అలరించే వంతెన.

అలరించే వంతెన…

 

కనుచూపుమేర పచ్చందనం… అక్కడే రెండు సుందరమైన కొండలు… వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం… దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన…

భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్‌. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను అనుమతించారు. చైనీస్‌ రుయి (అదృష్టానికి ప్రతీక) చిహ్నం ప్రేరణతో దీనిని నిర్మించారు. ఇది భూమి నుంచి 140 మీటర్లు(460 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 100 మీటర్లు(330 అడుగులు). ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల మంది సందర్శించడం విశేషం. స్థానికులు ఈ వంతెనను ‘బెండింగ్‌ బ్రిడ్జ్‌’ అని పిలుస్తారు.

మెట్లూ ఉన్నాయి…

కళ్లు చెదిరే ఈ బ్రిడ్జ్‌ చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇదొక గాజు వంతెన. వంతెన నిర్మాణాల్లో విశేష అనుభవమున్న హీయున్‌చాంగ్‌ అనే ఇంజనీర్‌ దీనికి రూపకల్పన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. ఇంకోచోట కలిపినట్లుగా ఉంటుంది. దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు వంతెనపై నడుస్తున్నంతసేపూ గాల్లో తేలుతున్నట్లు, మేఘాలు హాయ్‌ చెప్పుతున్నట్లు అనుభూతి చెందుతారట.

 

బండి కుమారస్వామి బాధితుడు మృతి.

బండి కుమారస్వామి బాధితుడు మృతి

బయటకు వస్తున్న బండి బాధితులు.

నేటిధాత్రి, వరంగల్

 

 

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ కు పెరుగుతున్న బండి బాధితుల సంఖ్య..

నాలుగు రోజుల క్రితం జరిగిన పెట్రోల్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మృతి.

బండి మీద పీడీ యాక్ట్ నమోదు చేయండి. దళిత సంఘాల డిమాండ్..

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పెరుగుతున్న పిర్యాదుల సంఖ్య.

గతంలో ఏకంగా బండి కుమారస్వామి పేరిట బాధితుల సంఘం ఏర్పాటు..

ఒకే వ్యక్తిపై మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో 30 కి పైగా కేసులు?

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి “బండి” పయనం..

 

Bandi Kumaraswamy

 

భూ కబ్జాదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..

న్యాయం చేయాలి

భూ కబ్జాదారుల( బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజీ యాజమాన్యం) ఆగడాలకు బలైపోయిన నిరుపేద దళితుడు పోలేపాక కుమారస్వామి వారి కుటుంబానికి న్యాయం చేయాలి.

మాదాసి సురేష్
ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ హనుమకొండ!

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు.

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు.

ముందుగా మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం సుభాష్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ అద్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం ఎంతోమందిని పాశవికంగా హత్య చేస్తున్నదని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు దేశంలోని సహజ వనరులను కట్టబెట్టేందుకు, అడవులను వారికి అప్పగించేందుకు మావోయిస్టులను లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఒకవైపున మావోయిస్టులు తాము చర్చలకు సిద్దం అని ప్రకటించినా, లొంగిపోతున్నా వారిని చంపడమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామని చెప్పడం ఫ్యూడల్, ఫాసిజం, హంతకుల మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు..

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలకు జరపాలని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మరోవైపు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను వారికి దారాధత్తం చేస్తున్నదని విమర్శించారు.

కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు వంతపాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయల రాయితీ కల్పించి పేదల పై మాత్రం పెనుభారాలు మోపుతున్నారని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ప్రధాని మోడీ పావుగా మారాడాని, అమెరికాలో మన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మోడీ మాట్లాడడం లేదని అన్నారు.

గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రజలు మళ్లీ కాంగ్రెస్ అధికారం ఇచ్చారని అన్నారు.

కాలేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని, కాలేశ్వరం వల్ల ఉమ్మడి వరంగల్ భూపాలపల్లి జిల్లాలకు ఒక్క ఎకరానికి నీరు అందలేదని అన్నారు.

ఎప్పటికైనా ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని, భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగరేద్దాం
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పై ఎర్రజెండాను ఎగరవేద్దామని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.

చట్టసభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

నూతన కమిటీ నిర్ణయాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానించారు.

మీరు చేయబోయే ప్రతి పోరాటం లో రాష్ట్ర, జిల్లా పార్టీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

ఈ మహా సభల్లో సిపిఐ కౌన్సిల్ సభ్యులు గురుజపెల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, మాతంగి రామ్ చందర్, కొరిమి సుగుణ, మాజీ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ తో పాటు 250 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.

సరికొత్త అధ్యాయం.

సరికొత్త అధ్యాయం…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న జట్టు దక్షిణాఫ్రికా.

చోకర్స్‌ (కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టు)గా ముద్ర వేసుకొన్న సఫారీలు ఇప్పుడు చాంపియన్లుగా నిలిచారు.

దిగ్గజాల వల్ల కానిది..: ఏబీ డివిల్లీర్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, గ్యారీ కిర్‌స్టెన్‌, అలెన్‌ డొనాల్డ్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టు కోసం ఎంతో శ్రమించారు. వీరందరి కృషితో జట్టు మెరుగుపడినా..

ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే అయింది. ఎట్టకేలకు మార్‌క్రమ్‌, బవుమా అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఓటములను దిగమింగుకొని నాకౌట్స్‌లో నిరాశ.. సఫారీలకు 1992 నుంచి వెంటాడుతోంది. ఆ వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో వరుణుడి రూపంలో షాక్‌ తగిలింది.

1999 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో సెమీస్‌ మ్యాచ్‌ టై కావడం అనేది ఎప్పటికీ గుండెల్లో ముల్లులాంటిదే. గతేడాది జూన్‌ 29న జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఏడాది తిరిగే సరికి ‘జూన్‌ 14’ను సువర్ణాక్షరాలతో లఖించదగ్గ రోజుగా మార్చుకొంది.

కెరీర్‌ చివర్లో ఉన్న రబాడ.. ఫైనల్‌ మ్యాచ్‌లో కంగారూల పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్‌ క్రమ్‌.. భారీ శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తితో సౌతాఫ్రికా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

తొలినాటి కూరగాయ దొండ…

తొలినాటి కూరగాయ దొండ…

 

తొంటి అంటే తొలినాటిదని అది తొండి కాయ’గా కన్నడంలోనూ దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది.

దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

ఘృతపాకేన కరోతి రోచనమ్‌

తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

జీర్ణకోశాన్ని శుభ్రపరచటం, తల్లి పాలు పెరిగేలా చేయటం, రక్తహీనత, జ్వరాలు, క్షయ వంటి వ్యాధుల్లో పోషకం ఇది. దీనిలోని కుకుర్బిటాసిన్‌ మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధిస్తున్నారు.

లేత దొండకాయల్ని నిలువు చీలి కలుగా కోసి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో మరిగించి ఆ నీటిని పిండేయాలని నలుడు ‘పాక దర్పణం’లో చెప్పాడు. ఉప్పు వేసి పిసికి నీరు పిండటం కూడా చెయ్యదగిందే! ఈ జాగ్రత్త తీసుకోకుండాదొండ ముక్కల్ని నేరుగా కూర,పప్పు పచ్చడి వగైరా చేస్తే తల తిరుగుడు లాంటి సమస్యలు కలుగుతాయి.

ఇగురుకూర: ఒక చెంచాడు నేతిలో ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు జీలకర్రవగైరా తాలింపు గింజలు వేగించి, నీరుపిండిన ముక్కలి అందులో కలిపి మిరియాలపొడి వేసి మగ్గనిస్తే అదే కమ్మని దొండ ఇగురుకూర! పొయ్యి మీంచి దించాక రవ్వంతపచ్చకర్పూరం కలిపితే పరిమళ భరితంగా ఉంటుందన్నాడు నలుడు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది!

మజ్జిగ పులుసు: ‘‘బింబీఫలం సకలమేవఘృతే నిధాన…’’ దొండకాయల్ని నాలుగు పక్షాలుగా చీల్చి నీరుపిండి, కొద్దిగా నెయ్యి వేసి వేగనిచ్చి ఉప్పు, మిరియాలపొడి వేసి, కాయలు మునిగే దాకా చిక్కని మజ్జిగ పోసి ఉడికించాలి.

ఈ మజ్జిగపులుసు జాఠరాగ్నిని పెంచుతుందని క్షేమ కుతూహలం గ్రంథం పేర్కొంది.

ముద్ద కూర: లావుగా పెద్దవిగా ఉండే దొండకాయల్ని నిలువుగా మధ్యకు కోసి, ఇంగువ+ఉప్పు కలిపిన పొడిని ఒక్కో ముక్కకూబాగా పట్టించాలి.తర్వాతభాండీలో తాలింపుగింజలు వేగించిన నూనెలో వేసి నీళ్ళమూత పెట్టి ప్రలేహ విధిలో ముద్దగా అయ్యేలా మగ్గించాలి!

 

పెరుగుపచ్చడి: అంగారభర్జితం అంటేనిప్పులు లేదా మంటమీద కాల్చిన దొండకాయల్ని పైన మాడు వలిచి, నెయ్యి, ఉప్పు వేసి పిసికి పెరుగులో కలిపి ఇంగువ తాలింపు పెట్టి కొత్తిమీర వగైరాలతో అలంకరించిన పెరుగు పచ్చడి జీర్ణకోశవ్యాధులన్నింటికీ మంచిది!

ఆవ పెరుగుపచ్చడి: దొండకాయని నిలువుగా మూడుపక్షాలుగా చీల్చి, నీరు పిండి పెరుగులో వేసి ఉప్పు, నల్ల ఆవాల పిండి కలిపిన ఆవ పెరుగుపచ్చడి కృష్ణదేవరాయలు అన్నట్టు ముకుమందు… అంటే జలుబునీళ్లువదిలిస్తుంది!

దొండకాయ పప్పు: నీరుపిండేసిన ముక్కల్ని పెసరపప్పుతో, ధనియాలు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పొడిని కలిపి వండిన పప్పు పోషక విలువలు కలిగి ఉంటుంది.

దొండకాయని చింతపండుతోనూ, అల్లం వెల్లుల్లితోనూ వండే విధానాలను పాకశాస్త్ర గ్రంథాలేవీ చెప్పలేదు. కఫాన్ని తగ్గిస్తుంది. ముక్కులోంచి రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికుంది. అందుకని, వేడి చేసే వాటితో దీన్ని కలిపి వండటాన్ని శాస్త్రం ఒప్పుకోలేదు.

దొండ కాయ ఉబ్బరాన్ని కలిగిస్తుంది! అందుకని శనగ పిండి వేసి పకోడీ కూరల్లాంటివి కూడా నిషేధం! ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధుల్ని తగ్గిస్తుంది. వాటిని పెంచే అజీర్తికర పదార్థాలతో వండకపోవటమే మంచిది.

దొండకాయలో దోషాలకు విరుగుడుగా దోసకాయ, కాకరకాయ పనిచేస్తాయి. దొండని వండినప్పుడు కాకర లేదా దోస కూడా తప్పకుండా వండుకోండి!

ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: శాండ్విచ్‌ బ్రెడ్‌లు-ఆరు, ఉల్లి ముక్కలు (పెద్దవి)- మూడు కప్పులు, బటర్‌-మూడు స్పూన్లు, గోధుమ పిండి- రెండు స్పూన్లు, బిర్యానీ ఆకు-ఒకటి, ఆపిల్‌ సెడార్‌ వెనిగర్‌-స్పూను, ఉడికించిన కూరగాయలతో నీళ్లు-మూడున్నర కప్పులు, వెల్లుల్లి ముక్కలు-అర స్పూను, మిరియాల పొడి – పావు స్పూను, చీజ్‌-ఆరు స్పూన్లు, కొత్తిమీర తరుగు-స్పూను.

 

తయారుచేసే విధానం: వెడల్పాటి పాన్‌లో కాస్త బటర్‌ వేయాలి. అది కరుగుతుంటే ఉల్లి ముక్కలను చేర్చాలి. ఉల్లి బంగారు రంగులోకి మారాక ఆపిల్‌ సెడార్‌ను వేసి, గోధుమ పిండి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి కలపాలి.

ఉప్పు, మిరియాల పొడితో పాటు కూరగాయల నీళ్లని ఇందులో పోసి, మూతపెట్టాలి. మంటని తగ్గించి, మధ్యలో కలుపుతూ 30 నిమిషాల పాటు ఉడికించాలి.

