కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

వ్యాధుల కాలం- జరఫైలం..

అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…

ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి…

మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి…

మీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలి…

దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి…

వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి…

పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి…

బిపి, హెచ్ఐవి,షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవనందించాలి…

స్కానింగ్ మిషన్లు,ఫ్యాన్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి…

 

 

 

 

 

Lurking seasonal diseases

నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:- వర్షాకాలం ప్రారంభంలో మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించి రోడ్లపైనే మురికి నీరు నిలబడడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామస్థాయి అధికారులు, వైద్య సిబ్బంది ముందు నుండే జాగ్రత్త పడి జ్వరాలను నియంత్రించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా డెంగ్యూ, చికున్ గున్య, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం కారణంగా వీధులు, రహదారులు, ఇళ్ల నడుమ మురుగునీరు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ,చికున్ గున్య,మెదడువాపు, ఫైలేరియా,అతిసారం, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలి. ఆసుపత్రి చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించుకోవాలి. పల్లె ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే రోగులకు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగి వైద్యం అందించాలి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలి. అత్యవసర మందులు ఆసుపత్రుల్లో సమయానికి లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ, మున్సిపల్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి ప్రజలు డెంగ్యూ,మలేరియా,చీకున్ గున్య లాంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. డ్రైనేజీలు మురుగు నీటితో, చెత్తాచెదారం తో నిండిపోయి ఉన్నాయి. తక్షణమే డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. వర్షాకాలంలో మంచినీటి బావులలో చెత్తాచెదారం, దుమ్ము ధూళితో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయించి దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి. వారానికి రెండు రోజులు డ్రైడే పాటించేలా అధికారులు కిందిస్తాయి అధికారులను ఆదేశించాలి. వర్షాకాలంలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. మలేరియా, చీకున్ గున్య, డెంగ్యూ వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తి చెందడం కారణంగా వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉంటుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని రకాల మందులతోపాటు నీడిల్స్ కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. బిపి, హెచ్ఐవి, షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన సేవలందించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించడంలో విఫలం చెందటంతో ప్రజలు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలో నిర్లక్ష్యం మూలంగా, సకాలంలో వైద్యం అందించకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.మలేరియా, చీకున్ గున్య, ఫైలేరియా, డెంగ్యూ, జ్వరాలు మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అతిసారా, కలరా, రక్త విరోచనాలు, టైఫాయిడ్, వ్యాధులు రాకుండా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. పాము తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి. పాము తేలు కాటుకు గురైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాలు, నాటు వైద్యులను సంప్రదించి ఆలస్యం చేయడం మూలంగా మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాల బారి నుండి ప్రజలను కాపాడే విధంగా వైద్య సిబ్బంది చొరవ చూపాలి. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. గ్రామపంచాయతీలు, పురపాలికల్లో నీటి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల వద్దకు ప్రతి ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు తెలియజేయాలి. ఇళ్లలోని కుండీలు, కూలర్లు వంటి వాటిలో ఉన్న నీటిని పారబోసేలా చైతన్యం చేయాలి. గ్రామాలు కాలనీల్లో ని ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా, వైద్యులు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో గ్రామాల్లో ఇవేమీ అమలు కావడం లేదు. సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్న వేళ ముందస్తు చర్యలు చేపట్టి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కోరుతున్నారు.

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

 

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. నేటి కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అరటి పువ్వు మధుమేహానికి దివ్య ఔషధమని అంటున్నారు. దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు.
అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను
రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం
జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరని తెలిపారు. అంతే
కాక 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు కేజిబివిలు
సాధించయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో గల 09 కేజిబివిలలో ఖానాపూర్, రాయపర్తి మరియు వర్ధన్నపేట
కేజిబివిలలో ఎంపీసీ,బైపిసి కోర్సులు ,చెన్నారావుపేట, గీసుగొండ, నల్లబెల్లి,సంగెం కేజిబివిలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యు,(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) కోర్సులు ఉన్నాయని అలాగే దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో ఎంఎల్టి కోర్సులలో అధిక
మొత్తంలో గ్రామీణ ప్రాంతంలోని పేద బలహీనవర్గాల బాలికలు ప్రవేశాలను పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు.

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…

ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…

డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…

నేటి ధాత్రి – మహబూబాబాద్ :-

 

 

జిల్లాలో వ్యాప్తంగా పనిచేస్తున్న ఫార్మసీ వైద్య సిబ్బంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్,ఐ యు సి డి జిల్లాకు వచ్చినఅన్ని రకాల మందులు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ వైద్య సిబ్బందిలో తో ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ,వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం సూచించారు.

Dr. B. Ravi Rathod, District Medical Health Officer.

