తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు..

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ

◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version