న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది

 

 

 

 

వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర ) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు.

ఇటీవ‌ల‌ బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ వంటి వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర (Naveen Chandra) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’ (Show time) తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు. కామాక్షీ భాస్కర్ల (Kamakshi Bhaskarla), సీనియ‌ర్ న‌రేశ్ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra ) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీ వినోద్‌రాజా సినిమాటోగ్రఫీ, శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.

ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై4 థియేట‌ర్‌లో విడుద‌లకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం ఓ ఈవెంట్ నిర్వ‌హించి రిలీజ్‌ చేశారు. ఈట్రైల‌ర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో ఇంట్లో అల‌ని స్నేహితుడు అనుకోకుండా చ‌నిపోవ‌డం, దీంతో హీరో ప‌క్క‌నే ఉండ ఏ లాయ‌ర్‌ను పంప్ర‌దించ‌డం, ఆపై పోలీసుల రాక‌తో ఇంత‌కు హ‌త్య చేసింది ఎవ‌రు అనే పాయింట్‌తో సినిమాను రూపొందించిన‌ట్లు ఉండి ఇట్టే ఆక‌ట్టుకుంటుంది.

కొత్త తరహా చిత్రం.

కొత్త తరహా చిత్రం

 

 

 

 

అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్‌ డైరీస్‌ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం…

‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్‌ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్‌ డైరెక్టర్‌ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్‌ జెన్నిఫర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్‌ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్‌ యాక్షన్‌ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.

లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

Kuberaa: లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

 

 

 

 

గత‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.

నాగార్జున (nagarjuna), ధ‌నుష్ (Dhanush), ర‌ష్మిక (Rashmika mandanna) కాంబోలో జీనియ‌స్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కి గ‌త‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా (Kuberaa). పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అస‌లు ఇలాంటి సినిమాను ఎక్స్‌ప‌ర్ట్ చేయ‌లేదంటూ పలువురు ధ‌నుష్‌, నాగార్జున‌, శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఆకాశానికెత్తేశారు.

మరి కొంత‌మంది మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. సినిమాలో మిస్స‌యిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొంద‌రు ఈ చిత్రం ప్ర‌స్తుత బీజేపీ పాల‌న‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఉంద‌ని కూడా అనేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు అంటూ త‌న సందేహాలను వ్యక్తం చేయగా… ఇప్పుడ‌వి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజ‌మే క‌దా అని అంటుంటే.. మరికొంద‌రు సినిమాను సినిమాలానే చూడాలంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. మరి ఆ నెటిజ‌న్ ప్ర‌శ్న‌లు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి..

కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు

1.బంగాళాఖాతంలో ఆయిల్ ప‌డుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోడానికి నీర‌జ్ అనే వ్యాపారి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కి ల‌క్ష కోట్లు లంచం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. నీర‌జ్ ఎవ‌రు? దేశంలో ఆయ‌న్ని తెలియ‌ని వారు లేరు. ల‌క్ష మంది ఉద్యోగులున్న కంపెనీల‌కీ య‌జ‌మాని. ఆయ‌న కింద ఎంత మంది చార్టెర్డ్ అకౌంటెంట్‌లు వుంటారో , ఏ రేంజ్ ఫైనాన్స్‌ నిపుణులు వుంటారో ఊహించుకోవ‌చ్చు. ఆ రేంజ్‌కి చేరుకోవాలంటే గ‌వ‌ర్న‌మెంట్‌లో ఎంద‌రిని, ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌ని అమాయ‌కుడు కాదు. అయినా కొత్త‌గా అప్పుడే ఏదో డీల్ వ‌చ్చిన‌ట్టు, తండ్రి చెప్పిన మాట‌లు విని, జైల్లో ఉన్న సీబీఐ అధికారిని , కేసు నుంచి విడిపించి మ‌రీ ల‌క్ష కోట్ల డీల్ అప్ప‌చెబుతాడు. డ‌బ్బులిస్తే అన్ని విలువ‌ల్ని వ‌దిలేసుకునే స‌మ‌స్త యంత్రాంగం చుట్టూ వుంటే, అంద‌ర్నీ వ‌దిలి, విలువ‌ల గురించి మాట్లాడే నాగార్జున‌ను తెచ్చుకుని, కొరివితో త‌ల గోక్కుంటాడా? సినిమాటిక్ లిబ‌ర్టీ అంటారా!

2.నాగార్జున విష‌యానికి వ‌ద్దాం. సీబీఐ అధికారి కావాలంటే చాలా చ‌దివి వుండాలి. అధికారం ఉన్న‌పుడు విలువ‌ల‌కి క‌ట్టుబ‌డి వుండాలంటే చాలా నైతిక శ‌క్తి కావాలి. నీర‌జ్ ఎంత శ‌క్తిమంతుడో తెలిసి కూడా , దాడి చేసి ఫైన్ క‌ట్టించాడంటే ఎంతో నిబ‌ద్ధ‌త కావాలి. ముక్కుసూటిగా ప‌నిచేస్తే ఎన్ని శ‌క్తులు త‌న‌మీద ప‌గ ప‌డ‌తాయో తెలియ‌ని అమాయకుడు కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకెళ్లాడు. కోర్టులో న్యాయం జ‌ర‌గ‌లేదు. భార్యాబిడ్డ‌ల వైపు మొగ్గి , నీర‌జ్‌కు లొంగిపోయాడు. మ‌నీల్యాండ‌రింగ్ , షెల్ కంపెనీలు, ఫైనాన్స్‌ ఎక్స్‌ఫ‌ర్ట్‌ల ప‌ని. కానీ నీర‌జ్ గొర్రెలా సీబీఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు. సినిమా లిబ‌ర్టీ ఓకే. నాగార్జున చేసిందేమంటే న‌లుగురు బిచ్చ‌గాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డం. దీనికి న‌లుగురు ఎందుకు? ఒక‌డితోనే లాగించొచ్చు. కానీ క్లైమాక్స్‌కి ఖుష్బు , ఆమె కొడుకు అవ‌స‌రం. ఇది ద‌ర్శ‌కుడి లిబ‌ర్టీ. బిచ్చ‌గాళ్ల‌ని తెచ్చి , క‌టింగ్ చేసి, గ‌డ్డాలు తీసి, కోటు వేసి, సీఈవోని చేసి రోబో అనే వాడి చేతిలో హ‌త్య చేయించ‌డం ఇదంతా ఓవ‌ర్‌గా లేదా? శేఖ‌ర్ క‌మ్ముల‌కి తెలియ‌నిది ఏమంటే డ‌బ్బున్న వాళ్లంద‌రూ డ్రైవ‌ర్ల‌ని, తోట‌మాలీలు, వాచ్‌మెన్ల‌ని బినామీలుగా పెట్టుకుంటారు. దోవ‌లో పోయే బిచ్చ‌గాళ్ల‌ని ట్రైనింగ్ చేయించ‌రు. నీ పేరు మీద క్ష‌ణాల్లో కోట్ల‌ రూపాయిలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి, అమెరికా ప్ర‌యాణం చేయించ‌గ‌ల నిపుణులు అమీర్‌పేట‌లోనే ఉన్నారు. అబిడ్స్‌, కోఠిలో మామూలు వ్యాపారుల‌కి కూడా హ‌వాలా, మ‌నీ ల్యాండ‌రింగ్ తెలుసు. శేఖ‌ర్ సార్ ప‌ద్మారావున‌గ‌ర్‌లో వుండి, అదే ప్ర‌పంచం అనుకుంటున్నారు.

