చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-21.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.
గుండెపోటు.. ప్రస్తుతం చాలా మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు అనేది తీవ్రమైన సమస్య. దీని ప్రమాదం పెద్దలు మరియు పిల్లలలో పెరుగుతోంది. నిజానికి శరీరంలో రక్తం అడ్డుగా ఉన్నప్పుడు గుండె కండరాలు సక్రమంగా పని చేయకపోవడమే కాకుండా గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.

Heart attack in children

వ్యాయామం లేకుండా ఉండటం..

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. పిల్లలు ఆడుకోవడం మానేశారు. టీవీ, మొబైల్, ల్యాప్టాప్ ముందు కూర్చుని ఇంట్లో ఏదో తిన్నారు. రోజంతా ఒకే చోట కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నేటి పిల్లలు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారు.. అంటే దానికి బానిసలై మైండ్ ని బలహీనపరుస్తున్నారు.

పిల్లల్లో ఒత్తిడి..

ఇది పిల్లలలో ఒత్తిడి సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి కారణంగా వారికి గుండె సమస్యలు కూడా వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ వాడడం, అందులో గేమ్లు ఆడడం, తెల్లవారుజామున నిద్రలేవడం వంటివన్నీ రోగాలకు కారణమవుతున్నాయి.

పిల్లల్లో ఊబకాయం సమస్య ..

ఊబకాయం సమస్య కూడా పిల్లల్లో గుండెపోటుకు దారి తీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాట్లపై దృష్టి పెట్టాలి. వారితో సమయం గడపాలి.

పిల్లలు తినే ఆహారం..

పిల్లలు ఒత్తిడితో గుండెపోటు వంటి వ్యాధుల బారిన పడకుండా వారి శారీరక దృఢత్వంపై కూడా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వాలి. బయటికి వెళ్లినప్పుడు చాలా అరుదుగా బయటి ఆహారాన్ని తినవచ్చు. కానీ, క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఊబకాయం ఏర్పడుతుంది.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత….

ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా పథకంకు కృషి…

ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-20.wav?_=2

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నిత్యం రోడ్ల పై తిరుగుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఆరోగ్యం పై జాగ్రతలు తీసుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారని, వారికి ఎలాంటి ఆరోగ్య బీమాలపై సరైన అవగాహన ఉండట్లేదని అందుకే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా పథకం అమలు చేయించేందుకు కృషి చేస్తానని రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య అన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్ర రవి అనారోగ్యానికి గురై గత వారం మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎనగంటి సంపత్, ఉపాధ్యక్షులు పాక అంజయ్య, ప్రధాన కార్యదర్శి జీడి రవి, చెన్నాల సారయ్య ,ముల్కల నరసయ్య, ఆల్క పున్నం, వాసం సది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్ష సమావేశంలో క్షయ వ్యాధి నివారణలో ఆశలు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు తెమడ బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపవలసిందిగా మరియు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కొరకై ఆరోగ్య మహిళా క్లినిక్ యందు పరీక్షలు చేయించవలసిందిగా సూచిస్తూ, మలేరియా డెంగ్యూ జ్వరాల నివారణ డ్రై డే కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించవలసిందిగా సూచిస్తూ ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్షించినారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్. సంపత్ కుమార్, పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ గార్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

నడికూడ,నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-8.wav?_=3

మండలంలోని కంఠాత్మకూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ విష జ్వరాల బారిన పడకుండా గ్రామంలో ప్రజలను అప్రమతము చేయుట లో భాగంగా ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రముగా,పిచ్చి మొక్కలు ఇతర నీరు నిల్వ ఉండకుండా పడవేసిన డబ్బాలు ఇతర వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి బోండాలు ఏ ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా దోమలు నివారణలో భాగంగా కంఠాత్మకూరు గ్రామంనకు డ్రై డే ఫ్రైడే లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి హనుమకొండ ఎల్.లక్ష్మీ రమాకాంత్ ఇంటి పరిసరాలను పరిశీలించి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.వీరి వెంట సిహెచ్ రవి,మండల పంచాయతీ అధికారి నడికూడ బి.భార్గవి పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది,ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-7.wav?_=4

చిన్న మీడిసిలేరు గ్రామంలో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల హోమియోపతి వైద్యరాలు డాక్టర్ పూజ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య కేంద్రంలో 67 మంది ప్రజలను చూసి హోమియోపతి మందులను అందించారు
డాక్టర్ పూజ మాట్లాడుతూ హోమియో మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేసే మందులు ఈ మందులు అందరూ ఉపయోగించుకోవాలి
దీర్ఘకాలిక రోగాలకు చర్మ రోగాలకు పిడ్స్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల సమస్యలు ఫైల్స్ మొదలగు అన్ని వ్యాధులకు ఈ మందులు చక్కగా పనిచేస్తాయి
అందరు హోమియోపతి మందులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరులో ఈ మందులు ఉచితంగా లభిస్తాయి కనుక చర్ల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేశారు

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ .

