రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే…

 

రెండేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. విక్ట‌రీ వెంక‌టేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి క‌ర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్, ర‌జ‌త్ క‌పూర్ (Rajat Kapoor) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్ (Karan Anshuman) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీకి వ‌చ్చిన ఈ సిరీస్ గ‌త సీజ‌న్‌ను మ‌రిపించిందా లేక నిరాశ‌ ప‌ర్చిందా అనేది ఇక్క‌డ చూద్దాం.

 

అయితే మ‌రోవైపు రానాకు ద‌గ్గ‌రైన ఓ పొలిటీషియ‌న్ రానాకు వ్య‌తిరేఖంగా ర‌వూఫ్‌కు సాయం చేసి జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి అత‌ని సాయంతో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని చూస్తుంటాడు. కానీ ర‌వూఫ్ ఆ పొలిటీషియ‌న్‌ను కాద‌ని తానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఫ్లాన్లు చేస్తుంటాడు. ఇక నాగా నాయుడు సైతం ఓ గ్యాంగ్ లేడీకి డ‌బ్బులు బాకీ ప‌డడం, రానా అన్న‌, త‌మ్ముళ్లు ప్రేమ‌లో ప‌డ‌డం వారు డ‌బ్బు సంపాదించి ఈ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఇబ్బందుల్లో ప‌డ‌తారు. మ‌రోవైపు విరాజ్ ఒబెరాయ్ ఓ త‌ప్పు చేసి ఓ పోలీస్ సాయంతో రానాను అందులో ఇరికిస్తాడు. వెర‌సి మూడు, నాలుగు గ్రూపులు, అందులో వారి సొంత వ్య‌వ‌హారాలు, వారు ప‌న్నే కుట్ర‌ల నేప‌థ్యంలో రానా అడ్ ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, అందులో నుంచి ఏవిధంగా బ‌య‌ట ప‌డ్డార‌నే ఈ రానా నాయుడు సిరీస్‌ సీజ‌న్‌2 కథ‌. క‌థ‌గా చెప్పుకోవ‌డానికి ఇది రెగ్యుల‌ర్ రివేంజ్‌, యాక్ష‌న్ డ్రామానే అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ త‌ర‌హా గ్రూపులు, ఒక‌రిని మించి మ‌రొక‌రు, ఒక‌రిపై ఒక‌రు కుట్ర‌ల నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌ను తెర‌కెక్కించిన‌ట‌లు అర్థ‌మ‌వుతుంది.

 

అయితే మొద‌టి భాగంలో ఉన్న‌ట్లు హింస‌, అశ్లీల స‌న్నివేశాలు, అస‌భ్య ప‌దాల వాడ‌కం 80 శాతం త‌గ్గించి పూర్తిగా రానా అయ‌న ప్యామిలీ, వారి సొంత వ్యవ‌హారాల‌ చుట్టూనే న‌డిపించారు. కాగా వెంక‌టేశ్ పాత్ర మాత్రం తీసిక‌ట్టుగా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ క్యారెక్ట‌ర్‌కు వెంక‌టేశ్ అవ‌స‌రమే లేదు వేరే ఎవ‌రితోనైనా చేయించొచ్చు అనే అంతగా ఆయ‌న‌ పాత్ర చిత్ర‌ణ ఉంది. ఓ క‌మెడియ‌న్ త‌ర‌హాలో, అప్పుడ‌ప్పుడు రావ‌డం, ర‌స్టిక్‌గా డైలాగులు చెప్ప‌డం ఆపై మాయం కావ‌డం, చివ‌ర‌లో రానాకు చివ‌రి నిమిషంలో హైల్ప్ చేసే క్యారెక్ట‌ర్‌కే ఆయ‌న పాత్ర ప‌రిమిత‌మైంది. పూర్తిగా రానా నేప‌థ్యంలో ఉండడం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. మొత్తంగా గ‌త సీజ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డంతో ఈ సీజ‌న్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అన్ని వెబ్ సీరిస్‌ల లాగానే ఇందులోనూ అక్ర‌మ సంబంధ సీన్లు న‌డిపించారు. గ‌త సీజ‌న్ ఇష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఈ సీజ‌న్ అంత‌గా న‌చ్చ‌క పోయిన ఒక‌మారు చూసేయ‌వ‌చ్చు. ఫ్యామిలీస్ అక్క‌డ‌క్క‌డ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబు నాయుడు.

గొప్ప పరిపాలనాదక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది…

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతం…

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రన్న…

తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ…

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనాదక్షుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు.., సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ.., రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శనివారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ.. విలువలు కలిగిన రాజకీయ వేత్తగా. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి.., తెలుగు ప్రజల అభ్యున్నత కోసం పరితపించిన ప్రజా ప్రతినిధి,పాలనాదక్షుడు
నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన.
అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు అని. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేసాయన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషీవలుడన్నారు, ముఖ్యమంత్రిగా..తెలుగు దేశం పార్టీ అధినేతగా.., ప్రజాసేవకుడిగా… ఆయన అందిస్తున్న సేవలు నిరుపమానమన్నారు.
ఆధునిక యుగానికి చంద్రన్నను
రోల్ మోడల్ గా నిలిపాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తూరు ఎంపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ను సర్వతో ముఖాభివృద్ది వైపు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version