3.ధ‌నుష్ ఒక బిచ్చ‌గాడు. చ‌దువులేదు కానీ, తెలివి వుంది. జ్ఞాప‌క శ‌క్తి వుంది. మ‌నిషిగా విలువ‌లున్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసుకుంటాడు కానీ, బిచ్చ‌గాడిగా ఎందుకుంటాడు? మ‌రు జ‌న్మ‌లో బిచ్చ‌గాడిగా వుండ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని వాడు , ఇపుడు బిచ్చ‌గాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడ‌నే అనుకుంటే ఎవ‌రో ముక్కూమొహం తెలియ‌ని వాళ్లు, డ‌బ్బులిస్తామ‌ని చెబితే వెళ్తాడా? సూటు బూటు వేసి, సంత‌కం చేయ‌మంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేద‌నే అనుకుందాం. ఇంత‌కీ అత‌ని డ‌బ్బు ఎందుకు ట్రాన్స్‌ఫ‌ర్ కాలేదు?

4.ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, ఓల్డ్‌మాంక్ పేరు చెప్పి ఎవ‌డైనా ప్లాట్‌లోకి వెళ్ల‌గ‌లిగే ఇంట్లో బోలెడు డ‌బ్బు, బంగారం దాచిన అధికారి ఎంత అమాయ‌కుడు? అస‌లు అత‌ని క‌థ ఏంటి?

5.బ్యాంకింగ్ అవ‌గాహ‌నే లేని ధ‌నుష్ ఒక ట్ర‌క్కు నిండా నోట్ల క‌ట్ట‌ల‌ని విల‌న్ ఇంటి ముందు ఎలా వేసాడు?

6.నంబ‌ర్ వ‌న్ బిజినెస్ టైకూన్, ఒక బిచ్చ‌గాడిని హ్యాండిల్ చేయ‌లేక బిచ్చ‌గాడిగా మారిపోతాడా?

7.ఎవ‌రో తెలియ‌ని ఖుష్బూని ర‌క్షించిన నాగార్జున ఒక సిన్సియ‌ర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు?

8.సినిమాలో ర‌ష్మిక‌నే కొంచెం స‌హ‌జంగా వుంది. కానీ బిచ్చ‌గాడిని న‌మ్మి అన్ని రిస్క్‌లు తీసుకోవ‌డం కొంచెం అస‌హ‌జం.

9.శేఖ‌ర్ క‌మ్ముల ఒక కంగాళీ సినిమాని తీస్తే, కార‌ణాలు ఏమైతేనేం అంద‌రూ భుజాల‌కెత్తుకుంటున్నారు. నా లాంటి అజ్ఞానుల‌కే స‌మ‌స్య‌.

10.చివ‌రిగా .. శేఖ‌ర్ సార్ మీ అభిమానిగా చెబుతున్నా. మీరొక మంచి సినిమా తీయాల‌నుకుని తీయ‌లేక‌పోయారు. ఆహా, ఓహో భుజ‌కీర్తుల్ని న‌మ్మ‌కండి. అవి దేవ‌తా వ‌స్త్రాలు.

11.ధనుష్ నోట్ల క‌ట్టలు ఇచ్చి అంతిమ యాత్ర చేసినా , బండెడు నోట్ల క‌ట్ట‌లు రోడ్డు మీద కుమ్మ‌రించినా, మీడియా , సోష‌ల్ మీడియా ఏమై పోయాయి? అస‌లు ఈ సినిమా ఏ కాలం నాటిది?

12.డ‌బ్బున్న వాళ్ల‌దే న్యాయం. వాళ్లు పేద‌వాళ్ల‌తో ఆడుకుంటారు, వాడుకుంటారు. నిజ‌మే. టికెట్ రేట్ల‌ని పెంచి మీరు చేస్తున్న‌దేంటి? దోపిడీ కాకుండా వేరే ప‌దం ఏమైనా వుందా?

13.శేఖ‌ర్ క‌మ్ముల రూ.150 కోట్ల‌తో జూదం ఆడారు. మీరు మంచి అట‌గాడే కానీ ముక్క‌లు ప‌డ‌లేదు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు

 

 

 

 

 

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో ‘సైకోట్రాఫిక్‌’ రకం డ్రగ్‌ను తీసుకున్నట్టు తేలింది. ‘తీంగిరై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్‌ కావాలని నటుడు శ్రీరామ్‌ కోరగా, కెనడా దేశానికి చెందిన డ్రగ్‌ ఫెడ్లర్‌ జాన్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్‌కుమార్‌ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం ఉదయం నుంగంబాక్కంలోని శ్రీరాం నివాసానికి వెళ్ళి విచారించగా, డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి రక్తం శాంపిల్స్‌ సేకరించి వైద్య పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరాంను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కొనుగోలు కోసం శ్రీరామ్‌ రూ.72 వేల వరకు డ్రగ్‌ ఫెడ్లర్‌కు చెల్లించినట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా

 

స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

 

 

 

 

ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2).

చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

అజ‌య్ రావు (Ajay Rao) హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌న్ భ‌ట్ (Pavan Bhat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌కాశ్ బెల‌వాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్‌ అర్చ‌న జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభ‌ర‌ణ (T. S. Nagabharana) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రెండు నెల‌ల క్రితం ఏప్రిల్18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ నాట మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

సుమారు రెంఉ గంట‌ల నిడివితో గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే త‌మ్ముడు పాడు చేశాడ‌ని త‌ల్లి నివేదిత‌ కోర్టుకెళుతుంది.
అయితే అక్క‌డ నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా న్యాయం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ ఓ రోజు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే నిందితుడిని అంద‌రి ముందే గ‌న్‌తో కాల్చి చంపుతుంది.
దాంతో ఆమె జైలే పాల‌వుతుంది.
ఆమె ఒంట‌రి కావ‌డంతో కేసును వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.
అదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద‌గ్గ‌ర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు.
ఈ నేప‌థ్యంలో నివేదిత దుస్తితి చూసి చ‌లించిన భ‌ర‌త్ ఆ కేసు టేక‌ప్ చేస్తాడు.
మ‌రోవైపు త‌న త‌మ్ముడిని చంపిన నివేదిత‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన శిక్ష వేయించాల‌ని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమిన‌ల్ లాయ‌ర్ రాబ‌ర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డ‌బ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు.
దీంతో పెద్ద లాయ‌ర్ కావ‌డంతో ఓట‌మి ఖాయ‌మ‌ని భ‌ర‌త్‌కు హెల్ప్ చేయ‌డానికి చాలా మంది ముందుకు రారు.

ఈ క్ర‌మంలో భ‌ర‌త్ అంత పెద్ద లాయ‌ర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎలాంటి వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి, ఎవ‌రు పై చేయి సాధించారు చివ‌ర‌కు ఓ యువ‌కుడిని చంపి నేరం చేసిన‌ నివేదిత‌ను బ‌య‌ట‌కు ఎలా తీసుకు వ‌చ్చాడ‌నే ఈ సినిమా క‌థ‌.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుంద‌ని ముందే తెలిసిన్న‌ప్ప‌టికీ క‌థ‌ను న‌డిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.

అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిర‌ప‌రాధులను హీరో విడిపిస్తే..

ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అంద‌రి ముందే నేరం చేసిన ఓ మ‌హిళ‌ను హీరో ఏ విధంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడ‌నే పాయింట్ కొత్త‌గా ఉంటుంది.

ఎలాంటి సినిమాటిక్ లిబ‌రిటీస్ తీసుకున్నార‌నే మాట రాకుండా చ‌ట్టంలో ఉన్న పాయింట్ల‌ను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమా మొద‌ట్లో హీరో అన‌వ‌స‌ర‌ ప్రేమ వ్య‌వ‌హారం త‌ప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా సెకండాఫ్ ఫైన‌ల్ హియ‌రింగ్ స‌మ‌యంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బ‌మ్స్ తీసుకు వ‌చ్చేలా ఉంటాయి.

అందుకు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ను వాడుకున్న విధానం, ఏళ్ల‌కు ఏళ్లు కేసులు పెండింగ్, స‌రైన స‌మ‌యానికి న్యాయం ల‌భించ‌క‌పోవ‌డం అనే పాయింట్లు చ‌ర్చించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబంతో క‌లిసి మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు.!

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల నేటిదాత్రి:

 

చర్ల మండలం కలివేరు గ్రామంలో కల్లూరి సమ్మయ్య ఇళ్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3.

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3

 

దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె…

 

 

 

 

‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు, హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌. అప్పటినుంచి ఈ సినిమా గురించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మలయాళంలో తెరకెక్కనున్న పార్ట్‌ 3 కథ వేరు.. హిందీలో రూపొందే చిత్ర కథాంశం వేరు.. అని. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ గురించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. ‘‘దృశ్యం 3’ని ఒకే కథతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తాం. మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.. కానీ, మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేస్తాం. ప్రస్తుతం స్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. పూర్తయ్యాక హిందీ టీమ్‌కు అందిస్తాం.. అక్కడ పరిస్థితులకు తగినట్లుగా మేకర్స్‌ మార్పులు చేస్తారు’’ అని చెప్పారు. తెలుగులో పార్ట్‌ 3లో వెంకటేశ్‌ నటిస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్‌లో కథానాయకుడిగా మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేశ్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించారు. మలయాళంలో రెండు భాగాలకూ జీతూ జోసెఫ్‌ దర్శకుడు. తెలుగులో, హిందీలో దర్శకులు మారారు.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

సినిమా థియేటర్‌లు

 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

 

 

 

 

 

 

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గోబ్లల్ స్టార్. తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నా… ఆమె తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన యాక్షన్ సినిమాలకూ దూరం కాలేదు. అయితే అవకాశం చిక్కితే తన చిత్రాలు, వెబ్ సీరిస్ ద్వారా వినోదాన్ని పంచడానికీ రెడీ అంటోంది. అలాంటి ఓ వినోదాత్మక చిత్రమే ‘హెడ్స్ ఆఫ్‌ స్టేట్’ (Heads of State).

సినిమా థియేటర్‌లు

గతంలో ‘బేవాచ్, క్వాంటికో, సిటాడెల్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసిన ప్రియాంక ఇప్పుడు యాక్షన్ కామెడీ మూవీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’లో సీనియర్ ఎం.ఐ.6 ఏజెంట్ గా నటించింది. ఆమెతో పాటు జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అలానే జాక్ స్వాయిడ్, స్టీఫెన్ రూట్, కార్లా గుగినో, సారనైల్స్ కీలక పాత్రలు పోషించారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియాంక పాల్గొంటోంది. అమెరికన్ ప్రెసిడెంట్ (జానా సీనా), బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ (ఇంద్రిస్) ఒకసారి విమానంలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళిద్దరిపై శత్రువులు దాడి చేయడంతో వీరి విమానం ఓ ప్రదేశంలో లాండ్ అవుతుంది. అక్కడకూ చేరుకుని శత్రువులు వీరిని హతమార్చడానికి ప్రయత్నిస్తే సీనియర్ ఏజెంట్ నోయెల్ బిస్సిట్ (ప్రియాంక చోప్రా) వీరిని ఎలా కాపాడిందనేదే ఈ మూవీ మెయిన్ థీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి జూలై 2న స్ట్రీమింగ్ అయ్యే ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఏ తీరిన ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ సంఘ కృషి మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకై ప్రభుత్వం నిధుల విడుదల

ఇది ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

చర్ల నేటిధాత్రి:

 

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి పి ఆర్ టి యు టీఎస్ సంఘం పక్షాన పలుమార్లు ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు 700 కోట్ల రూపాయలు విడుదల చేయనుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా 270 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపుకు గాను కేటాయించగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది మిగిలిన నిధులతో పెండింగ్ జిపియఫ్ పార్ట్ ఫైనల్స్ తుది చెల్లింపులు మరియు వేతన బకాయిల చెల్లింపు కూడ జరగనుంది
పెండింగ్ బిల్లుల సాధనలో ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల విడుదలకై అవిరామ కృషితో శ్రమిస్తూ ఉన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి కు పి ఆర్ టి యు టి ఎస్ చర్ల మండల శాఖ చర్ల మండలం అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి వీరభద్రం రాష్ట్ర జిల్లా కార్యదర్శులు వేణు శ్రీనివాస్ గురుమూర్తి కొల్లిపాక హరికృష్ణ రాజు వైవి రాజు పున్నం సారయ్య మీడియం రామకృష్ణ రమణయ్య హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌.

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మ‌ధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషించగా, మోహన్‌ బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు.

ఇప్ప‌టికే అమెరికా, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లోప్ర‌త్యేక ఈవెంట్లు సైతం నిర్వ‌హించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్ప‌టివ‌ర‌కు క‌థానాయిక‌గా ఉన్న‌ నుపుర్ స‌న‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)ను ఆ స్థానంలోకి వ‌చ్చి చేర‌డం సినిమా పూర్తి చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.
ఆపై ఈ ముద్దుగుమ్మ‌పై చిత్రీక‌రించిన పాట‌లు, స‌న్నివేశాల‌ను కాల‌క్ర‌మంలో మేక‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమా జ‌నాల నోళ్ల‌ల్లో నానేలా చేశారు.
అయితే ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో సినిమా టీం అంతా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో బిజీగా గ‌డుపుతుండ‌గా వాటిళ్లో ఎక్క‌డా ఈ ముద్దుగుమ్మ క‌నిపించ‌క పోవ‌డంపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
కేర‌ళ‌లో జ‌రిగిన ప్రొగ్రాంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ నాట శివ రాజ్‌కుమార్ వంటి మ‌హా న‌టులు ఈ మూవీ ఈవెంట్‌ల‌లో పాల్గొనగా హీరోయిన్ అక్క‌డా కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు.
అప్పుడెప్పుడో ఏడాది క్రితం సినిమా టీజ‌ర్ ఈవెంట్‌లో క‌నిపించిన ఈ చిన్న‌ది మ‌ళ్లీ ఈ చిత్రం విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించింది లేదు.

అఖ‌రుకు.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన మెయిన్ ఈవెంట్‌లోనూ ప్రీతి క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశం అవుతుంది.

క‌న్న‌ప్ప సినిమాలో తిన్న‌డు ప్రేయ‌సిగా, భార్య‌గా కీల‌క పాత్ర పోషించిన న‌టి ఈవెంట్ల‌లో ఎందుకు క‌నిపించ‌డం లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది.

