మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..!

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కచ్చితంగా శరీరానికి అందాల్సిందే. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది శరీరానికి అవసరమయ్యే ఖనిజాల్లో అత్యంత ప్రధానమైనది. ఏకంగా 300 విధుల్లో శరీరానికి తోడ్పడుతుంది. మన ఒంట్లో శక్తి ఉత్పత్తికి, పెరుగుదల సహా అనేక ఇతర క్రియలకు అత్యంత ముఖ్యమైనది.

ప్రతిరోజూ ఆహారంలో తగినంత మెగ్నీషియం తీసుకోని వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అత్యంత సర్వసాధారణంగా కనిపించే ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మూల్యంగా ప్రాణాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏఏ లక్షణాల ద్వారా మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

కండరాల తిమ్మిరి

శరీరంలో మెగ్నీషియం తగ్గితే కనిపించే మొట్టమొదటి సంకేతం కండరాల తిమ్మిర్లు. కాళ్ళలో తరచుగా కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఉంటే మెగ్నీషియం లోపించిందని అర్థం. కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు అసాధారణంగా సంకోచిస్తాయి. నరాల పనితీరు దెబ్బతింటుంది.

అలసట, బలహీనత

విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే తక్కువ మెగ్నీషియం స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ ఖనిజం శక్తికి ముఖ్యమైనది. ఇది లోపిస్తే కణాల్లోని శక్తి తగ్గుతుంది. అందుకే అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

క్రమరహిత హృదయ స్పందన

మెగ్నీషియం గుండె కండరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు గుండె దడ, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథ్మియా) లేదా ఛాతీ బిగుతుకు కారణమవుతుంది.

జలదరింపు

చేతులు, కాళ్ళు లేదా ముఖంలో జలదరింపు అనుభూతులు లేదా తిమ్మిరి మెగ్నీషియం లోపానికి సంకేతాలు. ఇలాంటివారిలో నరాల సరిగా పనిచేయవు. నరాల సాధారణ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే, మెగ్నీషియం నరాల సంకేతాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చాక్లెట్ లేదా ఉప్పు

మీకు తరచుగా చాక్లెట్ లేదా ఉప్పు తినాలనే కోరికలు కలుగుతుంటే ఒంట్లో తక్కువ మెగ్నీషియం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఖనిజాలకు గొప్ప మూలం. మెగ్నీషియం అసమతుల్యతను భర్తీ చేసుకునేందుకు మీ శరీరం ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కోరుకోవచ్చు.

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని.!

ప్రాణాయాపయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుని ఇచ్చిన మాట 

తప్పకుండా నెరవేర్చిన కేటీఆర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్ళగా. సౌదీలో ప్రమాదవశావస్తు. 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో. తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా. ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. దీనితో దిక్కులేని పరిస్థితులు మధ్య ఉన్న పరిస్థితిని ఇండియాలో గ్రామంలోని కుటుంబ సభ్యులకు తన దీన పరిస్థితిని వివరించారు. ఈ విషయమై మాజీ మంత్రి సిరిసిల్ల కెటి రామారావు దృష్టికి తీసుకురాగా. గ్రామంలో పర్యటించి. కుటుంబ సభ్యులను. ఓదార్చి వారికి మనోధర్యం చెప్పి. మీ బాబుని ఎలాగైనా ఇండియాకు తీసుకొచ్చి మంచి వైద్యం కల్పించే బాధ్యత నాది అని. సదురు గాయపడిన వ్యక్తితో సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడి తమకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తానని తనకు ధైర్యం చెప్పిన కేటీఆర్. సదురు గాయపడిన వ్యక్తి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి కేటీ రామారావును వేడుకున్నారు ఈ విషయమై మహేష్ కి ధైర్యం చెప్పి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు ఈ విషయమై. కేటీ రామారావు ప్రత్యేక చొరవ తీసుకొని మహేష్ నీ. ఇండియాకు తీసుకువచ్చి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అంగీకరిస్తూ సౌదీ లోని. కేటీఆర్ సంబంధించిన వ్యక్తులను పంపించి వారితో మాట్లాడి ఎలాగైనా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పంపించాలని అక్కడ వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా సౌదీలోని.ప్రభుత్వ ఆసుపత్రికి. హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ . యజమాన్యం లేఖ రాశారు. దీనిపై కేటీ రామారావు చెప్పినట్లుగానే సౌదీ నుంచి నేడు స్వదేశానికి చేరుకున్న మహేష్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మహేష్ ని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన స్థానిక నాయకులు. కెటి రామారావు చెప్పడంతో. మండలంలోని మాజీ ఎంపీపీ. భర్త. అయినా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజు.పాక్స్. చైర్మన్ బండి దేవదాస్. పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మహేష్ ను తీసుకువెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో. కేటీఆర్ ఆదేశాలతో ప్రత్యేక చొరవ తీసుకొని వైద్య సహాయ నిమిత్తం మెరుగైన వైద్యం చేయాలని. డాక్టర్ల బృందానికి కేటీ రామారావు ప్రత్యేకంగా తెలియజేశారు. మా కొడుకు. ప్రమాదవశావాస్తు గాయపడి. దిన పరిస్థితులు ఉన్న. మా వాడి పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇండియాకుతీసుకురావడానికి. కృషి చేసి. ప్రత్యేకంగా కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న మాజీ మంత్రి కేటీ రామారావుకి మా కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టును బెదిరింపులకు గురి చేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలి.

టీఎస్ జెయుఎన్.యూజేఐ నాయకులు డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

పత్రిక,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూ.జే.ఐ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్ లు డిమాండ్ చేశారు.గురువారం కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అధికారి కథనం రాసిన జర్నలిస్టును కార్యాలయం కు పిలిచి బెదిరింపులకు గురిచేడాన్ని టీఎస్ జేయూ(ఎన్ యూ జే ఐ)యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు.ప్రజా సమస్యలు వెలికితీయడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని అలాంటి సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే జర్నలిస్ట్ హక్కులు అణచివేసేలా ప్రవర్రస్తూ జర్నలిస్టులను బేధింపులకు గురిచేయడం హెయమైన చర్యగా పేర్కొన్నారు.జిల్లాలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా, జర్నలిస్టుల గౌరవం,హక్కులు కాపాడేలా సదరు అధికారి పై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో జర్నలిస్ట్ లంతా ఏకమై పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version