బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో.!

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖమాసం వసంత రుతువు ఉత్తరాయణం శుక్ల విదియ కృత్తిక నక్షత్రం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కోట గుళ్ళు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు గ్రామదేవతలకు హారతి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు రౌతు కిషోర్, పాణిగంటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.!

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.

Health camp

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

మూగజీవాల రోదన.. పట్టింపు ఎవరిది..

శిథిలావస్థలో రామాయంపేట పశు వైద్యశాల..

… బిక్కుబిక్కుమంటు కార్యాలయంలో కూర్చుంటున్న డాక్టర్లు..

రామాయంపేట ఏప్రిల్ 29 నేటి ధాత్రి(మెదక్)

 

మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు. కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామాయంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామయంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల గ్రామాల పశువులతో పాటు, గొర్రెల కాపరులు పశువులకు ఏవైనా వ్యాధులు సోకితే రామయంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. పశువైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంట, నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తాచెదారం నిండిపోయి రెండు మూడు గదులు నిరుపయోగంగా ఉంచారు.

 

Hospital

ఉన్న ఒక గదిలో పైసలు కందించి టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారయింది. పశు వైద్య చికిత్సల కోసం వచ్చినవారు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవు అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉండగా గతంలో గ్రామ గ్రామాన పశు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు, మేకలు, పశువులకు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడ కూడా జరగడం లేదు. పశు జాతి తో పాటు గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో ఉన్న వాటిని ఏ వ్యాధులు సోఖకుండా కాపాడుకోవడానికి రైతులు తమ వంతు కృషి చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది.

Hospital

 

పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరం ఉన్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చిన వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. అలాగే వన్యప్రాణులు గాయపడ్డ, అస్వస్థతకు గురి అయిన సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తోనిగండ్ల గ్రామ శివారులో కృష్ణ జింకను ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకొని ఘటన స్థలానికి చేరుకునేలాగా ఆ కృష్ణ జింక్ అభివృద్ధి చెందింది. ఇదొకటే కాకుండా వన్య ప్లాన్లు గాయపడ్డ అశ్వసగురైన సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

 

Hospital

 

అందుబాటులో ఉంటున్నాం.. కానీ భయం గుప్పెట్లో వెటర్ని ఏడి తిరుపతి..

మేము ఎల్లప్పుడూ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాం. కానీ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న గోడౌన్ లో విధులు నిర్వహించడం జరుగుతుంది. శిథిలవస్తులు ఉన్న భవనం గురించి పై అధికారులకు తెలపడం జరిగింది. అలాగే పశువులతో పాటు అస్వస్థతలకు గురైన వన్యప్రాణులకు సరైన సమయంలో వైద్యం అందించడం జరుగుతుంది.

తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.!

‘తరుగు లేకుండా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..

Farmers

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు ఒక బస్తాకు మూడు నాలుగు కేజీల తరుగుదల తీస్తున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తే.. వ్యాపారస్తులు తమని మోసం చేస్తున్నారని వాపోయారు. ప్రజా పాలనలో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ‘జై జవాన్.. జై కిసాన్’ ‘తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి’ అంటూ.. రైతులు నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం

-భూ భారతితో భూ వివాదాలన్నీ పరిష్కారం.

-నవాబ్ పేట్ సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవాబుపేట నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి చట్టం పేదల రైతులు, ప్రజల చుట్టం అనీ, దీని ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం అన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అప్పటి ఎమ్మెల్యేలు నిరుపేదల భూములను కబ్జాలు చేసి వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. పేద ప్రజల భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. భూ భారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా, ప్రతి భూమికి భూధార్ కార్డుని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ ,భూధాన్, అసైన్డ్, దేవాదాయ, భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని, ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.

 

Farmers

ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువులోపుగానే సమస్యలు పరిష్కారమౌతాయని, అందుకే భూ భారతి చట్టం వచ్చాక రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సమస్యలు గ్రామంలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. జూన్ నెలలో ప్రతి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, పేద రైతులు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదాని వ్యాఖ్యానించారు. ధరణి వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని వివరించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మీద జరిగిన దాడిని ముత్తారం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఖండించారు వారు మాట్లాడుతూ ఇటీవలె జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కాన్ సెంటర్స్ ను పర్మిషన్ తీసుకోవాల్సిందని ఆదేశించిన సందర్భంలో జిల్లా వైద్యాధికారినీ అగౌరపరుస్తూ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుడు మరియు అబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ మండల వైద్యాధికారి అమరేందర్ రావు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది అని తెలిపారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి.!