బ్రెడ్‌ చివర్లు కత్తిరించి, పెనంపై కాస్త బటర్‌ వేసి ఒక్కో ముక్కను అటూ ఇటూ దోరగా కాల్చాలి లేదా ఓవెన్‌లో టోస్ట్‌ చేయాలి. బౌల్‌లలో సూప్‌ వేసి పైన బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. పైన ఛీజ్‌ తురుమును, కొత్తిమీర తరుగును చల్లితే సరి.

తవా పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు – పదహారు, ఉల్లి, టమాటా ముక్కలు- కప్పు, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – స్పూను, పెరుగు – పావు కప్పు, పసుపు- అర స్పూను, కారం- రెండు స్పూన్లు, జీలకర్ర పొడి – అర స్పూను, ధనియాల పొడి – అర స్పూను, గరం మసాలా – అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: గిన్నెలో పావు కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, స్పూను కారం, పావు కప్పు గరం మసాలా, కాస్త జీలకర్ర పొడి, అర స్పూను ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసి అంతా బాగా కలపాలి.

ఇందులోనే పనీర్‌ ముక్కలనీ వేసి, బాగా కలిపి అరగంట పాటు మూత మూసి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించి, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జతచేయాలి.

ఉల్లి రంగు మారగానే, మంట తగ్గించి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర చేర్చాలి. నిమిషం తరవాత టమాటా ముక్కలూ వేయాలి. కాస్త దగ్గరకి వచ్చాక క్యాప్సికం ముక్కలూ చేర్చాలి. క్యాప్సికం కరకరలాడుతుంటే నానబెట్టిన పనీర్‌ను కలపాలి.

అరకప్పు నీళ్లు, అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత మూత తీసి గరం మసాలా, మిగతా కొత్తిమీర వేసి అంతా కలిపితే తవా పనీర్‌ సిద్ధం.

గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.

గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.. ఈమె పరిస్థితి చివరకు..

 

 

 

ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది.

అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ..

గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు.

ఆఖరికి పల్లెటూరిలో చదువు రాని వారు కూడా రీల్స్ చేయడం దినచర్యగా చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో కొందరు చుట్టూ ఏం జరుగుతుందో..

అన్న కనీస స్పృహ కూడా లేకుండా రీల్స్ చేస్తుంటారు.

ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.

ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఓ మహిళ డాన్స్ చేస్తుండడం చూసి గుర్రానికి చిర్రెత్తుకొస్తుంది.

చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది.
ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది.
అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..
ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ..
గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది.

‘ప్రశాంతంగా మేత మేస్తుంటే.. నీ డాన్స్ గోల ఏంటహే’.. అన్నట్లుగా కోపంగా ఆమె వద్దకు వెళ్లి .. వెనక్కు తిరిగి మరీ (Horse kicked the woman) కాలితో ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు ఆమె దూరంగా పడిపోతుంది. వామ్మో ఇక బుద్ధి ఉంటే గుర్రాల ముందు డాన్స్ చేయొద్దు.. బాబోయ్.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ తయారీదారులంటే ఈ గుర్రానికి పడదనుకుంటా’.. అంటూ కొందరు, ‘నా ఏరియాలోకి వచ్చి ఏంటీ నీ రీల్స్ గోల.. అనేది గుర్రం ఇన్నర్ ఫీలింగ్’… అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వాముతో కలిగే లాభాలు ఏమిటి.

వాముతో కలిగే లాభాలు ఏమిటి…

కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము లేదా ఓమ గింజలను వివిధ మసా లాలలో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ గింజలలో ఉండే థైమాల్‌, కార్‌ వాకరల్‌ అనే పదార్థాల వల్ల వాముకు సాల్మొనెల్లా, ఈ కొలై వంటి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి.

వాము లేదా ఓమ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయా?
మంజులత, కర్నూల్‌

కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము లేదా ఓమ గింజలను వివిధ మసా లాలలో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ గింజలలో ఉండే థైమాల్‌, కార్‌ వాకరల్‌ అనే పదార్థాల వల్ల వాముకు సాల్మొనెల్లా, ఈ కొలై వంటి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి. కాబట్టి వాము ఫుడ్‌ పాయిజనింగ్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడమే కాక కడుపులో అల్సర్ల వల్ల వచ్చే నొప్పి తీవ్రతను వాము తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా ఉండే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడానికి కూడా వాము ఉపయోగపడుతుంది. వాము తరచూ తీసుకోవడం వల్ల బీపీ, అధిక కొలెస్ట్రాల్‌ మొదలైన సమస్యలకు మూలమైన దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించవచ్చు. అయితే ఇన్ని ఔషధ గుణాలున్న వామును ఔషధం లాగానే తగిన మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి.

 

వానాకాలం అంటేనే పిల్లలకు జలుబు, జ్వరాలు వచ్చే కాలమని భయమేస్తుంది. ఈ కాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఏ ఆహారం ఇవ్వాలి?

స్పందన విజయవాడ

 

వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి . వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి. అందుకే వర్షాలు మొదలవగానే పిల్లల్లో జలుబు, జ్వరాలు వచ్చేస్తాయి. రకరకాల వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులవల్ల ఈ అనారోగ్యాలు వస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు వీటినుంచి రక్షణ పొందవచ్చు. రోగనిరోధక శక్తికి పోషకపదార్థాలు కొన్ని అత్యవసరం. నిమ్మ, నారింజ, ఆపిల్‌, జామ లాంటి తాజా పండ్లన్నింటి లోనూ అధికంగా ఉండే విటమిన్‌ సి; బాదం, పిస్తా, ఆక్రోట్‌, పొద్దు తిరుగుడు గింజల లాంటి వాటిలో ఉండే విటమిన్‌ ఈ; అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, సెనగల్లో ఉండే విటమిన్‌ బీ 6; క్యారెట్‌, బొప్పాయి, గుమ్మడి మొదలైన వాటిల్లో ఉండే విటమిన్‌ ఏ; ఆకుకూరల్లో, పప్పు ధాన్యాల్లో ఉండే ఫోలేట్‌; సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్‌ డీ; మాంసాహారం, ఆకుకూరల నుంచి వచ్చే ఐరన్‌; పెరుగు, మజ్జిగ నుంచి వచ్చే ప్రోబయాటిక్స్‌ ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తికి ఎంతో అవసరం. ఈ మినరల్స్‌, విటమిన్స్‌ను మాత్రల రూపంలో కాకుండా ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి ఉపయోగం ఎక్కువ. అలాగే ఆహారంతో పాటు శుచి, శుభ్రతపాటిస్తే జలుబులు, జ్వరాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఈ మధ్య మా చిన్నాన్నకు గుండె ఆపరేషన్‌ చేసి స్టెంట్‌ వేశారు. గుండె ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 శశి, ఆదిలాబాద్‌