అంతేకాదు ఇప్ప‌టికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుంద‌న్‌ల‌పై చిత్రీక‌రించిన పాట బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు అందులో హీరోయిన్‌కు వేసిన బ‌ట్ట‌లు, పాట చిత్రీక‌రించిన విధానం తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వ‌చ్చాయి.

ఇది అస‌లు భ‌క్తి చిత్ర‌మా లేక ర‌క్తి మూవీనా అనే వ‌ర‌కు వెళ్లింది.

కాగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్ర‌ధానంగా హీరోయిన్ ప్రీతి న‌టించిన యుద్దం, ఎమోష‌న‌ల్, రొమాంటిక్ స‌న్నివేశాలే అధికంగా చూపించ‌డం విశేషం.

అలాంటిది పాన్ ఇండియాగా విడుద‌ల‌వుతున్న ఇంత‌ పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన న‌టి ఇ్ప‌పుడు ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈవెంట్‌కు చిన్న క్యారెక్ట‌ర్ చేసిన సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్క‌లోకి తీసుకోలేదా, ఈవెంట్ల‌కు పిల‌వ‌డం మ‌రిచారా, కావాల‌నే దూరం పెట్టారా లేక త‌నే రానందా అనే ప్ర‌శ్న‌లు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.

ఈవెంట్‌లో సైతం ప్రీతి గ‌రించి, ఆమె పాత్ర‌, న‌ట‌న‌ గురించి మాట్లాడిన‌ట్లుగా కూడా లేదు.

అఖ‌ర‌కు బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్ కుమార్ సైతం క‌న్న‌ప్ప టీంతో క‌లిసి ఇంట‌ర్వ్యులు ఇచ్చి సినిమా ప్ర‌చారంలో పాల్గొంటు త‌న వంతు సాయం అందించారు.

అలాంటిది క‌న్న‌ప్ప సినిమాలో మెయిన్ పిల్ల‌ర్ల‌లో ఒక‌రైన‌ హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంట‌ర్వ్యూల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

సినిమా విడుద‌ల‌కు మ‌రొ నాలుగు రోజులే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ప్రీతి ముకుంద‌న్ మీడియా ముందుకు వ‌స్తుందేమోన‌ని బావిస్తున్నారు.

జల, వర, ‘‘సర్వ ప్రదాయని’’ కాళేశ్వరం!

-అన్నింటికీ నీళ్లే ఆధారం..

-కాళేశ్వరాన్ని వదిలేస్తే కరువు ఖాయం!

-మళ్ళీ తెలంగాణ ఎడారి కావడం తధ్యం.

-తెలంగాణ వలసల రాష్ట్ర కావడం పెద్ద దూరంలో లేదు.

-ప్రగతి అంటే ప్రజల బతుకులు బాగుపడాలి.

-ఎకానమీ వృద్ధితో ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి.

-ప్రజల సంపన్నులు కావాలని ప్రభుత్వాలు కోరుకోవాలి.

-ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఖజానా లెక్కలు చూసుకోకూడదు.

-ప్రజలు సంపన్నులుగా మారే ప్రణాళికలు అమలు చేయాలి.

-కాళేశ్వరం అలాంటి గొప్ప దిక్సూచికి నిదర్శనం.

-తెలంగాణ రెండు రకాల ఆదాయ వనరులు మీద ఆధారపడి వుంది.

-ఆ రెండు రంగాలు నీటి అవసరాలతో ముడిపడి వుంది.

-వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ తెలంగాణకు అవసరం.

-పారిశ్రామిక ప్రగతి, పట్టణీకరణకు నీరు ఎంతో అవసరం.

