తీవ్ర గ్యాస్ కొరత….

తీవ్ర గ్యాస్ కొరత….!

◆-: గ్యాస్ సిలిండర్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గృహిణులు.

◆-: ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుంది?

◆-: చాలా గ్రామాల్లో గృహిణులు పాతకాలపు కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు.

◆-: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఝరాసంగం కోహీర్ న్యాలకల్ మొగుడంపల్లి మండలంలో నూటికి 99 శాతం మంది గ్యాస్ పై ఆధారపడి ఉన్నారు అట్టి గ్యాస్ ఇటీవల తమకు సకాలంలో అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామాల గృహిణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు లేని గ్యాస్ కొరత కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఎందుకు గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని ఆయా గ్రామాల మహిళలు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా తమ పుల్కల్ మండలంలో ఉన్న భారత్ గ్యాస్ యజమాని, సిబ్బంది గ్యాస్ వినియోగదారుల పట్ల అవహేళనంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని పలువురు గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా భారత్ గ్యాస్ సిబ్బంది తమ తీరును మార్చుకోకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయని పలు గ్రామాల లబ్దిదారులు అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాక్ ఇరాక్ దేశాల్లో యుద్ధం నడవడం వల్ల అట్టి దేశాల నుంచి వచ్చే గ్యాస్ పెట్రోల్ డీజిల్ లాంటి దిగుమతులను వారు నిలిపియడంతో, మనకు వచ్చే గ్యాస్ పెట్రోల్ డీజిల్ అసలు వస్తుందా లేదా ఈ విషయంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సామాన్య గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు తమకు సకాలంలో గ్యాస్ అందకపోతే తమ పరిస్థితి ఏంటని కొన్ని గ్రామాల మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అదుకుంటాం అన్న మాట ఎక్కడికి వెళ్లి ళ్లిందని పలువురు అంటున్నారు ఇప్పటికే గ్యాస్ లేక తాము కట్టెల పొయ్యి పై వంటలు చేసుకుంటున్నామని పలు గ్రామాల మహిళలు అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో తమకు గ్యాస్ ను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు లేనియెడల అన్ని గ్రామాల ప్రజలు ఏకమై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు అన్నారు,

వంట గ్యాస్ కరువు,సిరిసిల్ల ప్రజలకు బరువు…

వంట గ్యాస్ కరువు,సిరిసిల్ల ప్రజలకు బరువు

ప్రజలకు అందని గ్యాస్ సరఫరా

గ్యాస్ కరువుతో కొన్ని చోట్ల పలు వ్యాపార సంస్థలు, హోటల్లు నిలిపివేత

వెయ్యిల్లో బ్లాక్ దందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు

ఏజెన్సీలకు సరఫరా గ్యాస్ కంపెనీలు ఆలస్యం

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణ కేంద్రంలోని పలు గ్యాస్ ఏజెన్సీలు సరఫరాను సక్రమంగా అందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్యాస్ సిలిండర్లు గోదాముల్లో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు అందకుండా సరఫరా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వంట గ్యాస్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో సిలిండర్ 925 /-రూపాయలు ఉండేది నేడు సుమారు 985/- గా ఉంటూ 60 రూపాయలు అదనపు గా ఈ నెలలో పెరిగిందని ఆరోపిస్తున్నారు. సమయంలో కొందరు ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను ఇతర వ్యాపార సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో వెయ్యి రూపాయలకు పైగా విక్రయించబడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ దందాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పలు రకాల ఏజెన్సీ అడగగా.. పై నుండి వచ్చే గ్యాస్ సరఫరా నాలుగు రోజులకు ఒకసారి లోడింగ్ వస్తుందని అంతే కాకుండా, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఒకేసారి వంట గ్యాస్ బుకింగ్ చేసుకుంటూ ఎక్కువగా నిలువ ఉంచుకోవడం ద్వారా నిజంగా వంట గ్యాస్ లేని అటువంటి వారికి ఇబ్బంది కొరత ఏర్పడుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version