కన్నుల పండుగగా గద్దర్‌ అవార్డుల వేడుక.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చలనచిత్రాలకు, ఉత్తమ నటీనటులు, దర్శక నిర్మాతలకు సైతం ఈ పురస్కారాలను అందించారు.

14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది ఈ కార్యక్రమానికి యావత్‌ చిత్ర పరిశ్రమ కదిలొచ్చింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎ్‌ఫడీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు, ఎండీ ఎస్‌. హరీష్‌ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రెడ్‌కార్పెట్‌పై సినీ ప్రముఖులు సందడి చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే అవార్డ్స్‌ ఫంక్షన్‌కు సంబంధించిన సావనీర్‌ను వారిద్దరూ ఆవిష్కరించారు.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ మెమెంటోనూ రూపొదించిన రమావత్‌ నాగుల నాయక్‌ను, జ్యూరీ చైర్మన్‌ మురళీమోహన్‌, చైర్‌పర్సన్‌ జయసుధ, సభ్యులు కే దశరథ్‌, డీవీకేరాజు, ఊహ తదితరులను జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్‌. తమన్‌, ఎం.ఎం కీరవాణి, గాయకులు రామ్‌ మిరియాల, మంగ్లీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

గద్దర్‌ను గుర్తు చేసుకుంటూ మంగ్లీ ‘పొడుస్తున్న పొద్దుమీద, బండెనక బండికట్టి’ పాటలు ఆలపించారు. పాతతరం కథానాయికలు జయప్రద, జయసుధ, సుహాసిని, ఒకేఫ్రేమ్‌లో కనిపించి అలరించారు.

భీమ్స్‌ సిసిరోలియో తల్లితో పాటు కలసి పురస్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో ఆయన తల్లిని ముద్దాడిన దృశ్యం మనసుకు హత్తుకుంది. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్‌ విభాగం ప్రధానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పురస్కారాలను అందజేశారు. తర్వాత రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తొలిపురస్కారాన్ని ‘రజాకార్‌’ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా గూడురు నారాయణరెడ్డి, దర్శకుడు యాట సత్యనారాయణకు అందజేశారు.

ఉత్తమ ప్రజాధరణ చిత్రం కేటగిరిలో ‘ఆయ్‌’ చిత్రానికి గాను బన్నీ వాసు తరపున అల్లు అరవింద్‌ పురస్కారం అందుకున్నారు.

శుభ పరిణామం

14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇవ్వడం సంతోషకరం.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఈ రోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. 

సినిమా టికెట్‌లు

దిల్‌రాజు

నా కుటుంబం తరపున ధన్యవాదాలు

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుతోంది. గద్దరన్న తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన పేరును చిరస్ఙాయిగా నిలబెట్టేలా ఈ అవార్డ్‌లు ఇవ్వడం గొప్ప విషయం. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ ఇవ్వడం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత తిరిగి ఎన్టీఆర్‌ అవార్డ్‌ను ఇస్తున్నందుకు నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డ్‌కు తొలి గ్రహీతగా ఎంపికవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు రేవంత్‌ అన్న ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అని చెప్పారు.

నా బాధ్యతను పెంచింది

సినిమా పరిశ్రమను ఒకతాటిపైకి తెచ్చి గద్దరన్న పేరుతో అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. కాంతారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డ్‌ను స్వీకరిస్తున్న తొలి నటుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. రేవంత్‌రెడ్డి గారికి ధన్యవాదాలు.

విజయ్‌ దేవరకొండ

ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..

సినిమా టికెట్‌లు

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version