సైబర్ నేరాల చెధనకు పోలీసులకు.!

సైబర్ నేరాల చెధనకు పోలీసులకు ప్రత్యేక సైబర్ శిక్షణ కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పరిశోధనలో ఊపయోగించవలసిన అంశాలపై సైబర్ నిపుణులతో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది,అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం. అందులో భాగంగా మంగళవారం రోజున,,సి.డి.టీ.ఐ ( సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) హైదరాబాద్,రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల పోలీస్ అధికారులకు,సిబ్బందికి సైబర్ నిపుణులు ఆధ్వర్యంలో రెండు రోజుల ‘ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించరు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుత సమాజంలో.

crimes

ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది,అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ మోసాలకు ,సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే నేరగాళ్ళకు శిక్ష పడటంతో డిజిటల్ సాక్ష్యాధారాలు ప్రధాన పత్ర పోషిస్తాయన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు పిర్యాదు నమోదు నుండి డిజిటల్ ఆధారాలు సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై సైబర్ నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని సైబర్ నేరస్థులకి శిక్షలు పడేవిధంగా కృషి చేయాలన్నారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.భౌతిక పోలీసింగ్ తో పాటు డిజిటల్ పోలీసింగ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి

1.అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకండి.
2.వ్యక్తిగత సమాచారం (బ్యాంక్ డిటైల్స్, OTP, పాస్‌వర్డ్‌లు) ఎవరితోనూ పంచుకోకండి.
3.గుర్తు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ ద్వారా వచ్చిన డిమాండ్లను పట్టించుకోకండి.
4.బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు మాత్రమే అధికారిక వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారానే చేయండి.
4.సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంలో జాగ్రత్త వహించండి.
5.ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల ఆన్లైన్ భద్రత పై తల్లిదండ్రులు దృష్టి సారించాలి,పిల్లల ప్రవర్తన పై నిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.
6.ఆన్లైన్ ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టి మోసపోవద్దు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రాజ్ కుమార్ డీఎస్పీ , కోర్స్ కోఆర్డినేటర్ ,సి.డి.టీ.ఐ హైదరాబాద్ భీమా కృష్ణా నాయక్ ,,సి.డి.టీ.ఐ అఖిల్ రావు కొండూరి, ఇంటర్నేషనల్ సైబర్ ఎక్స్పోర్ట్ ,పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version