ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటిధాత్రి గార్ల :-

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది. ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ. ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు. పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు. మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు. ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ సత్యనారాయణ స్వామి

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని  తాసిల్దార్ సత్యనారాయణ స్వామి పేర్కొన్నారు సోమవారం  మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గోన్నారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ  చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో   ఎం ఆర్ ఐ దేవేందర్ సర్వేయర్ నిరంజన్. సిబ్బంది గుడాల తిరుపతి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..,

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో.

వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో.

రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన .

అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తూ.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవసరమయ్యే ఆరు అంశాలు అనగా.

తక్కువ యూరియా వాడండి.

సాగు ఖర్చులు తగ్గించండి.

అవసరం మేరకే రసాయనాలు వినియోగించండి.

నెల. తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి రసిదరులు భద్రపరచుకోండి.

కష్టకాలంలో నష్టపరిహాన్ని పొందండి.

సాగు నీటిని ఆదా చేయండి.

భవితరాలకు అందించండి.

పంట మార్పిడి పాటించండి.

సుస్థిర ఆదాయాన్నిపోద్దండి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.

అనే అంశాలపై అవగాహన కల్పించారు వీటితోపాటు వరిలోని వివిధ రకాల నూతన వంగడాలు కూరగాయలు సాగు పంటల్లో చీడపురుగు పీడలు నివారణ చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ ఆర్ సతీష్ మాట్లాడుతూ.

నైట్రోజన్ ఎరువులు మరియు పురుగుల మందులు సరైన నియోగం పచ్చి రొట్టఎరువుల.

ప్రాముఖ్యత మరియు వరి తెగులు. నెక్ బ్లాస్ట్ నివారణ సమగ్ర సస్యరక్షణ. Ipm.

పద్ధతులు నిర్వహించారు.

అలాగే. ఐ సి డి ఎస్. సూపర్వైజర్ శ్రీ నిర్మల దేవి మాట్లాడుతూ చంటి పిల్లల తల్లిదండ్రులు.

పిల్లల ఆహారం మరియు వారి ఆరోగ్యం పై తగినంత జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ వ్యవసాయ అధికారి.

కే సంజీవ్ మరియు ఏఈఓ లు నాణ్యమైన విత్తనాలు వేసేసమయం గురించి రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతుల తెగుళ్లు.

కోతుల బెడద.

మట్టి నమూనాలు.

పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోళ్ల పెంపకం గురించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు ద్వారా పెరటిలో పెంచుకునే విత్తనాలు మరియు జగిత్యాల విత్తనాలను రైతులకు అందజేశారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.పాక్స్.

చైర్మన్ బండి దేవదాస్.

మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి సలీం.

ఏ కరుణాకర్. ఆర్ గౌతం. ఎం మౌనిక. అంగన్వాడి టీచర్. ఎన్ వినోద. విద్యార్థులు. అభిలాష్. రాకేష్. రాళ్ల పేట గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నా

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది.

ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ.

ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.

1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు.

పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు.

మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు.

జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.

అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు.

ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు.

అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.

50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.

మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది.

ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి

డీలర్ లపై కొన్ని కంపెనీల కపట ప్రేమ

ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ మరియు డీలక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ ఎరువుల కంపెనీలలో కొన్ని కంపెనీలు లాభా పెక్షే ధ్యేయంగా ఎరువుల కంపెనీ డీలర్ల పై కపట ప్రేమను చూపిస్తూ సీజను అన్సీజన్ పక్కనపెట్టి డిమాండేతర సరుకులకు ఎరువుల ఆర్డర్ తోపాటు లింకు రూపేనా కొన్ని రకాల సరుకులను తీసుకున్న హోల్ సేల్ డీలర్లుతో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయన్నారు.లింకులో తెచ్చుకున్న సరుకులు అమ్ముడుపోక వ్యాపారంలో లాభాలురాక డీలర్లు చితికి పోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా బస్తాలు రిటైల్ డీలర్లు అమ్మే పరిస్థితిలో లేరని కొన్ని కంపెనీ లు ఇచ్చే మార్జిన్లు హమాలీ, డి డి ఖర్చులకే పోతున్నాయని ఇవన్నీ పోగా డీలర్లకు మిగిలేది శూన్యమే అని అన్నారు.ఎరువులపై గవర్నమేంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ కంపెనీ వారు వారి లాభాపేక్షణకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారని అధికారులు,కంపెనీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇచ్చే లింకులు రైతులకు ఇచ్చే విధంగా రూల్ పాస్ చెసి రిటైల్ డీలర్లకు న్యాయ
సమ్మతమైన విధంగా యూరియాను అందించాలని కోరారు.

వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం…

వెదజల్లే పద్దతిలో వరి సాగు లాభదాయకం…

వెదజల్లే పద్దతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది…

కూలీల కొరతను అధిగమించవచ్చు…

రైతులు శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించవచ్చు…

నేటి ధాత్రి – మహబూబాబాద్ -గార్ల :-

 

 

 

వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తుంది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బందిపడే సందర్బాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్దతిపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నాట్లు వేయడం ప్రస్తుతం పాత తరానికే పరిమితమైంది. నేటి మహిళలు నాట్లు వేసే పద్ధతిపై ఆసక్తి చూపడంలేదు. దింతో రైతులకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. వరి సాగు కత్తి మీద సామయింది. అయితే అనావృష్టి, లేకుంటే అతివృష్టి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు కష్టాలు, నష్టాలు మిగులుతున్నాయి.రైతులు వరి సాగులో మేలుకువలు,శాస్త్ర సాంకేతికతను అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.వరి వెదజల్లే పద్దతి ద్వారా రైతుకు నాటు పద్దతిలో కన్నా ఒక ఎకరాకు ఆరు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టుబడి ఆదా అవుతుంది.వరి వెదజల్లే పద్దతి ద్వారా నారు మడి పెంచే అవసరం ఉండదు.నాటు కూలిలు ఆదా అవుతాయి,10 రోజుల ముందుగానే వరి కోతకు వస్తుంది.వరి వెదజల్లే పద్దతి వలన ఒక ఎకరాకు 10కేజీల విత్తనం సరిపోతుంది.సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టాలని, విత్తనం వెదజల్లిన 20 నుండి 25రోజుల వ్యవధిలో కలుపు మందు స్ప్రే చేసి కలుపు సమస్య ను అదిగమించుకోవచ్చు.రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయధికారిని సంప్రదించుకోవచ్చు కూడా. పొలం బాగా దున్ని నీటి పారుదల సౌకర్యం కల్పించి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. వరి విత్తనాలను తగినంతగా నానబెట్టి, పొలంలో విత్తనాలను సమానంగా వెదజల్లాలి. పురుగు మందులను అవసరమైనప్పుడు ఉపయోగించి పంటను కాపాడుకోవచ్చు అని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల

పరకాల నేటిధాత్రి

 

పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, ఎర్ర లక్ష్మణ్ లను తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు,కార్మిక సంఘ నాయకులు లంకదాసరి అశోక్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్..

నేటిధాత్రి, కొత్తపేట, వరంగల్

 

 

 

వరంగల్ మండలం పరిధిలో గత మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిన్న పైడిపల్లిలో దరఖాస్తులు స్వీకరించిన వరంగల్ మండల రెవెన్యూ అధికారులు. వాటిలో బాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో ఎన్నో ఏండ్లగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామ దరఖాస్తులను కూడా భూభారతిలో పరిశీలించి పట్టా చేయుటకు వరంగల్ తహసిల్దార్ కు దరఖాస్తు అందచేశారు కొత్తపేట రైతులు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రైతులు నేరెళ్ల రాజు, లంక రాజగోపాల్, బల్లని ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

సాగు చేసుకునే ప్రతీ రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తాం

చెల్పూర్ లో జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండలం
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో తహశీల్దార్ సత్యనారాయణ స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూమికి పట్టాలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా పట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన ప్రతీ దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరదకు అడ్డుగా హైవే నిర్మాణం


వరదకు అడ్డుగా హైవే నిర్మాణం

పంట పొలాలు కుంటలుగా మారుస్తారా అంటూ రైతుల ఆందోళన

గ్రీన్ ఫీల్డ్ హైవే మహమూద్ పట్నం చెరువును మింగేస్తుందా

చెరువులోకి వర్షం నీరు చేరేదెలా…?

