సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల..

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఆదివారం సీతారా ముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కల్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి అడ్వకేట్ లెక్కల జలం ధర్ రెడ్డి బుధవారంఆవిష్కరిం చినారు.ఆదివారం ఉదయం 10:30 గంటలకు తలంబ్రాల ను తీసుకురావడం 11 గంటలకు కంది శ్రీనివాస్ రెడ్డి చే ధార్మిక ఉపన్యాసం మధ్యాహ్నం 12.05 నిమిషా లకు సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణ అనంతరం లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగల రని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నీల సమ్మిరెడ్డి నీల రంగారెడ్డి గిద్దమారి సురేష్ కోమటి గణేష్ గొట్టిముక్కుల సుమన్ బత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న.

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ జహీరాబాద్ పట్టణంలో బుధవారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,జై బాపు జై భీం జై సంవిధాన్ జహీరాబాద్ ఇంచార్జ్ ధనలక్ష్మి. ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా మరియు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండలాల నాయకులు మరియు మాజీ యం.పి.పిలు,మహిళా కాంగ్రెస్ నాయకులు,మాజీ జెడ్పీటీసీ లు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం.!

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం ! !

• హజ్రత్ ముల్తానీ బాబా దర్గా

• పాలరాతిలో ధగధగ మెరుస్తున్న

ముల్తానీ బాబా దర్గా పరిసరాలు

కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను

దర్శించుకొని ప్రత్యేక ప్రార్ధనలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మెటలకుంట చౌరస్తా సమీపంలోని జహీరాబాద్- బీదర్ ప్రధాన రోడ్డుపై అద్భు తంగా నిర్మించిన ముల్తానీ బాబా దర్గ

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో అద్భుతంగా కట్టిన తాజ మహాల్ మాదిరిగానే సంగా రెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మెటలకుంట గ్రామ చౌరస్తా సమీపంలోని ముల్తానీబాబా దర్గాను అదే తరహాలో తీర్చిదిద్దారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీ రాబాద్-బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో నిర్మించిన హజ్రత్ ముల్తానీబాబా దర్గాను చూపరులకు ఎంతగానో ఆకట్టుకుం టుంది. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహన చోదకులు తాజ్మహాల్ మాదిరిగా ఉన్న ముల్లానీ బాబా దర్గా వద్ద కాసేపు ఆగి దూడాల్సిందే. అద్బు తంగా నిర్మించిన దర్గా పరిసరాలో ప్రజలు, వాహనచోదకులు తిరుగుతూ సెల్ఫీలతో కాలక్షేపం చేస్తుంటారు. దశాబ్దానికి పైగానే తాజమహల్ తరహాలో ముల్తానీ బాబా దర్గాను రెండు న్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దర్గా పరిసరాలను గోడలను కట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప జిల్లాల నుంచి సున్నపు రాయిని తెప్పించి బట్టి ల్లో కాల్చి ప్రత్యేక
రాయితో నూర్పిడి చేసి వినియోగించారు. దర్గాతో పరిసరాల్లో గోడల నిర్మాణంలో ఎక్కడ సిమెంట్, ఇసుక వారకపోవడం గమన్నారం, జైపూర్ నుంచి ప్రత్యేక పాలరాతిని తెప్పించి దర్గాను దగదగ మెరిసేలా అద్భుతంగా తీర్చిద్దారు. జహీరాబా ద్-బీదర్ ప్రధాన రోడ్డు రహదారిపై ఉన్న ముఖ ద్వారంతో పాటు దర్గా చుట్టూ గుమ్మటం వంటి ఆకారంలో నిర్మించిన గదులు దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వినియోగిస్తుంటారు. ప్రతి నెల ఇక్కడ జరిగే వేడుకలకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు వచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్శించుకుంటారు. దర్గాకు నాలుగువైపులా నాలుగు ద్వారాలతో నిర్మించిన అపురూప కట్టడం పక్కనే 150 అడుగుల ఎత్తులో నిర్మించిన ఏక్ మినార్ భారీ స్తూపం చూప రులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏరిఏమైనప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోని తాజీమహాత్ను చూసేందుకు వెళ్ల కపోయిన ముల్లా నీ బాబా దర్గాను చూసిన వారంత తాజ్మ హాల్ను దూశామనే ఫిలింగ్తో ప్రజలు, వాహనచోదకులు సెల్సీలను దిగుతూ వెళ్లిపోతున్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బజార్ సిద్ధ గౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్,బాల గౌడ్,బజార్ కొండగౌడ్, రంజిత్ గౌడ్,వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్,చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పేకాట రాయుళ్ల అరెస్ట్..