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో వెంటనే డాక్టర్లను నియమించాలి…. గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు* ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు…వెంటనే జిల్లా కలెక్టర్ గారు నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని ఆయన హెచ్చరించారు..

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..!

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కచ్చితంగా శరీరానికి అందాల్సిందే. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది శరీరానికి అవసరమయ్యే ఖనిజాల్లో అత్యంత ప్రధానమైనది. ఏకంగా 300 విధుల్లో శరీరానికి తోడ్పడుతుంది. మన ఒంట్లో శక్తి ఉత్పత్తికి, పెరుగుదల సహా అనేక ఇతర క్రియలకు అత్యంత ముఖ్యమైనది.

ప్రతిరోజూ ఆహారంలో తగినంత మెగ్నీషియం తీసుకోని వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అత్యంత సర్వసాధారణంగా కనిపించే ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మూల్యంగా ప్రాణాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏఏ లక్షణాల ద్వారా మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

కండరాల తిమ్మిరి

శరీరంలో మెగ్నీషియం తగ్గితే కనిపించే మొట్టమొదటి సంకేతం కండరాల తిమ్మిర్లు. కాళ్ళలో తరచుగా కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఉంటే మెగ్నీషియం లోపించిందని అర్థం. కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు అసాధారణంగా సంకోచిస్తాయి. నరాల పనితీరు దెబ్బతింటుంది.

అలసట, బలహీనత

విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే తక్కువ మెగ్నీషియం స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ ఖనిజం శక్తికి ముఖ్యమైనది. ఇది లోపిస్తే కణాల్లోని శక్తి తగ్గుతుంది. అందుకే అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

క్రమరహిత హృదయ స్పందన

మెగ్నీషియం గుండె కండరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు గుండె దడ, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథ్మియా) లేదా ఛాతీ బిగుతుకు కారణమవుతుంది.

జలదరింపు

చేతులు, కాళ్ళు లేదా ముఖంలో జలదరింపు అనుభూతులు లేదా తిమ్మిరి మెగ్నీషియం లోపానికి సంకేతాలు. ఇలాంటివారిలో నరాల సరిగా పనిచేయవు. నరాల సాధారణ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే, మెగ్నీషియం నరాల సంకేతాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చాక్లెట్ లేదా ఉప్పు

మీకు తరచుగా చాక్లెట్ లేదా ఉప్పు తినాలనే కోరికలు కలుగుతుంటే ఒంట్లో తక్కువ మెగ్నీషియం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఖనిజాలకు గొప్ప మూలం. మెగ్నీషియం అసమతుల్యతను భర్తీ చేసుకునేందుకు మీ శరీరం ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కోరుకోవచ్చు.

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన..

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన హనుమంతరావు పటేల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రముఖ హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలోఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది లింగాయత్ సత్రం, టెంపుల్ రోడ్ నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ప్రారంభించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ,ఆర్థో,కంటి,బిపి,డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు వచ్చిన రోగులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలను అవసరమైన టెస్టులు మందులు ఉచితంగా అందించడం జరిగింది. గ్రామస్తులు ఆయా గ్రామస్తులను ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే, ఈ లక్షణాలు, మీ శరీరంలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..

 మన శరీరం దాని లోపల జరిగే ప్రతి మార్పు గురించి మనకు సమాచారాన్ని అందిస్తుంది. మనం దానిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాబట్టి, ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో వాపు, అలసట, బలహీనత అనేవి మీ అంతర్గత అవయవాలు అనారోగ్యానికి గురవుతాయని హెచ్చరించే కొన్ని లక్షణాలు. మూత్రంలో అధిక నురుగు, తరచుగా మూత్రవిసర్జన, మూత్ర పరిమాణంలో తీవ్రమైన మార్పులు మొదలైనవి మూత్రపిండాల సమస్యలను సూచించే కొన్ని లక్షణాలు.

ఇది మాత్రమే కాదు.. మీ కాళ్ళు, చీలమండలు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు కనిపించడం ప్రారంభిస్తే మీ మూత్రపిండాలలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోండి. దీనితో పాటు శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, రక్తపోటు పెరగడం, శరీరంలో తేలికపాటి దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఇది మీ మూత్రపిండాలలో సమస్యకు ప్రత్యక్ష సూచన అని గుర్తుంచుకోండి.