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, జీవన శైలి ఎంతో ముఖ్యం. ఆహారంలో సాచ్యు రేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె మానెయ్యడం మంచిది. రెడ్‌ మీట్‌ కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌, చేప లాంటివి తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ అందులో మరెన్నో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నందున వారానికి 4-5 మించకుండా గుడ్లు (పచ్చ సొనతో సహా) తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటే రక్తనాళాల్లో ప్లాక్‌ చేరుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి. బరువు ఎక్కువ ఉన్నవారు కొంత తగ్గాలి కూడా. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచి కొవ్వులు ఉండే బాదం, ఆక్రోట్‌, అవిసెగింజల వంటి వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలవాటు లేని వ్యాయామాలు అకస్మాత్తుగా ఎక్కువగా చేయడం కంటి వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం ముఖ్యం. మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు ధ్యానం లాంటివి ఉత్తమం.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు

 

 

 

 

బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ…

దుబాయ్‌: బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటే మైదానంలో ఉన్నప్పుడే బంతిని పైకి విసిరి.. లైన్‌ దాటి తిరిగి లోనికి వచ్చే అందుకోవాల్సి ఉంటుంది. అంటే బౌండరీ బయట బంతిని పలుమార్లు ఎగర వేయడం కుదరదు. ఈనెల నుంచే కొత్త రూల్‌ ఐసీసీ ప్లేయింగ్‌ కండిషన్‌లో భాగం కానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఎంసీసీ రూల్‌ ఆఫ్‌ లాలో అధికారికంగా చేరుస్తారు. మరోవైపు వన్డేల్లో రెండు కొత్తబంతుల నిబంధనల్లో మార్పు, కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రొటోకాల్‌ను ఐసీసీ ఆమోదించింది.

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ..

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ.. జాన్ సీనాకు ఇక దబిడిదిబిడే!

 

 

 

 

17 ఏళ్లుగా రాయల్ రంబుల్‌కు దూరంగా ఉన్న ఓ రాక్షసుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అతడు గానీ వస్తే చాంపియన్ జాన్ సీనాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ గెలవాలనేది ప్రతి రెజ్లర్ కల. ఈ ఒక్క ట్రోఫీ గెలిస్తే వాళ్ల కెరీరే మారిపోతుంది. రాయల్ రంబుల్‌లో గెలిచిన రెజ్లర్లకు రసల్ మేనియాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కుతుంది. అక్కడ కూడా నెగ్గితే డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో వాళ్లు ఎప్పటికీ నిలిచిపోతారు. అందుకే ప్రతి రెజ్లర్ రాయల్ రంబుల్ మీదే దృష్టి పెడతాడు. అయితే ఈ పోరులో నెగ్గడం అంత ఈజీ కాదు. యంగ్ రెజ్లర్లు, స్టార్లతో పాటు ఒకప్పుడు అందర్నీ వణికించిన మాజీలు కూడా పోటీలో నిలుస్తారు. వచ్చే రాయల్ రంబుల్ కోసం అలాంటి ఓ రాక్షసుడే రాబోతున్నాడు. అతడే స్నిట్‌స్కీ.

39వ రాయల్ రాయల్ రంబుల్‌కు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వచ్చే రాయల్ రంబుల్‌లో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్నిట్‌స్కీ పాల్గొనబోతున్నాడు. 2008 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న ఈ వెటరన్ రెజ్లర్.. రాయల్ రంబుల్‌లో గెలవాలనే కసితో కనిపిస్తున్నాడు. తాను ఇంకా రిటైర్ కాలేదని అంటున్నాడీ 55 ఏళ్ల స్టార్. స్నిట్‌స్కీతో జాన్ సీనాకు దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సీనాతో పాటు బటిస్టా, సీఎం పంక్ లాంటి చాంపియన్ రెజ్లర్లకు అతడు టఫ్ ఫైట్ ఇచ్చాడని.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆడితే అదిరిపోతుందని చెబుతున్నారు.

 

స్నిట్‌స్కీకి అంత సీన్ లేదని.. క్రేజ్ కోసమే అతడు రీఎంట్రీ ఇస్తున్నాడని మరికొందరు నెటిజన్స్ చెబుతున్నారు. ఈసారి పప్పులు ఉడకవని, అతడో సాధారణ రెజ్లర్ అని చెబుతున్నారు. కాగా, 2025 డిసెంబర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెబుతున్నట్లు ఇప్పటికే జాన్ సీనా ప్రకటించాడు. ఆ లెక్కన అతడు వచ్చే రాయల్ రంబుల్‌లో ఆడకపోవచ్చు. కానీ ఒకవేళ ఆడితే మాత్రం స్నిట్‌స్కీతో పాటు ఇతర రెజ్లర్లకు చుక్కలేనని సీనా అభిమానులు చెబుతున్నారు.

కల్తీ ఇంధనమే కూల్చిందా…

కల్తీ ఇంధనమే కూల్చిందా?

 

 

 

 

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.

  • తప్పు ఎక్కడ జరిగిందని వైమానిక నిపుణుల విశ్లేషణలు

న్యూఢిల్లీ/చెన్నై, జూన్‌ 14: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ సాలిగ్రామ్‌ జే మురళీధర్‌ తాజాగా ఓ వార్తా సంస్థ తో మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్షి ఢీకొంటే రెండు ఇంజన్లు ఒకేసారి విఫలంకావడానికి అవకాశం ఉందన్న వాదనను తోసిపుచ్చారు. ‘పక్షి ఢీకొంటే విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగి నిప్పురవ్వలు, పొగ వస్తాయి. రెండు ఇంజన్లను పక్షులు ఒకేసారి ఢీకొనే అవకాశం ఉండదు. విమాన ప్రమాదానికి ఇంధన కల్తీనే ప్రధాన కారణంకావచ్చు. ఇంధనం కల్తీ అయితే రెండు ఇంజన్లపైనా ఒకే ప్రభావం పడుతుంది. దీనివల్ల వేగం తగ్గిపోయి విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభించదు. 35టన్నుల కంటే అధికంగా ఇంధనం ఉన్నందున విమానం కూలిపోయిన క్షణాల్లోనే భారీ విస్ఫోటనంతో అగ్నిగోళం ఏర్పడింది’ అని మురళీధర్‌ వివరించారు. ఈ ఘోరానికి గల కారణాలపై నిపుణుల నుంచి సీనియర్‌ పైలట్ల వరకూ విభిన్న ఊహాగానాలు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం విమాన ప్రమాదానికి కారణాలు ఇవీ..