పేకాట రాయుళ్ల అరెస్ట్.

42,780 రూపాయలతో పాటు నాలుగు సెల్లు ఫోన్లు స్వాధీనం

నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అలంకానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు పేకాటరాయిడ్లను అరెస్టు చేసినట్టు నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలంలోని అలంకాని పేట గ్రామంలో ఆర్చి పక్కన నిత్యం పేకాట నిర్వహిస్తున్నట్టుగా పక్క సమాచారంతో నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట ఆడుతున్న స్థలానికి చేరుకొని అక్కడ పేకాట ఆడుతున్న మంగిశెట్టి శ్రీను, మాస్ కుమార స్వామి, ఎడ్ల లక్ష్మీనారాయణ, గాజుల జనార్ధన్ నలుగురి వ్యక్తులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 42,780 రూపాయలతో పాటు 52 పేక ముక్కలు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..

“నేటిధాత్రి” హనుమకొండ.
ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలి రావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,అభిమానులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలోని సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

We need to move to the silver jubilee ceremony.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..
– మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
– అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసింది.
– నేడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
– 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు బయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడంలేదు.
– స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలి.సమన్వయంతో ఉండాలి.
– కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలపాలి.
– పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతికార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.
– ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదు.
– ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..ప్రజలకు అండగా ఉంటాం.
– ఈ నెల 27న ఎల్కతుర్తి శివారులో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలి వెళ్దాము.
– రేపటి నుండి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాలలోకి వెళ్లి సమావేశాలు నిర్వహించాలి.
– ఏ గ్రామం నుండి ఎంతమంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో,కావాల్సిన వాహనాలు ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలి.

We need to move to the silver jubilee ceremony.

ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు,మండల అదేకాశులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…

సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….

HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు..
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…

దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు…
ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…

ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్

లక్నేపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నాటి నుండి నేటి వరకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన (రేషన్ బియ్యం) సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

Congress

 

తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం సన్న బియ్యం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, లక్నేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిలొని అశోక్, నర్సంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్,నర్సంపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జి రాజు, లక్నేపల్లి యూత్ అధ్యక్షుడు గొడిశాల సురేష్, మండలం యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సూదుల మహేందర్, చెన్నారావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు సిద్దేన రమేష్,తప్పేట రమేష్గ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, బైరి మురళి,మ్తెదం రాకేష్,కమతం వీరభద్రయ్య ,ఒర్రంకి వేణు ,కత్తి వేణు, కోల విజేందర్, కళ్ళం సంపత్ , గాదం రాజ్ కుమార్, నాన్న బోయిన రాజు, రాజులపాటి సూరయ్య ,కత్తి చిన్న కట్టయ్య, రాజులపాటిరాజు, మునిగాల రాజేందర్ ,సూత్రం కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తిరుమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి అధ్యక్షతన..
ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . తిరుమలాపురం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ,పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళలకు నిరుద్యోగులకు ,రైతులకు ,కూలీలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్ రేవంత్ రెడ్డి
కి దక్కింది , అలాగేభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* గెలిచి 15 నెలలు గడిచిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడు.. రోజుకు 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు….. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి పేదలను అదుకునే దిశగా కృషి చేస్తున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి గ్రామ సీనియర్ నాయకులు గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, బొంపల్లి కిషన్ ,కంచర్ల కిట్టయ్య, కొర్రి రాజు ఎళగొండ శ్రీకాంత్, కలవేణి ప్రవీణ్,చెన్న నిశాంత్, నాగిరెడ్డి శంకర్, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, గద్దల తిరుపతి, నీలేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన.!

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఏనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గోగ్గెలా లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం

గంగారం, నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు

గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.