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. .

తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భానుడు భగభగలతో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు ఒక వైపు సూర్య ప్రతాపం మరోవైపు ఉక్కపోతుతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని మొగులపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025.!

అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 అవగాహన సదస్సు పిఎసిఎస్ సేవలపై అవగాహన ర్యాలీ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 28-4-25సాయంత్రం 5: 30 ని లకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగంగా అవేర్నెస్ వాక్ ద్వారా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

 

International Year

ఈ కార్యక్రమంలో గుర్రం సురేష్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, ఎక్స్ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య, వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి చోట మియా, రైతులు, సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

ఉద్యమ ఆకాంక్షలే జన సమితి లక్ష్యం.

ఉద్యమ ఆకాంక్షలే జన సమితి లక్ష్యం

వనపర్తి లోఘనంగా జన సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో జన సమితి జెండా ను జిల్లా అధ్యక్షులు య౦ఏ.ఖాదర్ పాష.ఆవిష్కరించారు
. ఈ సందర్భంగా ఖాదర్ . మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల సాదనే కర్తవ్యంఅని పేర్కొన్నారు.
ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై, రైతాంగ సమస్యపై, ఆర్టీసీ సమస్యలపై, ఆదివాసీల సమస్యలపై పోరాడుతూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమించిందని అన్నారు గత పది సంవత్సరాలు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలను చైతన్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉద్యమ ఆకాంక్షల సాధనకు కృషి చేస్తుందని ఖాదర్ వెల్లడించారు. జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయని నిర్వహించామని తెలిపారు ఈ.
కార్యక్రమంలో.
య౦డి. షఫీ మైనార్టీ జిల్లా నాయకులు.
పిక్కిలి బాలయ్య మండల అధ్యక్షులు
శాంతారామ్ నాయక్.
కె వినోద్ కుమార్.పాన్ గల్
మైనుద్దీన్ సాబ్
జన సమితి జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ..

కాంగ్రెస్ నేతల కుమ్ములాట.!

కాంగ్రెస్ నేతల కుమ్ములాట
– కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం
– చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన
సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో
ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం ఒక్కసారిగా స్టేజి వద్దకు దూసుకెళ్లారు.

discussion

ఏనాడు పార్టీకి సేవ చేయలేదని ఉమేష్ రావు స్టేజి దిగి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీస్ లు కలగజేసుకొని శాంతింప చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సభను కొనసాగించారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఎదుటే నేతలు ఆందోళనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సైబర్ నేరాల చెధనకు పోలీసులకు.!

సైబర్ నేరాల చెధనకు పోలీసులకు ప్రత్యేక సైబర్ శిక్షణ కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పరిశోధనలో ఊపయోగించవలసిన అంశాలపై సైబర్ నిపుణులతో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది,అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం. అందులో భాగంగా మంగళవారం రోజున,,సి.డి.టీ.ఐ ( సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) హైదరాబాద్,రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల పోలీస్ అధికారులకు,సిబ్బందికి సైబర్ నిపుణులు ఆధ్వర్యంలో రెండు రోజుల ‘ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించరు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుత సమాజంలో.

crimes

ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది,అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ మోసాలకు ,సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే నేరగాళ్ళకు శిక్ష పడటంతో డిజిటల్ సాక్ష్యాధారాలు ప్రధాన పత్ర పోషిస్తాయన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు పిర్యాదు నమోదు నుండి డిజిటల్ ఆధారాలు సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై సైబర్ నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని సైబర్ నేరస్థులకి శిక్షలు పడేవిధంగా కృషి చేయాలన్నారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.భౌతిక పోలీసింగ్ తో పాటు డిజిటల్ పోలీసింగ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి

1.అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకండి.
2.వ్యక్తిగత సమాచారం (బ్యాంక్ డిటైల్స్, OTP, పాస్‌వర్డ్‌లు) ఎవరితోనూ పంచుకోకండి.
3.గుర్తు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ ద్వారా వచ్చిన డిమాండ్లను పట్టించుకోకండి.
4.బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు మాత్రమే అధికారిక వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారానే చేయండి.
4.సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంలో జాగ్రత్త వహించండి.
5.ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల ఆన్లైన్ భద్రత పై తల్లిదండ్రులు దృష్టి సారించాలి,పిల్లల ప్రవర్తన పై నిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.
6.ఆన్లైన్ ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టి మోసపోవద్దు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రాజ్ కుమార్ డీఎస్పీ , కోర్స్ కోఆర్డినేటర్ ,సి.డి.టీ.ఐ హైదరాబాద్ భీమా కృష్ణా నాయక్ ,,సి.డి.టీ.ఐ అఖిల్ రావు కొండూరి, ఇంటర్నేషనల్ సైబర్ ఎక్స్పోర్ట్ ,పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్.!

ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్…

జహీరాబాద్ నేటి దాత్రి:

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్హేర్ నాయబ్ తహశీల్దార్ పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదిలాల్ ను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పవన్ కుమార్ జహీరాబాద్ లో పనిచేసే సమయంలో భూమి వారసత్వ బదలాయింపు దరఖాస్తుపై సరైన విచారణ చేయనందుకు సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం గ్రామంలో తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల కేంద్రమైన బంగ్లా గడ్డ కాలోనీ వాసులు ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ బంగ్లా గడ్డ కాలనీ వాసులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు. జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.6రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 

Summer Season.

గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు.ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు.

దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నో నీరు వృథాగా పోతున్నది.

అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

వేసవి కాలంలో నీరు వృథా చేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

మంచినీటి సమస్య మరియు విద్యుత్ సమస్య.!

మార్కెట్ కమిటీ లో మంచినీటి సమస్య మరియు విద్యుత్ సమస్య.

కల్వకుర్తి/నేటి దాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోనిఆమనగల్ మార్కెట్ కమిటీ లో మంచినీటి సమస్య విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు ఆమనగల్ మున్సిపల్ కార్యాలయం లో కమిషనర్ శoకర్ నాయక్ కు వినతి పత్రం అందజేచేయడం జరిగింది ఆమనగల్ మార్కెట్ యార్డ్ లో తాగు నీటి సమస్య ఉందని అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కి లైట్ల ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ గ్రామాల నుండి రైతులు ధాన్యం అమ్మడం కోసం వస్తుంటారు వారికి కనీస సౌకర్యం తాగునీరు విద్యుత్ లైట్ల సమస్యను తక్షణమే వాళ్లకు సౌకర్యం కల్పించాలని తాళ్ల రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరారు.

సన్మానించిన ముదిరాజ్ కులస్తులు.

ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్

మంచిర్యాల నేటి దాత్రి

 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్. శ్రావణ్ . రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బి సి ,ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల ఫిజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది

స్టార్ ఐకాన్ 2025 అవార్డ్ అందుకున్న సునీల్.!

స్టార్ ఐకాన్ 2025 అవార్డ్ అందుకున్న సునీల్.

చిట్యాల నేటి దాత్రి :

చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ మంచి మంచి పాటలతో జనాదరణ పొందుతు తనకంటు ఒక ప్రత్యేక శైలిలో ఆలతి ఆలతి పదాలతో అద్భుతమైన భావాలతో పాటలు రాస్తున్నందుకు గాను జూకల్ బిడ్డకు దక్కిన గౌరవం
దిల్ సుఖ్ నగర్ జగదాంబ
సారిస్ వి ఈవెంట్స్ అధ్వర్యంలో స్టార్ ఐకాన్ అవార్డ్స్ 2025 అవార్డు సునీల్ బెస్ట్ ఇయర్ రచయితకు
మాజీ కేంద్రమంత్రి
సముద్రాల వేణుగోపాలచారి ఎల్బి ప్రముఖ వైద్యులు
కాంటెస్టేడ్ ఎమ్మెల్యే విరబోగ వసంతరాయులు మరియు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా హైదరాబాద్ సురభి ఎలైట్ హోటల్ లో స్టార్ ఐకాన్ అవార్డ్ తీసుకుంటున్న కవి రచయిత మ్యాదరి సునీల్ గని
స్టార్ ఐకాన్ అవార్డ్ కు ఎంపిక చేసిన దుర్గ ప్రసాద్ కి ధన్యవాదాలు ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా జూకల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.!

వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..
★ఎస్సై టి. నరేష్ ……

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఎస్ఐ టి నరేష్. వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ టి నరేష్ సూచించారు. దొంగతనాల నియంత్రణకు జిల్లా పోలీసు వారి సూచనలు ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం మంచిది షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. • ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్ఐ టి నరేష్ గారు సూచించారు.

error: Content is protected !!
Exit mobile version