సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.

కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version