ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.శనివారం మండలంలోని వెలిశాల లో జరిగిన బక్రీద్ వేడుకలలో సతీష్ గౌడ్.వెలిశాల మాజీ సర్పంచ్ ఎండి కమరుద్దీన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సౌబ్రాతుత్వంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అన్ని మతాలను గౌరవించే భారతదేశ సంస్కృతిలో బక్రీద్ పండుగ విశేష స్థానం కలిగి ఉందని అన్నారు.ఈ పండుగను ప్రతి ఏటా శాంతియుతంగా,స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని,హిందువులు సోదర భావంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ కులమత బేదలకు అతీతంగా భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.జిల్లా నాయకులు దొంతుల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాంపల్లి వీరేశం.మండల ప్రధాన కార్యదర్శి బండి రవీందర్.కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్

 

పరకాల నేటిధాత్రి

 

 

ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు మడికొండ.

సంపత్ కుమార్ జామా మజీద్ దగ్గర హాజరై మజీద్ ఇమామ్ అజీజ్ కి,మజీద్ కమిటీ అధ్యక్షులు గౌస్ ఉద్దీన్,పెద్దలు మసూద్ అలీకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రవక్తల అచంచలమైన దైవభక్తి,త్యాగానిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరిని ఆ అల్లా చల్లగా చూడాలని అల్లాను వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో బజరుద్దీన్, అఫ్జల్,అజ్గర్ అలీ,ఎస్కే మోయిన్,పాషా,షబ్బీర్ అలీ, ఇస్సాక్ అలీ,సాజిద్,జావేద్, అలీ,ఉస్మాన్,మదర్, బియాభాని,రహీం,ఇక్పాల్, అజీమ్,హబీబ్,ముస్లిం పెద్దలు,యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పవిత్ర రంజాన్ పండుగని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని ఈద్గాలో పార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకుని వారు మాట్లాడుతూ నెలరోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ,ఆధ్యాత్మిక చింతన,దాతృత్వం,ప్రేమ,దయ,సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి అన్నారు.ఈకార్యక్రమంలో టిజిఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ గారు,మైనార్టీ సోదరులు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర,జిల్లా,అసెంబ్లీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version