బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ .

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం.

ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు…

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.

ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు..

 

నేటి ధాత్రి

 

 

 

అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు .

ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి..

మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి..

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి..

ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు..

 

CM Revanth Reddy

 

 

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి..

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి..

శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి..

బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి…

అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి..

ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి…

 

CM Revanth Reddy

 

రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి..

ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి..

సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి.

ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి…

ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది..

 

CM Revanth Reddy

 

ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి..

రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి…

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి..

హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి..

ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి…

హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…

CM Revanth Reddy

 

అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి…

హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి…

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు

గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నిండు నూరేళ్ళు ప్రజా సేవలో, ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పనిచేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పోలసాని నరసింహా రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు మేకల రజిత, నాయకులు బైరాగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, బీఆర్ఎస్ యూత్ నాయకులు, ఆయా గ్రామాల గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు‌.

కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న BRS నాయకులు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు ఆపద వస్తే అండగా ఉండే నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 60 వ జన్మదిన వేడుకలు

*-కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తున్న బి ఆర్ఎస్ నాయకులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

పేదల పెన్నిధిగా..ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని..ఆపదొస్తే అండగా ఉండే భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ లు కేక్ కట్ చేసి, సీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన గండ్ర వెంకట రమణారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, అభివృద్ధి అంటేనే గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తుకు వచ్చేలా..భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సున్నితమైన మనసు కలిగిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో..నిండు నూరేళ్లు..ఆయురారోగ్యాలతో..అష్టైశ్వర్యాలతో..మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేసే యోగ్యం కల్పించాలని ఆ దేవున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ
అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన

కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు  పాల్గొన్నారు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

Gangula Manohar Reddy.

 

 

అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.

Gangula Manohar Reddy.

ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన. !

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా.

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో.బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రజల సంక్షేమం కోసం భూపాలపల్లి మాజీశాసనస భ్యులుగండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షు రాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా, ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతి రెడ్డి రామ్ శెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి లకు, ఉపాధ్యక్షులకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, యూ త్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం..

బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట నేటిధాత్రి :

 

మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి

ప్రజా సంఘాల డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు
వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభు త్వాన్ని కోరారుమావోయిస్టుల పేరుతో ఈ దేశము ఆదివా సీలను అడవి నుండి బయ టకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారని మండి పడ్డారు.గత ప్రభుత్వాలు ఆది వాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టా లను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావో యిస్టులో జాడ లేకుండా చేస్తా నని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని వారన్నారు.రాజ్యాంగ హక్కు లను పేద ప్రజలకు పూర్తిగా అందించిన ప్పుడు సామాజిక అసమా నతలు లేకుండా ప్రభు త్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండ దని అన్నారు.ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమా లను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వారు తెలిపారు
మావోయిస్టులను అణిచివే యాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ప్రజా సంక్షే మమే పరమపదిగా పనిచేసి నప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమా జంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారని, ప్రభుత్వా లు ప్రజా సంక్షేమానికి ఉప యోగపడే కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసి స్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతు న్నారని అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చిన ప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపి నట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరారు

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన( డిడియు-జి కే వై ) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వ ర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవి ష్యత్తులో ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకు న్నట్లు డిడియు- జీకే వైఅధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి,మారేపల్లి రవీందర్ చిందంరవి,దుబాసి కృష్ణమూర్తి భాస్కర్, మారేపల్లి రాజు, కట్టయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం పది వేల పెన్షన్ అమలు గురించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించాడని, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కు ముందడుగు పడడంతో శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చిత్ర పటానికి ఫలాభిషేకం చేశారు. చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు రిటైర్డ్ కార్మికులంతా గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడంతో ఎంపీగా ఎన్నికైన సందర్భంగా సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుమ్మరి మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్.

ఎన్నికల హామీల అమలుకోసం పోరాడాలి-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఎన్నికల హామీల అమలు కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రామడుగు గ్రామశాఖ మహాసభ జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అర్హులైన వారికీ ఇండ్లు ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాదుడులేరని వెంటనే స్తానిక ఎన్నికలు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే, ప్రజా ఉద్యమాలు తప్పవని సృజన్ కుమార్ హేచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, మండల నాయకులు కీర్తి కుమార్, దాము భూమయ్య, యోగి బీరయ్య, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్.
మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం పొనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరగాని రమేష్,బోరగాని మణికంఠ వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గతంలో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు.అయినా వారి ప్రవర్తనలో మార్పు జగగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పొనకల్ గ్రామ కమిటీ తీర్మానం చేయగా దానిని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయసినట్లు ఎర్రల్ల బాబు పేర్కొన్నారు.సస్పెండ్ ఐనా వారిద్దరికీ ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన.

కాంగ్రెస్ కు కావల్సింది మాత్రం ఓట్ల గణన

బిజెపి కుల గణన అంటే వెనుకబడిన వర్గాల అభివృద్ధి

గద్వాల /నేటి ధాత్రి

 

 

60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్రన్నారు. జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్‌గా నిలిచారన్నారన్నారు. ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు. శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, 6 దశాబ్దాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.

Abhinav Ambedkar.

 

 

దేశ జనగణనలో భాగంగా కులగణనను చేపట్టి, దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక – సామజిక – సంక్షేమ లాభాలు చేకూర్చాలని ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, జిల్లా ఓబీసి మోర్చా అధ్యక్షుడు జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఐటి సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,బిజెపి నాయకులు ఢిల్లీవాల కృష్ణ,మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు ,బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి,మోహన్ రెడ్డి, రమేష్,వెంకటేష్, నరసింహ తదితరులు ఉన్నారు.

ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు.

ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు

నిజాన్ని నమ్ముకున్న మహా నేత మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాథరాజు రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాహుల్ గాంధీ దేశంలో జోడో యాత్ర ద్వారా కార్మిక , కర్షక, సబ్బండ వర్గాల స్థితిగతులపై ఏం అంశం తీసుకున్న ఆ అంశం పట్ల హుటాహుటిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం..నాడు అధికారుల వంతైతే..
నేడు ప్రతిష్టాత్మకంగా జన గణన తో పాటు కులగణన అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోడీ అంతటి నేతనే ఒప్పించిన ఘనత ముమ్మాటికి రాహుల్ గాంధీకే సాధ్యమైంది.. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వచించడం చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా కులగల చేయడం శుభపరిణామమని బీసీలు ఇంకనైనా ఆర్థికంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని యావత్ దేశం హర్షించదగ్గ విషయం.. అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version