4)వట్టి కోట ఆళ్వార్ స్వామి, 5)వానమామలై వరదాచార్యులు, 6)సురవరం ప్రతాపరెడ్డి, 7)సామల సదాశివ, 8)బోయ జంగయ్య, 9)పాకాల యశోద రెడ్డి, 10)కాళోజీ నారాయణరావు, 11)డాక్టర్ సి.నారాయణరెడ్డి
పాఠశాల స్థాయిలో పై కవుల గురించి వ్యాసరచన పోటీ పెట్టి ప్రతి పాఠశాల నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాసిన రెండు వ్యాసాలను జిల్లా స్థాయి పోటీలకు పంపించవలసి ఉంటుందని వారు తెలిపారు. అలా జిల్లా స్థాయిలో ప్రత్యక్ష పోటీకి ఎంపికై వచ్చిన 50 వ్యాసాల నుండి 5 గురుని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు అంజయ్య తెలిపారు.
రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ గెలిచిన విద్యార్థులందరికీ లక్ష రూపాయలను బహుమతులుగా పంచనున్నట్లు నిర్వాహకులు నిర్ణయించినట్లు, వారు తెలిపారు. జిల్లా స్థాయికి ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలు పంపించాలన్నారు. వీటికి చివరి తేదీ అక్టోబర్ ఆరు గా నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరిని ఈ వ్యాసరచన పోటీలలో పాల్గొనేటట్లు చేసి, ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలను పంపించేలా తెలుగు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, ఇందుకుగాను గూగుల్ ఫాం నింపాలన్నారు.విద్యార్థులు రాసిన తెలంగాణ కవుల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడికాల అంజయ్య, వేణుమాధవ్, సత్య ప్రవీణ్ పిలుపునిచ్చారు.పూర్తి వివరాలకు 9441544727,9440491439 నెంబర్ల ను సంప్రదించాలన్నారు.

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు…

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట జంట గ్రామాలలో నాటుసార స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని.ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్ పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్సైలు రమ, శిరీష, స్థానిక ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవమానం పై బీసీ, దళిత సంఘాల నిరసన

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానపరిచిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

బీసీ, దళిత సంఘాల డిమాండ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అవమానపరిచి అగౌరపరచినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలుమరియు దళిత సంఘాలు గురువారం రోజున డిమాండ్ చేశాయి, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం నరసయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్పా దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పద్మశాల సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాసు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం ,

 

 

 

బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ లు గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఫోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని మరియు ప్రజా పాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు, ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీనివాసును ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు , చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన అనంతరం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు, ఆది శ్రీనివాస్ పై జరిగిన అవమానం యావత్తు బీసీ ,దళితులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామన్నారు, చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు,గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు , బొప్ప దేవయ్య , చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాములు ,రాగుల జగన్ ,బట్టు ప్రవీణ్ ,తడక కమలాకర్, కంచర్ల రాజు , రవీందర్, మల్లేశం ,ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

రోడ్డుపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

రోడ్డుపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి పూర్తికాలేదు ఈ రోడ్డు నిధులను స్థానిక ఎమ్మెల్యే తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనే రెడ్డి ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి జంగేడు వరకు సెంట్రల్ లైటింగ్ నాలుగు లైన్లతో రోడ్డుకు 10 కోట్లతో రూపాయలతో రోడ్డు నిర్మాణానికి గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు 10 కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులను స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధిని మరిచి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం నిధులను తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి రఘుపతిరావు తిరుపతి మాడ హరీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…

యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం గోవిందా పూర్ గ్రామంలోజాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు శాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్ద ని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందించాలి. ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీటీవీ కెమెరాలు, వృద్ధాప్యం లో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తూ1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్ ఏ ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జ్ వుమెన్ ఏఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్న య్య, పిసి పూల్ సింగ్, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version