ఒక ఇంజన్‌ వైఫల్యం, ల్యాండింగ్‌ గేర్‌ మూసుకోకపోవడం..

విమానం టేకాఫ్‌ అయిన వెంటనే పక్షులు ఢీకొనడం లేదా అంతర్గత సమస్యలతో ఒక ఇంజన్‌ విఫలమై ఉంటుంది. బోయింగ్‌లోని అత్యాధునిక శ్రేణి విమానాల్లో రెండు శక్తిమంతమైన ఇంజన్లు ఉంటాయి. వీటిలో ఒకటి విఫలమైనా రెండోదాని సాయంతో విమానం పైకి ఎగురుతుంది. విమానం టేకాఫ్‌ అయ్యాక ల్యాండింగ్‌ గేర్‌ మూసుకుంటే విమానం పైకి ఎగరడానికి సాయపడే ఏరోడైనమిక్‌ ప్రవాహం ఏర్పడుతుంది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న సమయాల్లో పైలట్లు ల్యాండింగ్‌ గేర్‌ను పైకి ఎత్తడం మర్చిపోయే అవకాశమూ ఉంది. ఒక ఇంజన్‌ విఫలం కావడానికి తోడు గేర్‌ను కిందకు వదిలేయడం వల్ల విమానం ఎత్తుకు ఎగిరే సామర్థ్యం కోల్పోతుంది. భూమికి 300-400 అడుగుల ఎత్తున ఇలాంటి పరిస్థితి ఎదురైతే దాని నుంచి బయటపడటానికి పైలట్‌కు ఎక్కువ సమయం లభించదు.

రెండు ఇంజన్లు విఫలం కావడం..

ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. పక్షులు ఢీకొనడం, ఇంధనం కల్తీతోపాటు సాధారణ తనిఖీల్లో గుర్తించని యాంత్రిక లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తడాన్ని తోసిపుచ్చలేం. ఈ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ను ఎత్తడానికి, గాలి వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన థ్రస్ట్‌ (ఎగరడానికి అవసరమైన వేగం) ఉండదు. ఈ కారణంగా విమానం క్షణాల్లోనే వేగాన్ని కోల్పోవడంతో పాటు అది ఎగురుతున్న ఎత్తు నుంచి శరవేగంగా కింద కు పడిపోవడం ప్రారంభమవుతుంది.

ఫ్లాప్‌ కాన్ఫిగరేషన్‌లో సమస్య..

సురక్షితమైన ఎత్తుకు చేరే వరకూ రెండు ఫ్లాప్‌లు (రెక్కల వెనుక భాగం) విచ్చుకొని ఉంటేనే విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఒకవేళ వీటిని ముం దుగానే మూసేస్తే ఆ శక్తి కూడా గణనీయంగా తగ్గిపోతుం ది. ప్రమాదం జరిగిన సమయంలో అహ్మదాబాద్‌లో గాలి సాంద్రత తక్కువగా ఉంది. విమానం గేర్‌ తెరుచుకొని ఉం డగానే ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. దీంతో పైకెగరడానికి కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది.

సెన్సార్లలో లోపాలు..

ఆధునిక విమానాలన్నీ ఆటోమేటెడ్‌ వ్యవస్థలపై ఆధారపడినవే. గాలి వేగాన్ని, యాంగిల్‌ ఆఫ్‌ అటాక్‌ను గుర్తించే సెన్సార్లు విమాన కంప్యూటర్‌కు తప్పుడు డేటాను ఇస్తే ఆటో-థ్రోటిల్‌ వ్యవస్థ ఇంజన్‌ శక్తిని ముందుగానే తగ్గించే ప్రమాదం ఉంది. ఇటువంటి తప్పుడు హెచ్చరికల కారణంగా విమానం ఎగిరే ఎత్తు తగ్గిపోతుంది. అలాగే గాలివేగాన్ని కొలిచే పిటాట్‌ ట్యూబ్‌ మూసుకోపోవడం, విమాన నియంత్రణ వ్యవస్థ విఫలంకావడం వల్ల విమానం వేగం, ఎగురుతున్న కోణం విషయంలో పైలట్లు పొరబడే అవకాశం ఉంటుంది. కాగా బ్లాక్‌బాక్స్‌ డేటాను విశ్లేషించాక పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

‘బోయింగ్‌’ నివేదికను వెంటనే విడుదల చేయాలి..

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 787 విమానాలకు సంబంధించిన నిర్మాణ లోపాలపై నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రజావేగు సలే్‌హపూర్‌ తరపు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు లేఖ రాశారు. ‘బోయింగ్‌ 787, 777 విమానాల్లో తీవ్రమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని బోయింగ్‌ క్వాలిటీ ఇంజనీర్‌ అయిన సలే్‌హపూర్‌ 2024 ప్రారంభంలో ఆరోపించారు. దీనిపై 2024 మార్చిలో దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌ఏఏ ఉన్నతాధికారులు.. అదే ఏడాది డిసెంబరులో విచారణ పూర్తయిందని సమాచారం ఇచ్చారు. తమ దర్యాప్తునకు సంబంధించిన నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ నివేదిక వెలుగు చూడలేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఆ నివేదికను విడుదల చేయాలని కోరారు. దీనిపై ఎఫ్‌ఏఏ స్పందించాల్సి ఉంది.

పహల్గామ్ ఉగ్ర దాడి. రెండు నెలల తర్వాత..

పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..

 

 

 

 

 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే..

Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రవాద దాడి యావత్ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కేవలం పురుషులే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఉన్మాదంతో ఎంతో మంది మహిళలు తమ పసుపు కుంకుమ లకు దూరమయ్యారు.

అయితే, ఈ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసి ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టింది.