-ప్రజలకు సాగు, త్రాగుకే కాదు నిర్మాణ రంగానికి నీరు ప్రధానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాళేశ్వరం నిజంగా తెలంగాణకు వరప్రదాయినే..అరవై ఏళ్ల తెలంగాణ గోసను తీర్చిందే. ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించిదే. అన్నమో రామ చంద్రా అని ఏడ్చిన తెలంగాణ అన్న పూర్ణగా మార్చిందే..వెయ్యి అడుగులకు బోర్లు చేసినా చుక్క నీరందని తెలంగాణలో, పది ఫీట్లలోనే నీరందించిన వర ప్రదాయినే..నలభై ఏళ్ల క్రితం పూడిపోయిన బావుల్లో కూడా నీరు చేసింది కాళేశ్వరం వల్లనే…నలభై ఏళ్లుగా వినియోగించని బావులు మళ్లీ సాగుకు పనికొచ్చాయంటే కారణం కాళేశ్వరమే…పాతాళంలో వున్న నీరును తెచ్చి సాగు చేసేందుకు వేసిన బోర్లు కరంటు అసవరం లేకుండా ఎల్లబోసినవి కాళేశ్వరం వల్లనే..అవును ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా వుండడానికి కారణం కాళేశ్వరమే… కాళేశ్వరం ఎప్పుడూ శనేశ్వరం కాదు. తెలంగాణకు పట్టిన శనిని తరిమిన అదృష్టమే కాళేశ్వరం. సరిగ్గా పన్నెండేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లపాటు కరవులో మగ్గిన తెలంగాణ ప్రాంతం. కరువు అంటే అలాంటి ఇలాంటి కరువు కాదు. భయంకరమైన కరువు. నీళ్లు లేకనా..కాదు..వానలు కురవకనా? లేదు. అన్నీ వున్నాయి. కాని తెలంగాణ నెత్తిన ఉమ్మడి పాలన అనే శని వచ్చి కూర్చన్నది. ఏలి నాటి శనికైనా కొంత కాలం వుంటుందేమో? కాని ఉమ్మడి పాలన శని 60 ఏళ్లు పట్టి తెలంగాణను పీడిరచింది. ఉమ్మడి పాలన మొదలైన నాటి నుంచే తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. రెండు రాష్ట్రాలు కలిసి నాటి నుంచే కొట్లాట మొదలైంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆరాటం, పోరాటం రెండూ మొదలయ్యాయి. కాని కనికరించిన వారు లేదు. కదిలిన వారు లేరు. తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేస్తుంటే పట్టించుకున్న పెద్దలు లేరు. డిల్లీ నేతలకు తెలంగాణ అన్యాయం కనిపించనంగా ఉమ్మడిపాలకులు మాయ చేసి, మభ్యపెడుతూ వచ్చారు. పాలకులుగా ముందుండి తెలంగాణ నేతలను వెనక్కి నెట్టేశారు. బలం లేనితెలంగాణ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను బలం చూసుకొని సీమాంద్ర నాయకులు పెత్తనం చేశారు. తెలంగాణ నిధులను ఆంద్రాకు ఎత్తుకెళ్లారు. తెలంగాణ నీళ్లను మలుపుకెళ్లారు. ఆఖరుకు తెలంగాణకు పని లేకుండా, ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోయారు. తెలంగాణను ఎండబెట్టారు. లేని కరువును తెచ్చి రుద్దారు. కనికరం లేనిపాలన సాగించారు. తెలంగాణ గోస పుచ్చుకున్నారు. గొంతెండుతున్న తెలంగాణను చూసి నవ్వుకున్నారు. తెలంగాణకు కష్టం తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మెతుకులు విదిల్చినట్లు ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు శంకుస్ధాపనలుచేసేవారు. ఆకాశంలో చుక్కలు చూపించి, ఓట్లు వేయించుకునేవారు. ఎప్పుడూ ఇదే తరీక..ఎన్నికలు అయిపోగానే మళ్లీ మెలిక. ఇదే ఉమ్మడి పాలకులు చేసిన మోసం..ద్రోహం..దౌర్జన్యం..ఆదిప్యతం. తలాపున పారుతున్న గోదావరి నీటిని తెలంగాణకు మళ్లిస్తే ఎండాకాలంలో ఆంద్రాకు చుక్క రాకుండాపోతుందనుకున్నారు. ఆంద్రాలో రెండో పంటకు నీళ్లివ్వాలంటే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు. తెలంగాణలో వున్న ప్రాజెక్టుల నీళ్లు కూడా పొలాలకు అందించలేదు. ఆంద్రాలో రెండో పండలకు అవసరమైనప్పుడు మాత్రం గెట్లెత్తుకున్నారు. శ్రీరాం సాగర్‌ నిర్మాణం నుంచి మొదలు, తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా, అది ఆంద్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఎగువన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి మొదలు కింద కిన్నెర సాని వరకు ఏపికి ఉపయోగ పడే ప్రాజెక్టులుగానే మార్చుకున్నారు. తెలంగాణకు చుక్కనీరించేందుకు మనసు రాలేదు. మిగులు జలాల కాలవలు ఆంద్రాకే, వరద జలాల కాలువలు ఆంద్రాకే ఇలా గోదావరి గలగల పారుతున్న సవ్వడి తప్ప, నీటిచుక్కను ఇవ్వలేదు. ఆఖరుకు సమ్మక్క సారక్క జాతర సమయంలో కూడా నీళ్లు వదిలేందుకు కూడా ఇష్టపడకపోయేవారు. ఇక కృష్ణా నది నీటిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని చెప్పేవారు. పాలమూరును ఏనాడు పట్టించుకోలేదు. కాని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనే పొక్కపెట్టి పోతిరెడ్డి పాడుపేరుతో వెనుక నుంచి వెనక్కే మళ్లించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో కుడిలో ఏడాదంతా నీళ్లు తీసుకెళ్లారు. ఎడమ కాలువకు అడగంగ అడగంగా అరకొర వదిలేవారు. పైగా కుడి కాలువ నుంచి ఏపి రైతులకు, కృష్ణాడెల్టాకు ఉచితంగా నీళ్లిచ్చేవారు. ఎడమ కాలువకు నీటి తీరువా వసూలు చేసేవారు. కుడికాలువపై వున్న ఎత్తిపోతల ఖర్చు ప్రభుత్వం భరించేది. ఎడమ కాలువ ఎత్తిపోతల ఖర్చు రైతుల నుంచి వసూలు చేసేది. ఇంతటి దుర్మార్గమైన పాలననుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాళేశ్వరం వచ్చింది. తెలంగాణ సాగుకు నీరుండేది కాదు. భూ గర్భ జలాలకు దిక్కులేదు. వర్షాకాలం కురిసే వానలకు కూడా పంటలు పండిరది లేదు. బావులు నిండేవి కాదు. బాగా కాలమైనా మూడు నెలలకు మించి నీరు సాగుకు సరిపోయేది కాదు. బోర్లు వేసుకున్నా నీరు రాక తెలంగాణ రైతులు అప్పుల పాలైపోయేవారు. ఆ అప్పులు తీర్చేందుకు కూలీలుగా మారిన దుస్తితి చూసింది తెలంగాణ. అలాంటి తెలంగాణ రూపు రేఖలు మార్చింది కేసిఆర్‌. ముమ్మాటికీ ప్రతి తెలంగాణ వాది ఒప్పుకోవాల్సిందే. పార్టీలకతీతంగా కాళేశ్వరం అంశంలో గొప్పగా చెప్పుకోవాల్సిందే. దురదృష్టమేమిటంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. నిజాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ పాలకులు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగితే బైట పెట్టడం తప్పు కాదు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని ఏ తెలంగాణ వాది కోరుకోవడం లేదు. కాని ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ఎండబెట్టడం సరైంది కాదు. కాళేశ్వరం మీద వేసిన కమీషన్‌ కూడా దాని నిర్మాణ సమయంత సాగ దీయడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. కాళేశ్వరంలో జరిగిందని రేవంత్‌ సర్కారు కమీషన్‌ వేసినప్పుడు ప్రజలు స్వాగతించారు. కాని కాళేశ్వరం నీటిని వినియోగం ఆపడం నుంచి ప్రజల్లో ఒకింత బిఆర్‌ఎస్‌పై సానుభూతి పెరుగుతోంది. రానున్న కాలంలో అది మరింత పెరిగే అవకాశంవుంది. ఆ తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్ధితి రాదు. కమీషన్‌ రిపోర్టు అందుకు అనుగుణంగా వచ్చినా ప్రజలు స్వాగతించరు. ఎందుకంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ లబ్దిపొందింది. రైతులు సంతోషంగా వున్నారు. గత ఏడాది విసృతంగా వానలు కురిశాయి. సమృద్దిగా రైతులకు నీరందింది. దానితో కాళేశ్వరంతో పని లేకుండా పంటలు పండాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే అది నిజమని ప్రజలు కూడా నమ్మారు. కాని గత సీజన్‌లో రైతులకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు కాలం కూడా ముఖం చాటేస్తుంది. ఇలాంటి పరిస్దితులు వస్తే, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, పంటలు ఎండిపోకుండా చూసుకోవడం కోసం నీళ్లను ఆదా చేసి, రైతులకు ఇచ్చేందుకే కాళేశ్వరం అని ప్రజలు గుర్తించే రోజు వస్తోంది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్దితి. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే అప్పటి బిఆర్‌ఎస్‌ పాలకుడు, కేసిఆర్‌ సుస్పష్టంగా చెప్పారు. మూడేళ్లు కాలం కాకపోయినా, కరువు వచ్చినా, తెలంగాణ రైతు నీళ్లకు ఇబ్బందులు ఎదురుకావని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నిజం కానున్నది. జూలై నెల వస్తున్నా వాన చినుకు జాడ లేదు. వర్షాలు ఇప్పుడు కురుస్తాయన్న సంకేతాలు కూడ కనిపించడం లేదు. ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఓ వైపు రైతులు సాగు మొదలు పెట్టారు. గతంలో పదేళ్లపాటు కాలం కోసం ప్రజలు ఎదురుచూడలేదు. అటు దేవాదుల, ఇటు కాళేశ్వరంతో పుష్కలంగా భూ గర్బ జలాలు వున్నాయి. హైదరాబాద్‌ కు కూడా మంచి నీటి కటకట రాలేదు. పారిశ్రమలకు నీరు అందలేదన్న మాట వినిపించలేదు. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే, ఆగష్టులో అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదరుకాకతప్పదు. ఇప్పుడు చెరువులు నింపాలన్నా, దేవాదులలో నీరు లేదు. ఇతర రిజర్వాయర్లలలో సమృద్దిగా నీరు లేదు. చెరువులుఎక్కడిక్కడ ఎండిపోయాయి. దీని ప్రభావం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద పడుతుంది. రైతు కన్నెర్ర చేస్తే ఇక కనికరించే పరిస్ధితి వుండకపోవచ్చు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడిపాలకులు అన్యాయంచేశారు. కాళేశ్వరం వున్నా నీటిని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం బద్‌నాం కాకతప్పదు. కాళేశ్వరంలో కుంగిన మూడు పిల్లర్లను బాగుచేస్తే బిఆర్‌ఎస్‌కు పేరొస్తుందని అనుకోవడం తగదు. కరవొచ్చి ఒక్క మడి ఎండినా, అది కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి నాంది జరుగుతుంది. కాంగ్రెస్‌ మరో పది కాలాల పాటు పాలించాలనుకుంటే, ప్రభుత్వం కొనసాగాలంటే నీటి సంక్షోభం లేకుంటే చూసుకుంటే మంచిది. లేకుంటే కాంగ్రెస్‌ చే జేతులా గడ్డు కాలం తెచ్చుకున్నట్లౌవుంది. బిఆర్‌ఎస్‌ను మరిపించేలా నీరివ్వండి. కాంగ్రెస్‌ను మళ్లీ మళ్లీ గెలిపించుకునేలా చేసుకోండి. రైతుకు నీళ్లందితే కాంగ్రెస్‌కు మేలు. రైతు ఏడిస్తే ఇదే కాంగ్రెస్‌కు గెలుపు ఆఖరు.

