పేకాట రాయుళ్ల అరెస్ట్.
42,780 రూపాయలతో పాటు నాలుగు సెల్లు ఫోన్లు స్వాధీనం
నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని అలంకానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు పేకాటరాయిడ్లను అరెస్టు చేసినట్టు నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలంలోని అలంకాని పేట గ్రామంలో ఆర్చి పక్కన నిత్యం పేకాట నిర్వహిస్తున్నట్టుగా పక్క సమాచారంతో నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట ఆడుతున్న స్థలానికి చేరుకొని అక్కడ పేకాట ఆడుతున్న మంగిశెట్టి శ్రీను, మాస్ కుమార స్వామి, ఎడ్ల లక్ష్మీనారాయణ, గాజుల జనార్ధన్ నలుగురి వ్యక్తులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 42,780 రూపాయలతో పాటు 52 పేక ముక్కలు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.