ఇదిలాఉంటే..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది.
పహల్గామ్, చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి.
అక్కడికి వెళ్లాలంటనే ప్రజలు అమ్మో..
అంటూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.
అక్కడి తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా బంద్ చేశారు.
అయితే, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా..
ఇంకా అక్కడి పర్యాటక ప్రాంతాలను తెరవలేదు.
ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
జమ్మూలోని మతపరమైన యాత్రలపై కూడా ప్రభావం చూపింది.
తాజాగా, ఈ విషయంపై జమ్మూ & కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మూసివున్న పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరచుకోనున్నాయని ఆయన ట్వీట్ చేశారు. భద్రతా పరంగా తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా తాత్కాలికంగా మూసిన జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను జూన్ 17 నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ, పార్కులు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గామ్‌లో క్యాబినెట్ సమావేశానికి హాజరై, బేతాబ్ వ్యాలీ వంటి మూసివున్న ప్రాంతాలను సందర్శించారు.

ఆడ‌దాని ప్రేమ‌ను.చెప్ప‌డానికి ఏమున్నాయ్‌..

ఆడ‌దాని ప్రేమ‌ను.. చెప్ప‌డానికి ఏమున్నాయ్‌.. ‘8 వసంతాలు’ ట్రైల‌ర్‌ అదిరింది

 

 

 

 

 

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’

రెండేండ్ల క్రితం ‘మ్యాడ్’ (MAD) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈఅ మూవీ జూన్‌20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ ఏప‌థ్యంలో ఇప్ప‌టికే మేక‌ర్స్‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు ఒక దానిని మించి మ‌రోటి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు మ‌రో వారం మాత్ర‌మే ఉండ‌డంతో తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రేమ చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయి త‌రుపు ప్రేమ‌ను తెలిపే చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈకోవ‌లోనే హీరోయన్‌తో చెప్పించిన డైలాగులు మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. మాములుగా మ‌గాడి ప్రేమ‌కు సాక్ష్యాలుగా పాల‌రాతి సౌధాలు, భాగ్య‌ న‌గ‌రాలు ఉన్నాయి గానీ ఆడ‌దాని ప్రేమ‌కు ఏముంది మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అనే హృద్య‌మైన ప‌దాల‌తో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య…

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం Air India flight accident)లో మృతుల సంఖ్య పెరిగింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 279కి చేరింది. గాయపడినవారు (Victims) సివిల్ హాస్పిటల్‌ (Civil Hospital)లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
డీఎన్ఏ పరీక్షలు..

మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆదివారం విమాన ప్రమాద ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అధికారులు అప్పగిస్తున్నారు. కాగా చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా వారు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.

ఉన్నతస్థాయి కమిటి…

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.

 

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

కన్నుల పండుగగా గద్దర్‌ అవార్డుల వేడుక.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చలనచిత్రాలకు, ఉత్తమ నటీనటులు, దర్శక నిర్మాతలకు సైతం ఈ పురస్కారాలను అందించారు.

14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది ఈ కార్యక్రమానికి యావత్‌ చిత్ర పరిశ్రమ కదిలొచ్చింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎ్‌ఫడీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు, ఎండీ ఎస్‌. హరీష్‌ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రెడ్‌కార్పెట్‌పై సినీ ప్రముఖులు సందడి చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే అవార్డ్స్‌ ఫంక్షన్‌కు సంబంధించిన సావనీర్‌ను వారిద్దరూ ఆవిష్కరించారు.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ మెమెంటోనూ రూపొదించిన రమావత్‌ నాగుల నాయక్‌ను, జ్యూరీ చైర్మన్‌ మురళీమోహన్‌, చైర్‌పర్సన్‌ జయసుధ, సభ్యులు కే దశరథ్‌, డీవీకేరాజు, ఊహ తదితరులను జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్‌. తమన్‌, ఎం.ఎం కీరవాణి, గాయకులు రామ్‌ మిరియాల, మంగ్లీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

గద్దర్‌ను గుర్తు చేసుకుంటూ మంగ్లీ ‘పొడుస్తున్న పొద్దుమీద, బండెనక బండికట్టి’ పాటలు ఆలపించారు. పాతతరం కథానాయికలు జయప్రద, జయసుధ, సుహాసిని, ఒకేఫ్రేమ్‌లో కనిపించి అలరించారు.

భీమ్స్‌ సిసిరోలియో తల్లితో పాటు కలసి పురస్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో ఆయన తల్లిని ముద్దాడిన దృశ్యం మనసుకు హత్తుకుంది. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్‌ విభాగం ప్రధానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పురస్కారాలను అందజేశారు. తర్వాత రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తొలిపురస్కారాన్ని ‘రజాకార్‌’ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా గూడురు నారాయణరెడ్డి, దర్శకుడు యాట సత్యనారాయణకు అందజేశారు.

ఉత్తమ ప్రజాధరణ చిత్రం కేటగిరిలో ‘ఆయ్‌’ చిత్రానికి గాను బన్నీ వాసు తరపున అల్లు అరవింద్‌ పురస్కారం అందుకున్నారు.

శుభ పరిణామం

14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇవ్వడం సంతోషకరం.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఈ రోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. 

సినిమా టికెట్‌లు

దిల్‌రాజు

నా కుటుంబం తరపున ధన్యవాదాలు

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుతోంది. గద్దరన్న తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన పేరును చిరస్ఙాయిగా నిలబెట్టేలా ఈ అవార్డ్‌లు ఇవ్వడం గొప్ప విషయం. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ ఇవ్వడం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత తిరిగి ఎన్టీఆర్‌ అవార్డ్‌ను ఇస్తున్నందుకు నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డ్‌కు తొలి గ్రహీతగా ఎంపికవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు రేవంత్‌ అన్న ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అని చెప్పారు.

నా బాధ్యతను పెంచింది

సినిమా పరిశ్రమను ఒకతాటిపైకి తెచ్చి గద్దరన్న పేరుతో అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. కాంతారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డ్‌ను స్వీకరిస్తున్న తొలి నటుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. రేవంత్‌రెడ్డి గారికి ధన్యవాదాలు.

విజయ్‌ దేవరకొండ

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

సినిమా టికెట్‌లు

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు.

మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు

 

 

 

 

మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌గోబిన్‌(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత..