‘‘నో డైరెక్ట్‌’’..’’ఓన్లీ డైవర్ట్‌’’.

-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి.

-కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది.

-అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది.

-ప్రజా సమస్యలు చర్చించడం లేదు.

-ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం.

-మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి.

-సోషల్‌ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి.

-మీడియా, సోషల్‌ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి.

-రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి.

-ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే!

-ప్రతి అంశంలోనూ కప్పగంతులే.

-గెలిచిన పార్టీలు అంతా బాగుందనుకుంటున్నాయి.

-ఓడిన పార్టీలు గెలిచేందుకు తాపత్రయపడుతున్నాయి.

-అన్ని పార్టీలు కలిసి ప్రజా సమస్యలను గంగలో ముంచేస్తున్నాయి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాను రాను రాజకీయాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గత యాభైఏళ్ల రాజకీయాలకు ఇప్పటికీ పొంతన లేకుండాపోతున్నాయి. ఒకప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి, నిత్యం ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజలు ఆదరించేవారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులనే ఆదరించేవారు. ఏ పార్టీ అయినా నిరంతరం పోరాటంలో వుంటేనే అదికారంలోకి తెచ్చేవారు. అది కేంద్రంలోనైనా రాష్ట్రాలలోనైనా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసేవారు. కాని కాలం మారింది. మరీ ఈ రెండు దశాబ్ధాల కాలంలో నాయకులకు మాటలొస్తే చాలు. అబద్దాలు చెప్పడం వస్తే చాలు. నమ్మించడం తెలిస్తే చాలు. అవసరమైతే ప్రజలను సెంటిమెంటుతో ఒప్పిస్తేలు చాలు. కులం, మతం ఆసరాగా చేసుకొని రాజకీయాలుచేస్తే చాలు. ప్రజల్లో వున్న నమ్మకాలను పట్టుకొని రాజకీయాలు చేస్తేచాలు. అన్నట్లు తయారైపోయాయి. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేదు. సిద్దాంతాలు పట్టుకుంటే రాజకీయాలు సాగే రోజులు కాదు. అందుకే ఇప్పుడు రాజకీయాలకు సిద్దాంతాలు లేవు. పార్టీలు ఏనాడో రూపొందించుకున్న విలువలు లేవు. అందుకే సమాజంలో ఎవరు నాయకులౌతున్నారో? ఎవరు గెలుస్తున్నారో? ఎందుకు గెలుస్తున్నారో? కూడ అర్దంకాని పరిస్ధితులు ఎదురౌతున్నాయి. రాజకీయాలు చేయడాన్ని కూడా తమదైన శైలిలో నడిపించేవారికే రాజకీయ భవిష్యత్తులుంటాయి. నాయకులకు వ్యతిరేకంగా వున్న పార్టీలపై కూడా ప్రజలు కోపం పెంచుకుంటున్నారు. నాయకులకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో లేవు. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ దేశ వ్యాప్త రాజకీయాలను ఒక గ్రంధంగా మార్చొచ్చు. రామాయణం కన్నా పెద్ద కావ్యం రావొచ్చు. అయితే ఇక్కడ ఆటలో అరటిపండ్లు ప్రజలే అవుతున్నారు. ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజలే ఎనుకున్న ప్రజా ప్రభుత్వం. ఇది పేరుకే అన్నది ఇప్పటి కాలం నిజం చేస్తోంది. కొన్ని నిజాలు చాలా చేదుగా, ఘాటుగా కూడా వుంటాయి. 2014లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి బిజేపి పెద్దగా కష్టపడలేదు. కాని ఆ అదికారాన్ని వరసుగా మూడు సార్లు నిలబెట్టుకోవడానికి మాత్రం చేస్తున్న రాజకీయ విన్యాసం విచిత్రమైనది. ప్రజా సంక్షేమం గతంలో ఎప్పుడూ లేనంతగా చూపిస్తూ బిజేపి కేంద్రంలో తిరుగులేని పాలన కొనసాగిస్తుందా? అంటే ఔనని సమాదానం ఎంత మంది చెబుతారో మాత్రం చెప్పలేం. కాని బిజేపి పార్టీ మూలసిద్దాంతంలో ఒకటైన మతాన్నిమాత్రం గట్టిగా పట్టుకున్నది. హిందూ మతానికి ప్రమాదం వుందన్న భయాన్ని ప్రజల్లో రేకిత్తెంచగలిగింది. హిందూ సమాజాన్ని మాత్రం ఏకం చేయడంలో బిజేపి సక్సెస్‌ అయ్యింది. అదే కొనసాగిస్తూనే వుంది. అటు తిరిగి, ఇటు తిరిగి హిందూ పునరేకీకరణ అనేదే మూలసిద్దాంతమైపోయింది. అంతకు మించి ఏం చేస్తోంది అంటే చెప్పడానికి ఏదీ లేదు. కాని దేశం మాత్రం సుబిక్షంగానే వుంది. కరువు లేదు. ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేదు. కాని నిరుద్యోగం విపరీతంగా పెగిపోయింది. దేశంలో సాగు వెనుకబడిపోయింది. అయినా సమృద్దికరమైన ఆహారమే జనానికి అందుతోంది. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది అర్ధాకలితో బతుకుతున్నారు. ఆ వార్త మాత్రం ఎక్కడా కనిపించదు. వినిపించదు. ఆకలి కేకులున్నట్లు ఒక్క మీడియా రాయదు. ఇదే ఇప్పుడున్న రాజకీయాల్లో బెస్ట్‌ క్వాలిటీ. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే ఏ ఒక్క జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మానం చేసింది లేదు. రాష్ట్రాలలో కూడా ఏపి, తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు నిర్మాణం చేసినట్లు వార్తలు లేవు. ప్రశ్నించే నాయకులను కులం మీద దెబ్బకొట్టాలి. మతాన్ని ముడిపెట్టి రాజకీయాలు చేయాలి. బిజేపిని ప్రశ్నించే ప్రతి వారిని హిందూ వ్యతిరేకులని నిందించాలి. దేశ ద్రోహులని ముద్రలు వేయాలి. ఇలా ఇప్పటి వరకు మూడుసార్లు అధికారంలోకి కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా అధికారం దక్కించుకునేందుకు బిజేపి ఆడుతున్న రాజక్రీడలో ఎవరూ ఎదురు నిలబడి గెలవడం లేదు. 130 సంవత్సరాల చరిత్ర వున్న కాంగ్రెస్‌కూడా కాకావికలమైపోతోంది. బిజేపి డౌవర్ట్‌ పాలిటిక్స్‌ను మాత్రమే నమ్ముకొని రాజకీయాలు సాగిస్తోంది. కేంద్రం నుంచి గుజరాత్‌కు,ఉత్తరాదికి నిధులు ఎన్ని వెళ్తున్నా, కనీసం బిజేపి నాయకులు కూడా నోరెత్తలేని రాజకీయాలు రచిస్తోంది. కొనసాగిస్తోంది. ధరలు ఆశాకాశన్నంటుతున్నా ఎవరూ అడిగే పరిస్దితి లేదు. పక్క దేశాల కయ్యాలే రాజకీయంగా కాపాడుతాయన్నయని నమ్ముకుంటున్నారు. రాష్ట్రాలలో కూడా అదే పరిస్దితి. