ఉపాధ్యాయుడు రవీందర్ కి ధర్మనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం…

ఉపాధ్యాయుడు రవీందర్ కి ధర్మనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మండలంలోని ఇందారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న గోపగాని రవీందర్ కు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి రాష్ట్రస్థాయి పురస్కారం ను ప్రధానం చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే సమాజ చైతన్యం కోసం గత మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో విశేషమైన కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకంగా అందించే ఈ పురస్కారానికి గాను రవీందర్ ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.కవిగా,రచయితగా, విమర్శకుడిగా,కథకుడిగా సాహితీ సంస్థల నిర్వాహకుడుగా రవీందర్ కృషి చేస్తూనే ఐదు కవితా సంపుటాలను,మూడు వ్యాస సంకలనాలను ప్రచురించారని ఆయన తెలిపారు.తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఇతర సాహితీవేత్తల చేతుల మీదుగా మార్చి 17న ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ తో పాటుగా సహచర ఉపాధ్యాయులు,జిల్లాలోని పలువురు కవులు,రచయితలు గోపగాని రవీందర్ కు అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version