SI Kashinath Yadav

ఈకార్యక్రమంలో డిఎస్పీ రాంమోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఎస్పీ పరితోష్ పంకజ్ కు రికార్డులను వివరించారు.ఒకే రోజు మూడు పోలీసు స్టేషన్ లను సందర్శించి ఎస్పీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జహిరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ రూరల్,కోహీర్ పోలీస్ స్టేషన్ లను సూడిగాలి పర్యాటనతో సందర్శించి, రికార్డు లనుతనిఖీ చేశారు.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం

జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషమైనదని ఇది పేద ప్రజలకు పెద్దవరం అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు. దొడ్డుబియ్యం తినలేని ఆబియ్యాన్ని ఎనిమిది రూపాయల కిలో చొప్పున పక్కదారి పడుతున్నాయని గమనించిన ప్రజా ప్రభుత్వం రైతుల వద్ద నుండి సన్న ధాన్యాన్ని కొని క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రజానీకానికి సన్న బియ్యం ఇవ్వడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాలను గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభాకర్ ప్రజలను కోరారు.

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత.

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని రేకంపెల్లి బాధిత కుటుంబానికి రూ.54 వేల 500 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిది పథకం చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు,దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు సారధ్యంలో దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు ఆధ్వర్యంలో రేకంపల్లి గ్రామానికి చెందిన మంద పాల్సన్ రూ.54500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాదారపు కన్నయ్య, పొన్నం జనార్దన్, ప్రతాప్, రవి, కోటి, ప్రశాంత్, చిరంజీవి, మలాల్ రావు,సుమంత్, రవి, రాజేందర్, బిక్షపతి, కిట్టి రవి, కుమారస్వామి, భగవాన్, రమల్లయ్య,రజినీకాంత్, విజయ్, సునీల్,బిక్షపతి,ప్రవీణ్, రగు అనిల్,మాహబ్, చిన్న జనార్ధన్, రాజేష్,కుమారస్వామి, పవన్, సాంబయ్య, రాజిరెడ్డి,అశోక్, నాగులు, రాజకుమార్,చంటి, భాస్కర్, కోర్నెల్, విజయ్,శరత్ తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ డిమాండ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బొమ్మ సురేందర్ గౌడ్ అధ్యక్షత వహించగా సమావేశానికి విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి హాజరవడం జరిగింది
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతి పైన ఏడుగురు యువకులు అత్యాచారం చేయడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఇందులో భాగంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ ది హత్యగా మేము అనుమానిస్తున్నా ము వెంటనే ఆయన యొక్క పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతంగా ప్రజల ముందు పెట్టాలి లేదంటే స్త్రీల పైన జరిగే మానభంగాలు రాష్ట్రంలో జరిగే అటువంటి హత్యలు కు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసిందిగా కోరుచున్నాము రాబోవు రోజులలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పొన్నం బిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకారం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన MLA వివేక్.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనారోగ్యంతో హైదరాబాదులోని బ్రీనోవా ట్రాన్స్లేషన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాస్పటల్ వెళ్లి నల్లాల ఓదెలు నీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని చేకూర్చారు.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్.

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నదని
టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని 23 వ వార్డులో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వార్డు ఇంచార్జ్ మాదాసి రవి కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, 16వ వార్డ్ ఇంచార్జ్ భాణాల శ్రీనివాస్ బైరగొని రవి, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, కోమటి సరోజన, సంగెపు తేజ, పెద్దపెల్లి కేదారి, వేముల జంపయ్య, సృజన, ప్రభుదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

21,22 వ వార్డులలో సన్నబియ్యం పంపిణీ..

Congress

 

ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్

నర్సంపేట పట్టణంలోని 21, 22,వ డివిజన్లో 8 నెంబర్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా భాగస్వాములై చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, బాణాల శ్రీనివాసు, దండెం రతన్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, పట్టా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి పటేల్, 22వ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి వాజిద్, స్వచ్ఛంద సంస్థల నాయకులు బెజ్జంకి ప్రభాకర్, డీలర్ శశిరేఖ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్..

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్

@. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం

@ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమని పలు గ్రామాలలో ని రేషన్ షాప్ ల వద్ద రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈరోజు నెక్కొండలో మండల వ్యాప్తంగా నెక్కొండ, దిక్షకుంట, చంద్రుగొండ, అలంకానిపేట, అప్పలరావుపేట, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ కార్యక్రమంలో నెక్కొండ తాసిల్దార్ రాజకుమార్, డిప్యూటీ తాసిల్దార్ పల్ల కొండ రవి కుమార్, నెక్కొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, ఈదునూరి సాయి కృష్ణ, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగర్ ప్రశాంత్, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను, పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు, రేషన్ వినియోగదారులు, ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version