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్ని కావు. కాని అమలుచేసినవి కూడా పెద్దగా ఏమీ లేదు. కాని ఓట్ల రాజకీయంలో కొన్ని కీలకమైన అంశాలు జొప్పించి రాజకీయం కేసిఆర్‌ సాగించారు. నీళ్లను పట్టుకున్నాడు. ఆ విషయంలో పదేళ్ల కాలంలో చేయాల్సినంత చేశాడు. మిగత వాటిని వదిలేశాడు. అందుకే పదేళ్ల తర్వాత జనం కూడా కేసిఆర్‌ను వదిలేశారు. జనం కేసిఆర్‌ను కాదనుకుంటున్నారన్న సంగతి గ్రహించిన రేవంత్‌రెడ్డి తన రాజకీయం తాను మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకులు ఊహలకందని ఎత్తులు వేశారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు నోరు మూయించాడు. వారందిరినీ తన బాటలోకి తెచ్చుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో అమలు జరుతున్న కొత్త పథకాలు అంటే గ్యారెంటీ కార్డుకే పరిమితం చేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత బిఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ప్రకటించింది. అప్పుడు కేసిఆర్‌ కాంగ్రెస్‌ హమీలను కూడా కలుపుకొని ప్రచారం చేసుకున్నాడు. విజయం సాదించాడు. కాని 2023 ఎన్నికల్లోనూ ఆరు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల తర్వాత కేసిఆర్‌ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినా అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. కాని 2023 ఎన్నికల్లో సిఎం. రేవంత్‌ మొదటి దెబ్బ అక్కడి నుంచే మొదలు పెట్టారు. పదేళ్లు పాలించి, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసిఆర్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టాడంటూ బలంగా రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా గమనించేలా చేశారు. కేసిఆర్‌ చెప్పే మాటలు మోసమని నమ్మించగలిగారు. కాంగ్రెస్‌ ఒక్కసారి మాటిస్తే మర్చిపోయేది లేదని చెప్పారు. మోసం చేయడం కాంగ్రెస్‌ చరిత్రలోనే లేదన్నారు. ఒక్కొసారి కాస్తా ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని జనాన్ని నమ్మించారు. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇస్తాం..అని చెప్పడం మొదలు పెట్టారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఇలా చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని గ్యారెంటీ రూపంలో ప్రజలకు చేర్చారు. కార్డులు చేతిలో పెట్టారు. గెలిచారు. ఆ వెంటనే ఆట మొదలు పెట్టారు. జనాన్ని ఆరు గ్యారెంటీలు మర్చిపోయేలా చేయాలంటే బిఆర్‌ఎస్‌ నాయకుల నోరు మూయిస్తే చాలనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి తన సరికొత్త రాజకీయాన్ని సాగిస్తున్నారు. ఆఖరుకు ప్రతిపక్ష బిజేపి కూడ కాంగ్రెస్‌ను కాకుండా బిఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేసే రాజకీయాలు చేస్తున్నారు. సహజంగా అదికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కాని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి రెండూ బిఆర్‌ఎస్‌ను పుడ్‌ బాల్‌ ఆడేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నోరు తెరవకుండా చేస్తున్నాయి. వీటినే డైవర్ట్‌ పాలిటిక్స్‌ అంటారు. కాళేశ్వరం పై కమీషన్‌ వేశారు. అది జీడిపాకంలా సాగుతూనే వుంది. గత 18 నెలులగా జనంలోనానుతూనే వుంది. దానికి ఇప్పుడే అంతం వుండదు. ఇంకా సాగదీస్తూనే వుంటారు. జనం ఎప్పుడూ మాట్లాడుకోవడానికి ఏదో ఒక సమస్య వుండాలి. అందులోనూ బిఆర్‌ఎస్‌ నాయకులు దోషులని జనం ఎప్పుడూ నమ్ముతూ వుండాలి. అలా కేసిఆర్‌ మీద కాళేశ్వరం, కేటిఆర్‌ మీద కార్లరేస్‌ కేసు, కవిత మీద లిక్కర్‌ కేసు ఇలా ప్రతి నిత్యం ఇవే అంశాలు చర్చలకు రావాలి. మీడియాలో ఇవే అంశాలపై చర్చల మీద చర్చలు జరగాలి. ప్రజా సమస్యలు తెరమీదకు రాకూడదు. తాజాగా బనకచర్ల తెరమీదకు వచ్చింది. ఇదెంత కాలం సాగుతుందో…ఎవరి రాజకీయాలకు చుట్టుకుంటుందో చూడాలి. రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్రజలు అంత అమాయకులు కాదు. దేనిని నమ్మాలో..దేనిని నమ్మొద్దో తెలియని వాళ్లు కాదు. కాని అప్పుడప్పుడు రాజకీయాలలో ప్రజలు కూడా బోల్తాపడతారు. తర్వాత మళ్లీ తేరుకుంటారు. అయిన ఇప్పుడున్న పరిస్దితుల్లో రాజకీయ పార్టీలు మాత్రం డైవర్ట్‌ పాలిటిక్స్‌నే నమ్ముకున్నారు. పక్కన ఏపిలో కూడా ఇదే అమలు చేస్తున్నారు.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

◆ నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు నివాళ్లు అర్పించిన ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని..
తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు అని, ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు…
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,భారత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

 

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ శ్వాస మీద,ధ్యాస,మనకై మనం చేసే అన్వేషణే యోగాని,అదేవిధంగా తనువును,మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక సాధనం యోగాని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,ఈ యోగా దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్ 27 న భారత ప్రధాన నరేంద్ర మోడీ ఐక్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపు కోవడం గురించి ప్రతిపాదన చేశారని,ఈ ప్రతిపాదనకు 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని,భద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం,అమెరికా, ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్,రష్యా దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు అని,విస్తృతమైన చర్చల అనంతరం డిసెంబర్ 2014లో ఆమోదించబడి 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.యోగా జూన్ 21న జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని ఎక్కువ ప్రగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజకుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.

కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చర్ల ఇక్కడ రాజకీయం ఎక్కువ అభివృద్ధి తక్కువ.

