రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Real Estate Chief Revanth Reddy..

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…

సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….

HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు..
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…

దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు…
ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…

ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!