రూ. 3.2 కోట్ల మోసం కేసులో ఏడేళ్లు శిక్ష ఖరారు చేసిన డర్బన్‌ కోర్టు

డర్బన్‌(సౌత్‌ ఆఫ్రికా), జూన్‌ 14: మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌గోబిన్‌(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత… వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను 3.22 కోట్లకు మోసం చేశారు. నేరం రుజువుకావడంతో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ, అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది. తనకు తాను ఆహింసావాదిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునే లత రామ్‌గోబిన్‌ను, వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ 2015లో కలిశారు.

ఆయన వస్త్ర, పాదరక్షల వ్యాపారి. ఇతర వ్యాపారవేత్తలకు అవసరమైన నిధులు సమకూరుస్తూ లాభంలో వాటా తీసుకుంటారు. ‘దక్షిణాఫ్రికాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి గ్రూప్‌నకు అవసరమైన ‘లైనిన్‌’ ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నా. కస్టమ్స్‌, దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత పెట్టుబడి లేదు. మీరు సమకూరిస్తే లాభంలో వాటా ఇస్తాను’ అంటూ లత.. మహరాజ్‌తో నమ్మబలికారు. మహరాజ్‌ పెట్టుబడి సమకూర్చారు. కొద్ది కాలానికే ఆమె మోసం చేసిందని తెలుసుకున్న ఆయన పోలీస్‌ కేసు పెట్టారు. అసలు ఆమె భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోలేదని నిర్ధారణ అయింది.

 గూస్ బంప్స్‌ తెప్పించేలా ‘యముడు’ పాట.

 గూస్ బంప్స్‌ తెప్పించేలా ‘యముడు’ పాట…

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక.  శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు.  భవానీ రాకేష్ అందించిన బాణీ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌ కానుంది.

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే…

 

రెండేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. విక్ట‌రీ వెంక‌టేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి క‌ర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్, ర‌జ‌త్ క‌పూర్ (Rajat Kapoor) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్ (Karan Anshuman) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీకి వ‌చ్చిన ఈ సిరీస్ గ‌త సీజ‌న్‌ను మ‌రిపించిందా లేక నిరాశ‌ ప‌ర్చిందా అనేది ఇక్క‌డ చూద్దాం.

 

అయితే మ‌రోవైపు రానాకు ద‌గ్గ‌రైన ఓ పొలిటీషియ‌న్ రానాకు వ్య‌తిరేఖంగా ర‌వూఫ్‌కు సాయం చేసి జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి అత‌ని సాయంతో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని చూస్తుంటాడు. కానీ ర‌వూఫ్ ఆ పొలిటీషియ‌న్‌ను కాద‌ని తానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఫ్లాన్లు చేస్తుంటాడు. ఇక నాగా నాయుడు సైతం ఓ గ్యాంగ్ లేడీకి డ‌బ్బులు బాకీ ప‌డడం, రానా అన్న‌, త‌మ్ముళ్లు ప్రేమ‌లో ప‌డ‌డం వారు డ‌బ్బు సంపాదించి ఈ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఇబ్బందుల్లో ప‌డ‌తారు. మ‌రోవైపు విరాజ్ ఒబెరాయ్ ఓ త‌ప్పు చేసి ఓ పోలీస్ సాయంతో రానాను అందులో ఇరికిస్తాడు. వెర‌సి మూడు, నాలుగు గ్రూపులు, అందులో వారి సొంత వ్య‌వ‌హారాలు, వారు ప‌న్నే కుట్ర‌ల నేప‌థ్యంలో రానా అడ్ ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, అందులో నుంచి ఏవిధంగా బ‌య‌ట ప‌డ్డార‌నే ఈ రానా నాయుడు సిరీస్‌ సీజ‌న్‌2 కథ‌. క‌థ‌గా చెప్పుకోవ‌డానికి ఇది రెగ్యుల‌ర్ రివేంజ్‌, యాక్ష‌న్ డ్రామానే అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ త‌ర‌హా గ్రూపులు, ఒక‌రిని మించి మ‌రొక‌రు, ఒక‌రిపై ఒక‌రు కుట్ర‌ల నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌ను తెర‌కెక్కించిన‌ట‌లు అర్థ‌మ‌వుతుంది.

 

అయితే మొద‌టి భాగంలో ఉన్న‌ట్లు హింస‌, అశ్లీల స‌న్నివేశాలు, అస‌భ్య ప‌దాల వాడ‌కం 80 శాతం త‌గ్గించి పూర్తిగా రానా అయ‌న ప్యామిలీ, వారి సొంత వ్యవ‌హారాల‌ చుట్టూనే న‌డిపించారు. కాగా వెంక‌టేశ్ పాత్ర మాత్రం తీసిక‌ట్టుగా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ క్యారెక్ట‌ర్‌కు వెంక‌టేశ్ అవ‌స‌రమే లేదు వేరే ఎవ‌రితోనైనా చేయించొచ్చు అనే అంతగా ఆయ‌న‌ పాత్ర చిత్ర‌ణ ఉంది. ఓ క‌మెడియ‌న్ త‌ర‌హాలో, అప్పుడ‌ప్పుడు రావ‌డం, ర‌స్టిక్‌గా డైలాగులు చెప్ప‌డం ఆపై మాయం కావ‌డం, చివ‌ర‌లో రానాకు చివ‌రి నిమిషంలో హైల్ప్ చేసే క్యారెక్ట‌ర్‌కే ఆయ‌న పాత్ర ప‌రిమిత‌మైంది. పూర్తిగా రానా నేప‌థ్యంలో ఉండడం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. మొత్తంగా గ‌త సీజ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డంతో ఈ సీజ‌న్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అన్ని వెబ్ సీరిస్‌ల లాగానే ఇందులోనూ అక్ర‌మ సంబంధ సీన్లు న‌డిపించారు. గ‌త సీజ‌న్ ఇష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఈ సీజ‌న్ అంత‌గా న‌చ్చ‌క పోయిన ఒక‌మారు చూసేయ‌వ‌చ్చు. ఫ్యామిలీస్ అక్క‌డ‌క్క‌డ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం…

ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌..

