జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటన.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటనను నిరసిస్తూ

స్వచ్ఛందంగా మంచిర్యాల పట్టణ బందుకు అన్ని సంఘాల ఆమోదం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై పాకిస్తాన్ టెర్రరిస్టు లు దాడులను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో మే 3 న బంద్,ర్యాలీని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు,హిందూ సంఘాలు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సంఘాలు సంఘీభావంతో బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య,సహా కార్యవర్గం, హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణ గంటిరవీందర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తపస్సు టిపిఎస్,భవన నిర్మాణ సంఘం,హమాలి సంఘం, పెయింటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంఘం,బీఆర్ఎస్,బిజెపి వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతూ బందులో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో ఉగ్రమూఖల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు అశ్రునివాళి అర్పించి, కొవ్వాత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హిందువులరా మేల్కొండి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్థాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ముక్యంగా హిదువులను గుర్తించి మరి దాడి చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి,దండిక లింగం,బూమయ్య,సంతారం,రాజేష్,శ్రీకర్,ప్రసాద్,గణేష్,శివ, శ్రీహరి, మల్లేష్,గంగమల్లయ్య, చారి నాయకులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు సురబీ నవీన్ పాల్గొన్నారు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_

— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్

కాప్రా నేటిధాత్రి 24

 

 

జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ.!

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంస్థ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో కాశ్మీరంలో జరిగిన ఉగ్ర చర్యను ఖండిస్తూ స్వర్గస్తులైన వారికి మౌనం పాటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు ఉగ్రవాదుల మీద గైకొనాలని ప్రభుత్వం నేడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని పేర్కొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతున్నదని ఇలా అయితే శాంతికి విఘాతం కలుగుతుందని వాపోయారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ స్వర్గస్తులైన వారికి సద్గతులు ప్రాప్తించాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దొంత దేవదాస్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీరంలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version