హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం..

నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గొల్లగూడెం గ్రామ ప్రజలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేందుకు కృషి చేస్తుందని , గొల్లగూడెం గ్రామపంచాయితీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామ పంచాయతీ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్ , సీఐ వెంకటేశ్వర్లు , ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , పోలబోయిన శ్రీవాణి ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహానుభావులలో ఒకరని, ఆయన జీవితంలోని గొప్ప త్యాగాలు, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు.

పాపన్న జీవితం మనకు ధైర్యం, నిబద్ధత, న్యాయ పోరాటం వంటి విలువలను నేర్పుతుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తించి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.

యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు, యువత, గ్రామస్తులు పాల్గొని, మహానుభావుని సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి..

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి

గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సొసైటీ ఆవరణలో మాదాసు రవి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు జయశంకర్ జిల్లా కేజీ కేఎస్ అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు మన పాపన్న గౌడ్ బహుజనుడు పూర్వంలో తురుష్క సైనికులు కల్లు మండవ లో పాపన్న స్నేహితుని కాలుతో తన్నబోయేది చూసి కోపంతో సైనికుల్ని మార్ కత్తితో మేడ నరికినాడు అప్పటి నుండి రాజ్యం లో విప్లవకారుడు అయ్యాడు పాపన్న పేరు జనగామ ప్రదేశములో మారుమోగింది యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు అతి తొందర్లోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చారు 1675 సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గౌడ సంగం జిల్లా నాయకులు ల్యాదళ్ల సమ్మయ్య గౌడ్ గుర్రం తిరుపతి గౌడ్ పాలకవర్గ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు మాజీ సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.

బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.

అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.

అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

BJP

 

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.

అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ MLA.

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన. కార్పొరేటర్, ఎమ్మెల్యే

మల్కాజిగిరి నేటిధాత్రి 02:

 

 

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లోని ఎంప్లాయీస్ కాలనీ నుంచి సాయికృష్ణ ఎన్‌క్లేవ్‌కి 2 ఏళ్ల క్రితం పెట్టిన బాక్స్‌ డ్రైన్‌ పనులకు అనుమతి రావడంతో, 6.2 కోట్లు ఎన్‌డీపీ కింద ఇవ్వాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన. స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

గతంలో ఎస్‌ఎన్డీపీ కింద 40 కోట్లతో యాప్రాల్‌లో పనులు పూర్తి చేసి యాప్రాల్‌కి వర్షాకాలంలో 20 సంవత్సరాల నుండి పెద్ద సమస్య పరిష్కరించడం జరిగింది

MLA

అలాగే ఈ పనులు కుడా పూర్తి అయిపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా వర్ష కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్థానిక కార్పొరేటర్ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, పరమేష్, శర్మ, సత్యనారాయణ, రాజి రెడ్డి, పర్వతాలు,శ్యామ్, అకారం సాయి, పవన్, నవీన్ గౌడ్, ఆల్బర్ట్, పంకజం, సుదర్శిని, షాలిని, ఎస్‌ఎన్డీపీ అధికారులు, కాలనీ సభ్యులు మరియు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్..

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ను సన్మానం చేసిన మిత్రులు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు న్యాయవాది కిరణ్ బాల్య మిత్రులు వై వెంకటేష్ మెడి కల్ ఏజెన్సీ నిర్వహికులు కె బి శ్రీనివాసులు శెట్టి పంపు కటకం చందు గట్టు రవి సాగర్ కొండూరు ప్రవీణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వై వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆకాంక్షించాలని  కోరారు

మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన మాజీ ZPTC.

మృతుల కుటుంబాలకు బియ్యం అందజేసిన మాజీ జడ్పిటిసి…

తంగళ్ళపల్లి నేటిధాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందంకి 50 కిలోల బియ్యం అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య సందర్భంగా మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని నా వంతు సహాయంగా అందజేశానని తెలియజేశారు అలాగే బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కనక లక్ష్మి లక్ష్మారెడ్డికి 2500 శ్రీనివాస్ రెడ్డికి 2500 చొప్పున నిరుపేద కుటుంబాలకు సహాయం అందజేశామని అంత్యక్రియలు చేసుకొని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం కింద 20 వేల రూపాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నె బాలయ్య మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ శ్రీనివాస్ గౌడ్ గుడిసెల తిరుపతి దేవయ్య రామ్ రెడ్డి చంద్రమౌళి సురేష్ మల్లయ్య బాబు కనకయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది.

బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది

కుల మత విద్వేషాలు రెచ్చగోడుతుంది

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన
జై బాపు జై భీమ్ జై సంవిదన్
అను కార్యక్రమం న్ని కొత్తగూడ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు..మండల కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య విచ్చేసి ముందుగా మండల కేంద్రం లోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహని కి పూలమాల వేసారు అనంతరం జెండా ఎగరేశారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న కార్యక్రమం లో భాగంగా ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధన్
కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు నేడు కొత్తగూడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారత రాజ్యాంగం నీకి అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తుందని రాజ్యాంగం ని నిర్లక్ష్యం చేస్తూ కులాల చిచ్చు మతాలరొచ్చు దేశం లో అలజడులు సృష్టి స్తుంది రాజ్యాంగం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని.. జై బాపు జై భీమ్ జై సంవిధన్ అని అన్నారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ఫా రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, యూత్ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మల్లెపూ రంజిత్, యూత్ మండల ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, వివిధ గ్రామా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకమని క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గల మధసూదన్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేద వారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి రాజేష్, మహిళా నాయకురాలు పుష్ప,నాయకులు పాల్గొన్నారు.

సామాన్యుడు సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు.

‘సామాన్యుడు.. సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు’

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని పద్మావతి కాలనీ లోని గ్రీన్ ఫీల్డ్ లో గల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తి తో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భావితరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

తంగళ్ళపల్లి  నేటిదాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో భాగంగా బద్దెనపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి చౌరస్తా నుండి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని.

ఏఐసీసీ టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించన అప్పటినుండి దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎస్టి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని .

దేశం గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని దేశం గురించి ప్రాణాలు అర్పించారని అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని అస్య హాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని.

రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పుడున్న.

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని.

 

ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల ను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మహిళ నాయకులు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి

వన్య ప్రాణులకు విద్యార్థులకు రక్షణ కరువు

బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్న వెంటనే హెచ్సీయూ భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేస్తున్నాం 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ కూతాటి రమేష్ బిఆర్ ఎస్ యూత్ జిల్లా నాయ కులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి బిఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికిల్ల వెంకట్ తట్ల సాయి ధైనంపల్లి రాజేష్ శశి మెండు నితిన్ తదితరులు పాల్గొన్నారు

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..

“నేటిధాత్రి” హనుమకొండ.
ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలి రావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,అభిమానులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలోని సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

We need to move to the silver jubilee ceremony.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..
– మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
– అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసింది.
– నేడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
– 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు బయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడంలేదు.
– స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలి.సమన్వయంతో ఉండాలి.
– కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలపాలి.
– పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతికార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.
– ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదు.
– ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..ప్రజలకు అండగా ఉంటాం.
– ఈ నెల 27న ఎల్కతుర్తి శివారులో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలి వెళ్దాము.
– రేపటి నుండి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాలలోకి వెళ్లి సమావేశాలు నిర్వహించాలి.
– ఏ గ్రామం నుండి ఎంతమంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో,కావాల్సిన వాహనాలు ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలి.

We need to move to the silver jubilee ceremony.

ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు,మండల అదేకాశులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…

సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….

HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు..
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…

దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు…
ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…

ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్

లక్నేపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నాటి నుండి నేటి వరకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన (రేషన్ బియ్యం) సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

Congress

 

తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం సన్న బియ్యం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, లక్నేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిలొని అశోక్, నర్సంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్,నర్సంపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జి రాజు, లక్నేపల్లి యూత్ అధ్యక్షుడు గొడిశాల సురేష్, మండలం యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సూదుల మహేందర్, చెన్నారావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు సిద్దేన రమేష్,తప్పేట రమేష్గ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, బైరి మురళి,మ్తెదం రాకేష్,కమతం వీరభద్రయ్య ,ఒర్రంకి వేణు ,కత్తి వేణు, కోల విజేందర్, కళ్ళం సంపత్ , గాదం రాజ్ కుమార్, నాన్న బోయిన రాజు, రాజులపాటి సూరయ్య ,కత్తి చిన్న కట్టయ్య, రాజులపాటిరాజు, మునిగాల రాజేందర్ ,సూత్రం కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version