అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా…

అయ్యా సార్లు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మా గోడు వినరా
మెట్ పల్లి ఏప్రిల్ 7 నేటి దాత్రి

మెట్పల్లి పట్టణంలోని వెల్లుల రోడ్డు హనుమాన్ నగర్ కాలనీ బచ్పన్ స్కూల్ దగ్గర వివరాలకు వెళ్తే మెట్పల్లిలోనే కళానగర్ ఎలా అభివృద్ధి చెందిందో హనుమాన్ నగర్ కాలనీ ఏడవ వార్డు దినదిన అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ బిల్డర్ల వాళ్లకు అడ్డగా మారి ప్లాట్స్ కొంటూ అమ్ముతూ ఇండ్లు కొంటూ అమ్ముతూ డ్రైనేజీలు లేక డ్రైనేజీలు ఇష్టం వచ్చినట్టు వాళ్ల ఇస్తాను సారం చేసుకుంటూ పోతున్నారు సామాన్య జనాలకు ఇబ్బందిగా మారి అధికారులు చూచి చూడనట్టు వదిలేయడం వల్ల హనుమాన్ నగర్ బచ్పన్ స్కూల్ దగ్గర మున్సిపల్ అధికారులు డ్రైనేజీ తవ్వి పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది అయి అనారోగ్యం పాలవుతున్నారు ఎండాకాలం కాలనీవాసులకు చెరువులు తలపిస్తున్నాయి దోమలు మురుగునీరు వాసన భరించలేక

సతమతమవుతున్నారు ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలం ఏ విధంగా ఉంటదో అని కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వచ్చి ఏదో చేసిన మా అంటే చేసినాము అనే విధంగా చేసి వెళ్తున్నారు ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ వెంట తిరుగుతున్నారు, ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించుకుంటున్నాం.

25వ వార్డులో సమస్యలపై సమీక్ష.. అభివృద్ధి పనులకు హామీ…

25వ వార్డులో సమస్యలపై సమీక్ష.. అభివృద్ధి పనులకు హామీ

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డును మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వార్డులో త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణంతో పాటు అవసరమైన చోట సీసీ కల్వర్టులు నిర్మించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమల బెడద పెరుగుతోందని పేర్కొంటూ, కాలువలను తరచూ శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సిబ్బందికి ఆదేశించారు.ఇంటింటికీ చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు, రోడ్లపై చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు యువకులు కటా అఖిల్, కిసరి రాజు, నల్గొండ వంశీ, పుట్ట జగదీష్, చీకటి శివమణి, సాయి పటేల్, వార్డు ఆఫీసర్ సుష్మ, టౌన్ వాటర్ సప్లై ఇన్‌చార్జ్ కాట శ్రీను, వార్డు జవాన్లు మాదాసి శ్రీను, నాతి రాజు, టౌన్ ప్లానింగ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జాఫర్ నగర్ లో డ్రైనేజీ సమస్య…

మంచిర్యాల జాఫర్ నగర్ లో డ్రైనేజీ సమస్య

దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్న కానీవాసులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ,జాఫర్ నగర్ లోని 52వ వార్డు కాలనీవాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.కాలనీలో మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని,సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు.ఇలాంటి సమస్యల వల్ల దోమలు,ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.ఇంటి కిటికీ డోర్లు తీయగానే దుర్వాసన ఇంటిలోకి వెదజల్లి వాంతులు అవుతున్నాయని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకి పరిష్కారం చూపాలని వారు కోరారు.

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను…

ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్డు ఇంచార్జ్ పి. అరవింద్
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డులో పారిశుద్ధ్య లోపంతోని మురికి కాలువలు నిండుకుండ లాగా మారి అందులో విపరీతమైన దోమలు దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుంటే అ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అరవింద్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినారు ఇందుకు స్పందించిన అరవింద్ పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన జహీరాబాద్ పరిపాలన సంఘం మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్ సిబ్బందితో చెప్పి వార్డులో ఉన్న మురికి కాలువలు చెత్తకుప్పలు తొలగించి పిచ్చి త్వరలో మురికి కాలువలలో దోమల మందులను పిచికారి చేస్తామని అదేవిధంగా వీధి కుక్కలు పందులు లేకుండా చూస్తామని వాడి ఇంచార్జ్ అరవింద్ గారికి హామీ ఇచ్చారు ఇందుకు సంతోషించిన 19వ వార్డు ప్రజలు అరవింద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినారు ప్రజలతో మాట్లాడుతూ అరవింద్ నేనెప్పుడూ ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తేవాలని నాతో అయినంత వరకు సమస్యలను పరిష్కరిస్తారని నాతో కానీ యెడల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ప్రజా సమస్యలు తీరేలా చూస్తానని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజా ప్రభుత్వమని తెలిపినారు,

పారిశుద్ధ్యం పడకేసిందా…?

పారిశుద్ధ్యం పడకేసిందా…?

దోమలను నివారించే దిక్కే లేదు…?
పారిశుద్ధ్యం పై పట్టింపె లేదు

ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ లో పారిశుద్ధ్యం పడకేస్తుందని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలే వర్షాకాలం దోమ కాటుతో ప్రతి ఇంట్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అంటే ఎంతో అభివృద్ధి పనులు జరుగుతాయని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడుతుందని పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా జరుగుతాయని భావించామని కానీ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా పనులు జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీల వెంట పిచ్చి మొక్కలు పొదలు పొదలుగా పేరుకు పోతున్న మున్సిపల్ అధికారుల తీరు ప్రత్యక్షంగా నిదర్శనమిస్తున్నాయని గ్రామంలోని ప్రజలు విమర్శిస్తున్నారు. దోమల నివారణ కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గ్రామాలలోని పారిశుద్ధ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఒకింత శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version