బరువు పెరగడం లేదా తగ్గడం, కడుపులో గ్యాస్, ఎల్లప్పుడూ ఆమ్లత్వం వంటి సమస్యలు మొదలైనవి మీ ప్రేగుల ఆరోగ్యం క్షీణిస్తోందని సూచించే కొన్ని లక్షణాలు. ఇది మాత్రమే కాదు, మీరు మళ్లీ మళ్లీ తినాలని భావిస్తుంటే ఒత్తిడికి గురవుతుంటే ఇవి ప్రేగులలోని రుగ్మత లక్షణాలు కూడా కావచ్చు. ఈ లక్షణాలను తెలుసుకుని వాటికి చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం .

https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం 
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ 
పరకాల నేటిధాత్రి 
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే..

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే.. ఎన్నో అద్భుతమైన ఫలితాలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాయామం అంటే మ‌రీ క‌ష్ట‌ప‌డి జిమ్‌ల‌లో క‌స‌ర‌త్తులు చేయాల్సిన ప‌నిలేదు. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు సాధార‌ణ వాకింగ్ చేసినా చాలు. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద‌యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల రోజంతా మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగిస్తూనే ఉంటుంది. క‌నుక‌నే ఉద‌యం వ్యాయామం చేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కేవ‌లం ఉద‌యం మాత్ర‌మే కాదు.. రాత్రి పూట భోజ‌నం అనంత‌రం కూడా వాకింగ్ చేయాలి. దీంతో మ‌రింత ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంతరం వాకింగ్ చేయ‌డం ఎన్నో మంచి ఫలితాల‌ను ఇస్తుంద‌ని వారు అంటున్నారు.

అధిక బ‌రువు, షుగ‌ర్ లెవ‌ల్స్‌..

Walking after dinner

రాత్రి పూట భోజ‌నం చేసిన అనంతరం క‌నీసం 10 నిమిషాల పాటు తేలిక‌పాటి న‌డ‌క కొన‌సాగించాలి. రాత్రి పూట మ‌న మెట‌బాలిజం త‌గ్గుతుంది. కానీ వాకింగ్ చేస్తే మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు. దీంతో రాత్రి మ‌నం నిద్రించినా కూడా మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తూనే ఉంటుంది. ఫ‌లితంగా మ‌నం నిద్ర‌లో ఉన్నా కూడా మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా రాత్రి పూట డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేస్తే ఎన్నో మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక రాత్రి పూట భోజ‌నం అనంత‌రం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌న అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం రాత్రి డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేసేవారి ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌ని తేల్చారు. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకునేందుకు గాను రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంత‌రం వాకింగ్ చేయాలి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే విష‌యం.

ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా.!

ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరుపుకున్న వైద్యాధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్య కేంద్రమైన బిలాల్పూర్ లో ప్రాథమిక కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా డాక్టర్ నరేందర్ సూపర్వైజర్ శోభారాణి ల్యాబ్ టెక్నీషియన్ వసంతరావు ఫార్మసిస్ట్ ఆదిల్ అలీ స్టాఫ్ నర్స్ సోనీ పాండు తదితరులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య .

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బట్టిగూడెం గ్రామంలో డాక్టర్ నగేష్ హెల్త్ క్యాంపు నిర్వహించినారు రోగులకు మందులు ఇచ్చారు అనంతరం ప్రతి ఇంటిని పరిశీలన చేసి గ్రామానికి వచ్చే వారు చతిస్గడ్ నుంచి వచ్చే వారి నుండి రక్తనమూనాలను సేకరించాలని వారి నుండి మలేరియా మనకు సోకే అవకాశం ఉన్నoదున జాగ్రత వహించాలని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమ తెరలు వినియోగించు కోవాలని పరిశుభ్రమైన మంచి నీరును తీసుకోవాలని నీటి నిల్వలలో యాంటి లార్వా టేమిఫోస్ వేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాల సిబ్బంది
టీ బాబురావు హెచ్ ఈ ఓ
కే తిరుపతమ్మ యమ్ పి హెచ్ యస్టి వేణు హెల్త్ అసిస్టెంట్
కే విజయక్ష్మి యమ్ పి హెచ్ ఏ కే తిరుపతమ్మ ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు

సీజనల్ పై అప్రమత్తత అవసరం.

సీజనల్ పై అప్రమత్తత అవసరం…

డెంగ్యూ ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలి…

దోమ తెరలను ఉపయోగించాలి…

దోమలను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోవాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి. అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వసతులు కల్పించాలి. ఔషధ నిల్వలను సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు పాటించాలి. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలి.డెంగ్యూ జ్వరం అనేది బాధాకరమైన, బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, మరియు రెండవసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం మరియు షాక్‌కు దారితీస్తాయి, ఇది ప్రాణాంతకమవుతుంది.

