వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం…

వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం…

వెదజల్లే పద్దతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది…

కూలీల కొరతను అధిగమించవచ్చు…

రైతులు శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించవచ్చు…

నేటి ధాత్రి – మహబూబాబాద్ -గార్ల :-

 

 

 

వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బందిపడే సందర్బాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్దతిపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నాట్లు వేయడం ప్రస్తుతం పాత తరానికే పరిమితమైంది. నేటి మహిళలు నాట్లు వేసే పద్ధతిపై ఆసక్తి చూపడంలేదు. దింతో రైతులకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. వరి సాగు కత్తి మీద సామయింది. అయితే అనావృష్టి, లేకుంటే అతివృష్టి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు కష్టాలు, నష్టాలు మిగులుతున్నాయి.రైతులు వరి సాగులో మేలుకువలు,శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.వరి వెదజల్లే పద్దతి ద్వారా రైతుకు నాటు పద్దతిలో కన్నా ఒక ఎకరాకు ఆరు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టుబడి ఆదా అవుతుంది.వరి వెదజల్లే పద్దతి ద్వారా నారు మడి పెంచే అవసరం ఉండదు.నాటు కూలిలు ఆదా అవుతాయి,10 రోజుల ముందుగానే వరి కోతకు వస్తుంది.వరి వెదజల్లే పద్దతి వలన ఒక ఎకరాకు 10కేజీల విత్తనం సరిపోతుంది.సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టాలని, విత్తనం వెదజల్లిన 20 నుండి 25రోజుల వ్యవధిలో కలుపు మందు స్ప్రే చేసి కలుపు సమస్య ను అదిగమించుకోవచ్చు.రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయధికారిని సంప్రదించుకోవచ్చు కూడా. పొలం బాగా దున్ని నీటి పారుదల సౌకర్యం కల్పించి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. వరి విత్తనాలను తగినంతగా నానబెట్టి, పొలంలో విత్తనాలను సమానంగా వెదజల్లాలి. పురుగు మందులను అవసరమైనప్పుడు ఉపయోగించి పంటను కాపాడుకోవచ్చు అని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version