సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

భద్రాద్రి శ్రీ సీతారాములు కళ్యాణ తలంబ్రాలు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, సీతా రాముల భక్తులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ఆర్టీసి డిపో వద్ద తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ సీతా రాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూడలేకపోయినా భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ , దేవాదాయశాఖ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర శుభాకార్యలకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్లుగా చేసిన డిపో ఉద్యోగులు కార్గో మార్కెటింగ్ ఎగ్సిగీటివ్ నరేందర్,రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఎడిసి నారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్జ్ ఆఫీస్ స్టాఫ్ వెంకటరెడ్డి శ్రీను,కిషోర్, ఎస్డిఐ వెంకటేశ్వర్లు, బాబు, డిపో ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల..

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఆదివారం సీతారా ముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కల్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి అడ్వకేట్ లెక్కల జలం ధర్ రెడ్డి బుధవారంఆవిష్కరిం చినారు.ఆదివారం ఉదయం 10:30 గంటలకు తలంబ్రాల ను తీసుకురావడం 11 గంటలకు కంది శ్రీనివాస్ రెడ్డి చే ధార్మిక ఉపన్యాసం మధ్యాహ్నం 12.05 నిమిషా లకు సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణ అనంతరం లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగల రని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నీల సమ్మిరెడ్డి నీల రంగారెడ్డి గిద్దమారి సురేష్ కోమటి గణేష్ గొట్టిముక్కుల సుమన్ బత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version