 

 

డెంగ్యూ జ్వరం నాలుగు దగ్గరి సంబంధం ఉన్న డెంగ్యూ వైరస్‌లలో ఏదైనా ఒక దాని వల్ల వస్తుంది. ఈ వైరస్‌లు వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ మరియు ఎల్లో ఫీవర్‌కి కారణమయ్యే వైరస్‌లకు సంబంధించినవి.సోకిన వ్యక్తి చుట్టూ ఉండటం ద్వారా డెంగ్యూ జ్వరం పొందలేరు. బదులుగా, డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సోకిన దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు, వైరస్ ఆ వ్యక్తి రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న తర్వాత, సోకిన వైరస్‌కు దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఉంటుంది – కానీ ఇతర మూడు డెంగ్యూ జ్వరం వైరస్ రకాలకు కాదు. భవిష్యత్తులో ఇతర మూడు రకాల వైరస్‌ల ద్వారా మళ్లీ సోకవచ్చని దీని అర్థం. రెండవ, మూడవ లేదా నాల్గవ సారి డెంగ్యూ జ్వరం ఉంటే, తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.డెంగ్యూ లక్షణాలు, సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 రోజుల వరకు ఉంటాయి.డెంగ్యూ వచ్చిన వారికీ ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), తీవ్రమైన తలనొప్పి,కళ్ళు వెనుక నొప్పి,తీవ్రమైన ఉమ్మడి మరియు కండరాల నొప్పి

 

అలసట,వికారం,వాంతులు అవుతున్నాయి.అతిసారం,చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది.తేలికపాటి రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి.కొన్నిసార్లు, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తేలికపాటివి మరియు ఫ్లూ లేదా ఇతర వైరల్ సంక్రమణ లక్షణాలు కావచ్చు. చిన్నపిల్లలు మరియు మునుపెన్నడూ ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులు పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే తేలికపాటి కేసులను కలిగి ఉంటారు. అయినప్పటికీ, వారు తీవ్రమైన సమస్యలను అభివృద్ధి చేయవచ్చు. డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, అధిక జ్వరం, శోషరస మరియు రక్త నాళాలు దెబ్బతినడం, ముక్కు మరియు చిగుళ్ళ నుండి రక్తస్రావం, కాలేయం పెద్దదిగా మారడం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉన్నాయి.

 

 

 

 

లక్షణాలు భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (డి ఎస్ ఎస్ )అంటారు.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు మరియు రెండవ లేదా పదేపదే డెంగ్యూ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మరియు లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. మరియు మీ రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) తగ్గింది. ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం మరియు మరణానికి కూడా దారితీస్తుంది.తీవ్రమైన డెంగ్యూ జ్వరం యొక్క హెచ్చరిక సంకేతాలు, ఇది త్వరగా అభివృద్ధి చెందగల ప్రాణాంతక అత్యవసర పరిస్థితి.

 

 

 

 

హెచ్చరిక సంకేతాలు సాధారణంగా మీ జ్వరం తగ్గిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ప్రారంభమవుతాయి మరియు క్రింది సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉండవచ్చు.తీవ్రమైన కడుపు నొప్పి,తరచుగా వాంతులు,చిగుళ్ళు లేదా ముక్కు నుండి రక్తస్రావం,మూత్రం, మలం లేదా వాంతిలో రక్తం,చర్మం కింద రక్తస్రావం, ఇది గాయం లాగా ఉండవచ్చు.శ్వాస ఆడకపోవడం (కష్టం లేదా వేగవంతమైన శ్వాస),అలసిపోయాను,చిరాకు లేదా చంచలత్వం.ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రాంతాన్ని సందర్శించినట్లయితే. మీకు జ్వరం వచ్చినప్పుడు మరియు పైన పేర్కొన్న హెచ్చరిక లక్షణాలు ఏవైనా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 

డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం సోకిన దోమల నుండి కాటును నివారించడం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి,ఇంటి లోపల కూడా దోమ తెరలను ఉపయోగించండి.బయట ఉన్నప్పుడు, పొడవాటి చేతుల చొక్కా మరియు పొడవాటి ప్యాంటును సాక్స్‌లో ఉంచి ధరించాలి.అందుబాటులో ఉంటే, ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించాలి.విండో మరియు డోర్ స్క్రీన్‌లు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.నిద్రపోయే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషన్ చేయకపోతే, దోమతెరను ఉపయోగించాలి. డెంగ్యూ లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.

 

 

 

దోమల జనాభాను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోండి. బహిరంగ పక్షి స్నానాలు మరియు పెంపుడు జంతువుల నీటి వంటలలో నీటిని క్రమం తప్పకుండా మార్చండి, బకెట్ల నుండి నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయాలి. దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలి. వర్షాకాలంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. డెంగ్యూ పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

గుడ్లకర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

గుడ్లకర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
మొగుళ్లపల్లినేటి ధాత్రి


మొగుళ్లపల్లి మండలం గుండ్ల కర్తి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ యాస్మిని గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని గురువారం రోజున నిర్వహించినారు. గ్రామంలో46 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం సులోచన పంచాయతీ సెక్రెటరీ మౌనిక ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version