ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి.

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి

గుండెపుడి, రాంపురం పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాసం.

మరిపెడ నేటిధాత్రి:

విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్య క్రమాన్ని 2025 – 26 విద్యా సంవత్సరానికి ఈ నెల జూన్ 6 – 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్, గుండెపుడి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామ చేతుల మీదుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు, పేద మధ్య తరగతి పిల్లలకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు,సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించరు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు,అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ, ఉపాధ్యాయులు నివేదిత, దోమల లింగన్న గౌడ్,మురళి, సునీత,మాధవి, రాంపురం పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి గణేష్, గ్రామ పెద్దలు, బందు పరశురాములు, బందు వీరన్న, ఎడ్ల ఉపేందర్, ఆశా వర్కర్లు బందు మంజుల, మమత, చింతపల్లి ఉమా,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version