తొలిసారి ఆర్థిక మూలాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌

బుషెహర్‌, సౌత్‌పార్స్‌ చమురు క్షేత్రాలపై దాడి

ఇరాన్‌ చుట్టూ 78 ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు

150 టార్గెట్లపై దాడులు 78 మంది మృతి

ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల దుర్మరణం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడిలో ముగ్గురి మృతి

టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, జూన్‌ 14:
ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌.
సాయంత్రం తొలిసారి ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషెహర్‌ చమురు క్షేత్రాలు (ఇక్కడే అణు విద్యుత్తు కేంద్రం ఉంది), సౌత్‌ పార్స్‌ న్యాచురల్‌ గ్యాస్‌ క్షేత్రాలపై దాడులు చేసింది.
ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ తస్నీమ్‌ న్యూస్‌ పేర్కొంది.
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
ఐక్య రాజ్య సమితి(ఐరాస) అణు విభాగం చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ కూడా ఓ ప్రకటన ద్వారా ఇరాన్‌లోని నటాంజ్‌(షాహిద్‌ అహ్మదీ రోషన్‌) అణు కేంద్రం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.
ఇరాన్‌ మొత్తం తమ టార్గెట్‌లో ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించగా..
ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక సైంటిస్టులు, 16 మంది మిలటరీ జనరళ్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వెల్లడించింది.
వీరిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ఇరానియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మహమ్మద్‌ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ చీఫ్‌ గులామ్‌ అలీ రషీద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గులామ్‌-అల్‌-మర్హాబ్‌, ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) కమాండర్‌ హుస్సేన్‌ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ కమాండర్‌ ఆమిర్‌ అలీ హాజీజాదే,డ్రోన్ల విభాగం కమాండర్‌ తాహెర్‌ పుర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండర్‌ దావూద్‌ షిహ్యాన్‌, క్షిపణి విభాగం కమాండర్‌ మహమ్మద్‌ బఘేరీ ఉన్నారు.
దీంతో ఇరాన్‌ త్రివిధ దళాలు పెద్దదిక్కులను కోల్పోయినట్లయింది.
ఆర్మీ కమాండర్‌ ఆమిర్‌ మౌసావీ, ఐఆర్‌జీసీ గ్రౌండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ ఖ్వానీ, ఐఆర్‌జీసీ నేవీ కమాండర్‌ అలీరెజా తంగ్సీరి మాత్రమే ఇరాన్‌ సెక్యూరిటీ చైన్‌లో సజీవ కమాండర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శనివారం సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ.
మరో 90 నిమిషాల్లో ఇరాన్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 90వ నిమిషం నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక దళం క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడడం గమనార్హం..! 150 టార్గెట్లను ఛేదించామని పేర్కొంటూ.
అందుకు సంబంధించిన ఫుటేజీని ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో విడుదల చేసింది. శుక్ర, శనివారాల్లో జరిపిన దాడుల్లో చనిపోయిన ఇరాన్‌ శాస్త్రవేత్తల వివరాలను ప్రకటించింది.
ఆ జాబితాలో న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఫ్రెదోన్‌ అబ్బాసీ, అహ్మద్‌ రజా దరియానీ, ఫిజిక్స్‌ నిపుణులు మహమ్మద్‌ మెహ్దీ తెహ్రాన్షీ, ఆమిర్‌ హసన్‌ ఫఖీ, అబ్దుల్లామిద్‌ మినుష్షర్‌, మన్సూర్‌ అస్ఘరీ, మెకానిక్స్‌ నిపుణుడు అలీ బౌఖాయ్‌ ఖత్రిమీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీ ఉన్నట్లు తెలిపింది.
ఇరాన్‌ మీడియా కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో ఇరాన్‌లోని ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడం.

ఆయన ముఖ్య సలహాదారు సహా, ఆర్మీ అధికారులు చనిపోవడంతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘వైనెట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇందులో ఓ విమానం ట్రాకింగ్‌ మధ్యలో కనుమరుగైందని, అందులో ఖమేనీలాంటి ప్రముఖ వ్యక్తి ఉండి ఉంటాడని పేర్కొంది.

రష్యా-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్‌ జెట్లలో దేశాన్ని వీడుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ దాడుల పట్ల ఇరాన్‌లోనే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ప్రతీ 47 ఏళ్లకు ఇరాన్‌కు స్వాతంత్య్రం వస్తుందనుకుంటా. ఇప్పుడు కూడా సుప్రీంలీడర్‌ పాలన నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తున్నా’’ అంటూ ఓయువతి పేర్కొంది.

ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరం:

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులను షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) తీవ్రంగా ఖండించింది. అయితే.. ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఎస్‌ఈఏ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ భారత్‌ పాల్గొనలేదని వివరించింది.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఇరు దేశాలను కోరుతున్నట్లు తెలిపింది.

కాగా… పాలస్తీనాలో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని బయట తిరగొద్దని సూచించింది.

ఇక అమెరికాతో చర్చలు అర్థరహితం:

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణుచర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరగ్చి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య ఆదివారం ఒమన్‌లో అణు చర్చలు జరగాల్సి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 ఇదే విషయాన్ని ఆయన ఐరోపా సమాఖ్య రాయబారి ఖాజా కల్లా్‌సకు తెలిపానని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా:

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కుమారుడు అవ్నర్‌ నెతన్యాహు వివాహం వాయిదా పడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు కుటుంబం ప్రకటించింది.

అవ్నర్‌ పెళ్లి సోమవారం అమిత్‌ యార్డెనీతో జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

ఇజ్రాయెల్‌లో ముగ్గురి మృతి:

శుక్రవారం రాత్రి ఇరాన్‌ జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి దాడుల్లో టెల్‌అవీవ్‌ శివార్లలోని రామత్‌గన్‌లో కోహెన్‌ ఏంజెల్‌(87), రిషోన్‌యెజిలోన్‌లో ఇజ్రాయెల్‌ అలోనీ(67), ఎట్టీ అనే మహిళలు చనిపోయారని, ఏడుగురు సైనికులు సహా 80 మందికి గాయాలైనట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

క్షతగాత్రుల్లో 34 మంది పారామెడికల్‌ బృందాలకు చెందినవారని తెలిపింది.

టెల్‌అవీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం బెన్‌ గురియన్‌ వద్ద పేలుడు సంభవించినట్లు ఇరాన్‌ వార్తాసంస్థలు చెబుతుండగా.

యుద్ధం ప్రారంభానికి ముందు నుంచి ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిషేధించామని ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఇరాన్‌ దాడుల్లో రామత్‌గన్‌, రిషోన్‌యెజిలోన్‌ నగరాల్లో నివాస గృహాలు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే.. పౌరులను ముందుగానే బంకర్లకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఐడీఎఫ్‌ చెబుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version