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

టీ వలే నూతనంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలోనే ఉన్నటువంటి త్రాగునీటి సాగునీటి చెరువు సుమారు 250 ఎకరాల పంట పొలాలకు నిరంధించే సామర్థ్యం గల చెరువు నేడు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను చెరువు పక్కనే నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, చెరువు పక్కన ఉన్నటువంటి సుమారు 70 ఎకరాల పంట పొలాల మీదుగా వర్షపు నీరు చెరువులోకి చేరుతుందని గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనులు వరద నీరు చెరువులోకి చేరకుండా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధిత రైతులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు మొదలుపెట్టిన నాటి నుండి పలుమార్లు వరద నీరు చెరువులోకి చేరేలా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు తెలిపామని రైతులు అన్నారు. సుమారు 70 ఎకరాల పంట పొలాలు కుంటలుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నామని ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో పైనుండి వచ్చే వరద మా పంట పొలాలనే నిలుస్తుందని, మహమూద్ పట్నం చెరువు కింద పంట పొలాలు సుమారు 250 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు నీరు అందిస్తుందని గ్రీన్ ఫీల్డ్ హైవే వరదకు అడ్డుగా నిర్మాణం జరుగుతుందని అందుచేత చెరువులోకి వరద నీరు చేరేదెలా అంటూ రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థను ప్రశ్నిస్తున్నారు.

Farmers

పై నుండి వచ్చే వర్షపు నీరు సజావుగా చెరువులోకి పోవాలంటే గ్రీన్ ఫీల్డ్ నిర్మాణ పనులలో ముందుగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గురువారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీరామ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులు కోరినట్టుగా ముందుగా కల్వర్టు నిర్మాణ పనులను రెండు మూడు రోజులలో ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మిట్ట గడపల యాకూబ్, తరిగి నవీన్, బొద్దుల వెంకట మల్లు, రాపోలు శ్రీనివాస్, పోలు నరసయ్య, దేశ బోయిన అనిల్, ఎలిజాల యాకయ్య, కాసోజు విజయ్, పోలు మురళి, చిలువేరు రవీందర్, గణేష్, శివాజీ, సామా అశోక్, పోలె పాక కమలాకర్, బత్తుల సుభాష్, పిట్టల విజేందర్, మూడ వత్ మాంజ, మోతిలాల్, మాదరపు పుల్లయ్య, పెరుమాండ్ల నవీన్, పిట్టల ఉపేందర్, పెరుమాండ్ల జానీ పలువురు రైతులు పాల్గొన్నారు.

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ రాజిరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని మెటల్ కుంట గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్వేర్ లాల్ సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

#మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు.

#నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత విత్తనాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే దళారులు ఇష్ట రీతిన నిషేధిత విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నిషేధిత బీ టీ 3 విత్తనాలు వేయడం వల్ల రైతులు అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన చేయకపోవడంలో విఫలమైనరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారులు మారుమూల గ్రామాలలో విత్తనాలను డంపింగ్ చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు ఒక్కొక్క ప్యాకెట్ ధర 1500 చొప్పున విక్రయిస్తూ ఎకరాకు 2 ప్యాకెట్లకు గాని 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని విశ్వనీయ సమాచారం. అలాగే విడి విత్తనాలను కేజీకి 3500 ల చొప్పున రైతులకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

#కూలీల కలుపు ఖర్చు మిగులుతుందని.