ఇది చర్ల ఇక్కడ రాజకీయం ఎక్కువ అభివృద్ధి తక్కువ

సీనియర్ జర్నలిస్టు నరసింహ

నేటి ధాత్రి చర్ల:

చర్ల మండల కేంద్రంలోని ప్రజల బాధలు వర్ణనాతీతం తరతరాలుగా దళితులు గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉండగా నేటికీ మెరుగైన వైద్య సౌకర్యం అందకపోవడం దురదృష్టకరం 100 సంవత్సరాల ప్రభుత్వ వైద్యశాలలో ఎక్సరే స్కానింగ్ సెంటర్ ఎమ్మారై స్కానింగ్ సిటీ స్కానింగ్ లేకపోవడం శోచనీయం మండలంలోని నేటికీ కొన్ని పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు కానీ ప్రభుత్వ బడులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటో ఇది అధికారులు నిర్లక్ష్యమా స్థానిక రాజకీయ నాయకుల వైఫల్యం చర్ల మండల కేంద్రంలో తాలుపేరు డ్యామ్ ఉండగా పెద్ద కాలువ ద్వారా దుమ్ముగూడెం మండలానికి సాగునీరు తరలిపోతున్న చర్ల మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలకు నీరు అందకపోవడం ఏమంటారు అంటే గిరిజనులకు సాగునీరు అవసరం లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించకపోవడంలో వైఫల్యం ఏమిటి ఉప్పరిగూడెం కొయ్యూరు సుబ్బంపేట గ్రామపంచాయతీలకు సాగునీరు కాలువల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎందుకు ఇవ్వటం లేదు తాలిపేరు డ్యామ్ మూడు గేట్ల వల్ల అభివృద్ధి చెందిన ఆ కాంట్రాక్టర్ ఎవరు తాలిపేరు డ్యాం కాలువల మీద డ్యామ్ మీద ఆ కాంట్రాక్టర్ ఎంత లబ్ధి పొందాడు అసలు తాలుపెరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో ఎందుకు అభివృద్ధి పరచడం లేదు తాలిపేరు డ్యామ్ లో పూర్తిస్థాయిలో పూడిక తీసి అధునాతన హైడ్రాలిక్ గేట్లను అమర్చి ఆ ప్రాంతంలో హరిత హోటల్స్ కట్టి టూరిజం సెక్టర్ అభివృద్ధి పరచకపోవడంలో అంతర్యం ఏమిటి ఈ ప్రాంతంలోని గిరిజన దళిత యువతకు తాళిపేరు డ్యాం దగ్గర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ యువత కోరుకుంటున్నారు చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కేంద్రం నిధులు అధిక మొత్తంలో ఈ ప్రాంతానికి వస్తున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల అవగాహన రాహిత్యమా లేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండాలని అనుకుంటున్నా నాయకులు ఎవరు చర్ల మండల కేంద్రంలో రైతు వేదికలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు చర్ల మండల కేంద్రంలో పర్యటించకపోవడం లోపం ఏమిటి ఎన్ని సంవత్సరాలు అయినా దళితులు గిరిజన రైతులు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏమిటో ఇందిరమ్మ ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్న దళితులు గిరిజన కుటుంబాలు గూడు కోసం పడరాని పాట్లు పడుతున్న కుటుంబాలు దండుపేట నుండి కొత్తపెళ్లి లింగాపురం గొంపల్లి మొగుళ్లపల్లి కత్తిగూడెం రహదారి మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల ద్వారా రహదారి మంజూరు చేసిన పూర్తిస్థాయిలో రహదారి వేయకుండా ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించకుండా నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులను ఏసీబీ విచారణ కోరుతుందా అని ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతంలోని దళిత గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్ల కొరకు క్రాప్ లోన్స్ ద్వారా రైతులకు సుమారు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రాంతంలోని రైతులు చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చెందుతారు కానీ రైతులు బ్యాంకు లోకి వెళితే కూర్చోమని చెప్పే బ్యాంకు మేనేజరు లేడు క్రాప్ లోన్ ఆఫీసర్ లేరు ఆ చెప్పు అయ్యా రైతు నాకు లోను కావాలి సార్ ఎంత ఏంటని రైతుతో అవహేళనతో మాట్లాడుతూ అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అసలు చర్ల మండల కేంద్రంలోని బ్యాంకు మేనేజరు క్రాప్ లోన్ ఆఫీసర్లు రైతులకు పంట రుణాలపై అవగాహన కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి ఆర్.బి.ఐ రైతులకు ఇవ్వమన్న రుణం ఏమిటి బ్యాంక్ అధికారులు రైతులకు ఇస్తున్న రుణం ఎంత చర్ల మండల ప్రాంతంలోని రైతులకు బ్యాంకర్లు అవగాహన సదస్సులు ఏర్పరచి ఒక ఎకరం రెవెన్యూ భూమికి ఐదు లక్షల వరకు రుణ సహాయం అందించాలని చర్ల మండల కేంద్రంలోని రైతుల ఆకాంక్ష అదేవిధంగా మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ నేటి వరకు ఏర్పరచకపోవడంలో అంతర్యం ఏమిటి గిరిజనులు దళితుల ఇండ్లు తగలబడి పోతున్న పట్టించుకునే అధికారులే లేరు వరికుప్పలు దగ్ధమవుతున్న పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్న అధికారులు ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడంలో ఇంత నిర్లక్ష్యమా భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక రాంపులు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్న చర్ల మండల కేంద్రంలోని యువతకు ఉపాధి కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి సింగరేణి సంస్థకు ఇసుక రాంపుల నిర్వహణను కేటాయించి మండల కేంద్రంలోని దళిత గిరిజన యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు భద్రాచలం నియోజకవర్గం లో చర్ల మండలం ఏర్పడి సంవత్సరాలు అవుతున్న నేటికీ చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు నిర్లక్ష్యం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న.

కరుణించు వరుణ దేవా…

వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…

నేటి ధాత్రి గార్ల:

జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చెరువులు, కాలువలు, కుంటలు అడుగంటిపోయినాయి. నీటి చుక్క కరువైంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు వెతుకున్న అన్నదాతలు ఆందోళనలకు గురవుతున్నారు. బోర్లు, మోటార్లు ఉన్న రైతులు పొలాలకు తడిపేందుకు ప్రయత్నం చేస్తుంటే, ఏ సౌకర్యం లేని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారినాయి. మబ్బులు కనిపిస్తున్న, వాన మాత్రం పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి, పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసింది. ఖరీఫ్ సాగు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్న వర్షాలు ఎప్పుడు పడతాయా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి

హైదారాబాద్ లోని చేనేత భవన్ లొ ప్రత్యేక సమావేశం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయా నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లోని చేనేత భవన్ లో పద్మశాలి భవన్ నిర్మాణం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలీల కుల భవనము, మార్కండేయ స్వామి ఆలయం నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల నిధుల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగిందన్నారు..టెస్కో నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరడం జరిగింది అని తెలిపారు..ప్రస్తుతం పిల్లర్లు పోసిన భవనాన్ని స్లాబ్ వరకు తీసుకువచ్చి, మరో 3 కోట్ల 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తిచేసుకుని, అందులో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. మరో 2 కోట్లతో మార్కండేయ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మొత్తం 11 కోట్లతో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు..
చేనేతలకు ప్రభుత్వ పక్షాన పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యోదయ కార్డులను అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్తులో చేనేత, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.. ప్రభుత్వమిచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది వింటునట్లు తెలిపారు.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని అన్నారు..నేతన్నల ఎన్నో ఏళ్ల కల 50 కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు..పేదలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,బీసీ వేల్పర్ అధికారులు బల మాయదేవి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
error: Content is protected !!
Exit mobile version