 

 

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,లోక్య,ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

 

 

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారంతో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు పొగాకు వ్యతిరేకత దినోత్సవం గురించి మండల ప్రజలు మరియు పేషంట్లతోని పొగాకు వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు తెలియజేయుచు దీనిని వాడకూడదని వాడిన వారిని వాడకుండా చూడాలని చెప్పుచు అందరి చేత పొగాకు వాడకం నిరోధించుటకు ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ పొగాకుతో అనుసంధానం అయినా పాన్ మసాలాలు తంబాకులు సిగరెట్లు వాడడం వల్ల త్రోట్ క్యాన్సర్ గాని లంగ్ క్యాన్సర్ గాని వివిధ రకములైన జబ్బులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇలాంటివి వాడకూడదని తెలియజేసి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది. అందరితోని పొగాకు వాడమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో పి ఎచ్ ఎన్ గ్రేసీ వన్ సూపర్వైజర్స్ రమాదేవి ఎమ్ ఎల్ ఎచ్ పి లావణ్య దీప్తి మరియు ఏఎన్ఎంలు రమాదేవి స్రవంతి సునీత కళావతి దుర్గమ్మ పుష్పలత మరియు ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ ఫార్మసిస్ట్ జగదీశ్వర్ మరియు భూపెల్లి మొగిలి పాల్గొన్నారు

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా

కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

 

తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తారకరామ హాస్పిటల్ లో పేర్టీ నైన్ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తారకరామ హాస్పిటల్ మేనేజ్మెంట్ దొంతుల రమేష్ తెలియజేశారు. అంతేకాకుండా పేర్టీ నైన్ హాస్పిటల్ సంస్థ హైదరాబాద్ వారు పాల్గొని ఉచిత క్యాంపును విజయవంతం చేయడం జరిగినది.

గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలోని అజిలాపురం, కుందారం తండా, లాలు తాండ, గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధగొని రమేష్ గౌడ్ , ఆశ వర్కర్ కలమ్మ, సిద్ధగోని పరమేష్, బుడ్డ రాములు, ఆర్కే గౌడ్, కుమార్, ఎండి ఖాజాబీ, కాలే నరసింహ, ఎండి జాఫర్, నిరంజన్, లింగం, కేశముని పరమేష్, కొప్పుల యాదయ్య , మహేష్, రామచంద్రి, దాములా నాయక్, రమేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ గ్రామ పెద్దలు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రీమ్ 100 ఆధ్వర్యంలో.. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సినిమా హీరో, డ్రీమ్ 100 ఫౌండర్ మాలినేని కృష్ణ ఆధ్వర్యంలో రూ.1 భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు ఆసుపత్రికి వచ్చి ఆకలితో బాధపడకుండా.. ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ‘అన్నదానం మహా దానం’ అన్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. నిరుపేదలను ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరూ అన్నదానం చేయుటకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయలక్ష్మి తిరుపతి, హరి సింగ్, గుమ్మల్ల రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని. లక్ష్యాలు సాధించాలని సూచించారు. అకాల వర్షాలతో వైరస్ ప్రజలకు సుజనల్ వ్యాధులు వాటికప్పుడు అందజేయాలని విష జ్వరాలు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున దోమలు పుట్టకుండా కుట్టకుండా నివారణ జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తూ వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ ఆసిఫా వైద్య సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్

ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి

డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురైనటు వంటి సందర్భాల్లో ఎన్నో కలు గుతున్నాయి మీరు ఆరోగ్యా న్ని పరిరక్షించడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తుల సంఘం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాలలో ఏర్పాటుచేసి ఆరోగ్య పరిరక్షణ కొరకై రైతులు ఆరోగ్య పరిరక్షణ కొరకై పాటు పడుతుందని అన్నారు.ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. బుధవారం రోజు మెడికవర్ శరత్ ఐ విజన్ సహకారంతో గ్రామంలో 135 మందికి పరీక్షించగా ఇందులో 35 మందికి కంటి పరీక్షలు ఉచితంగా చేయునట్లు తెలిపారు అదేవిధంగా ఈసీజీ ద్వారా 45 మంది పరీక్షించు కోవడం జరిగింది.ఇంతటి సహాయ సహకారాలు అందిం చిన మెడికవర్ హాస్పిటల్ శరత్ ఐవిజన్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గ సభ్యులు కర్ర ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి కిరణ్ మెడి కవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ ఎండి సర్జన్ , డాక్టర్ షఫీ, జనరల్ సర్జన్ డాక్టర్ జిన్నత్ రెడ్డి ,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమంత్ ,పియు మేనేజర్ గుడమాల మానస చౌదరి, గ్రామ క్షేత్ర కార్యకర్తలు రవిచంద్ర, పోతు సునీల్,వంశీ , ప్రశాంత్  పాల్గొన్నారు.

ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Manik Rao

 

 

అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version