 

cotton

బీటీ 3 పత్తి విత్తనాలతో ఆరోగ్యానికి హానికరం, భూమిలో భూసారం క్షీణించి పోతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీటీ-3 విత్తనాల అమ్మకాలు నిషేధించింది. కానీ బీటీ-3 విత్తనాలు మొలకెత్తిన తర్వాత కలుపు నివారణకై గడ్డి మందు పిచికారి చేసిన కూడా పంటకు ఎలాంటి నష్టం జరగదని దళారులు చెప్పడంతో రైతులు ఆ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని పంట దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదని రైతులకు దళారులు నచ్చజెప్పడంతో మండలంలో అధిక మొత్తంలో బిటి-3 విత్తనాలు రైతులు విక్రయిస్తున్నారు. బీటీ -2 విత్తనాలపై గడ్డి మందు (గ్లైబో సెట్) పిచికార్ చేస్తే పత్తి పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులకు దళారులు అవగాహన చేస్తూ నిషేధిత విత్తనాల వైపు రైతులను మళ్లిస్తూ అదేవిధంగా నిషేధిత గడ్డి మందు (గ్లైబోసేట్) ల సైతం గ్రామాలలో డంపు చేసి రైతులకు విక్రయిస్తూ దళారులు లక్షల సైతం దండుకుంటున్నారు.

#తనిఖీలు చేపట్టని వ్యవసాయ అధికారులు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ మండలంలో బీటీ-3 విత్తనాలు విక్రయాలు జరుగుతున్న విషయం జోరుగా ప్రచారం జరుగుతున్న సంబంధిత వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాలలో తనిఖీలు చేపట్టి బీటీ-3 విత్తనాల విక్రయాలను అడ్డుకట్ట వేసి నిషేధిత విత్తనాల వల్ల జరిగే అనర్థాలను రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

 

ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు. ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి.

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి.

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

 

వ్యవసాయ సీజన్ ఒక నెల ముందు ప్రారంభం కావడంతో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు నాణ్యమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచే రైతులను ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు కారేపల్లి మండలం టేకులగూడెంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ మహాసభలో ముఖ్యఅతిగా పాల్గొని ప్రారంభిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు పొద్దున లేస్తే రైతు గురించి రైతు సంక్షేమం గురించే మాట్లాడుతున్నారని రైతు సంక్షేమం గురించి పాలకులు ఉన్న ఈ దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతును వేధించటం సరికాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా లాంటి తదితర పథకాలను 100% అమలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు లక్షలాదిమంది ఆదివాసి గిరిజనులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న వేల ఎకరాలకు ఈనాటి కోడి భూములకు పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉందని ఆయన అన్నారు అనంతరం అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవల వెంకటేశ్వరావు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు వీలుగా అన్ని మండలాలలో గిడ్డంగులు నిర్మించాలని చెప్పి వారు కోరారు మోడీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ విధానం మొత్తం ప్రైవేటు వారి చేతుల్లోకి వెళుతుందని దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముందు రైతు సంఘం జెండాను జిల్లా కార్యదర్శి ఆవులు వెంకటేశ్వర్లు ఎగరవేయగా అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ సభలో రైతు సంఘం నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు కేలోతు లక్ష్మణ్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ ఝాన్సీ ప్రసంగించగా ఈ మహాసభకు గుగులోత్ తేజ నాయక్ అధ్యక్షత వర్గంగా వ్యవహరించగా నాయకులు రాకేష్ గుమ్మడి సందీప్ బిక్కసాని భాస్కర్ సత్తిరెడ్డి లక్పతి వీరబాబు మదర్ సాహెబ్ సక్రు నాగయ్య పాపారావు సరోజిని అనసూర్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ఖమ్మం డివిజన్ నూతన కమిటీని 17 మందితో ఎన్నుకోగా డివిజన్ అధ్యక్షులుగా ధరావత్ లక్ష్మణ్ కార్యదర్శిగా తేజ నాయక్ ఉపాధ్యక్షులుగా సత్తిరెడ్డి భాస్కర్ పుప్పాల రామారావు వీరబాబు లతో కూడిన 17 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.

అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.

భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.

మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..

ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.

శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

భూసమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అర్షణ పల్లి, రాంపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై 162 దరఖాస్తులను తహసిల్దార్ ముప్పు కృష్ణ నేరుగా స్వీకరించడమైనది అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అలాగే సాదా బైనామా, వారసత్వం, డిజిటల్ సంతకం పెండింగ్, దేవుని పట్టా, మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ సవరణ మొదలైన సమస్యలపై పరిష్కారం దిశగా భూభారతి పనిచేస్తుందని దానికి అనుగుణంగా రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి తగు సమయంలో వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ మెంబర్ జ్యోతి, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం…

రెవెన్యూ గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలి…

జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 288 రెవెన్యూ గ్రామాలు…

నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు…

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి – మహబూబాబాద్ :-

 

 

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం అని, రెవెన్యూ గ్రామసభలను భూ సమస్యలు ఉన్న రైతులు వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025,రెవెన్యూ గ్రామసభలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో నిర్వహించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దంతాలపల్లి మండలంలో ఇప్పటికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి
ఉదయం 9 నుండి 4 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే స్థానిక తహసీల్దారులు పూర్తిస్థాయిలో సంబంధిత రెవెన్యూ గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచినట్లు తెలిపారు.మహబూబాబాద్, సింగారం, నెల్లికుదురు మండలం, వావిలాల రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం రెవెన్యూ గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని దరఖాస్తుదారులకు ముందస్తు ఫారాలను ఇవ్వాలని వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి స్వీకరించాలన్నారు.సదస్సులలో ప్రత్యేక హెల్ప్ డిస్కులను ఏర్పాటు చేయాలన్నారు.

Farmers

 

 

వాటి ద్వారా దరఖాస్తుదారులకు తగు సూచనలు చేస్తూ దరఖాస్తులను పూరించుటకు సహకరించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. వీరబ్రహ్మచారి కురవి మండలం తిరుమలపురం, మొగిలిచర్ల, రెవెన్యూ గ్రామాలలో జరుగుతున్న సదస్సులను పరిశీలించారు.ప్రజలకు అనువైన ప్రదేశాలు గ్రామపంచాయతీ, రైతు వేదికలు,తదితర ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సదస్సులు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

రైతులకు అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం సూరం పేట గ్రామంలో రాష్ట్ర అవత రణదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

రైతులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత వానా కాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు మరియు నీటి యాజమాన్యం తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించడమైనది, అధిక రసాయనాలు వాడడం వల్ల నేల నీరు గాలి కాలుష్యంతో పాటు మానవుని యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది కనుక అధిక రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యకరమైన పంటను మనము తీసుకోవడానికి వీలవుతుంది, అధిక రసాయ నాలు వాడడం ద్వారా నేలలో చౌడు వచ్చే అవకాశం కూడా ఉన్నందున రసాయనలకు బదులుగా సేంద్రియ వ్యవసా య పద్ధతిలోగనుక మనం వ్యవసాయాన్ని కొనసాగించి నట్లయితే కొంతకాలానికి చౌడు దానంతట అదే తగ్గిపోయే అవకాశం కూడా ఉంది బల మైన నేలలున్న దగ్గర పంట కూడా బలంగానే ఉంటుంది, అందువల్ల బలమైన మొక్కలు ఉండే అవకాశం ఉంది కనుక నాణ్యమైన దిగుబడిని సాధిం చే అవకాశం ఉందని సూచిం చడం జరిగింది.

పురుగు మందుల పిచికారి సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది.పురుగు మందులు కూడా సిఫారసు మేరకే వాడాలని సూచించడం జరిగింది.

బయోమందులను ఎట్టి పరిస్థితులలో వాడరాదని తెలియజేయడం జరిగింది.

బయోమందులు వాడడం ద్వారా తాత్కాలికంగా మొక్క ఎదుగుదల కనపడినప్పటికిని తదుపరి పరిణామాలలో పురుగు ఉధృతి మరి ము ఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి పంటను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బయో మందులను రైతులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదని సూచించడం జరిగింది.

మరి ముఖ్యంగా రైతులు మొక్క జొన్న మరియు వరి మేల్ ఫిమేల్ పద్ధతిలో పంట పండిం చడం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

సదరు కంపెనీ దగ్గర తప్పనిసరిగా ప్రాపర్ అగ్రిమెంట్ అనేది తీసు కోవాలి.

అలాంటి పరిస్థితుల లో పొరపాటున ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు, దిగు బడులు తగ్గడం జరిగినప్పుడు కంపెనీ వారి నుండి నష్టపరి హారం పొందడానికి అవకాశం ఉంటుంది.

అగ్రిమెంటు తప్ప నిసరిగా తీసుకోవాలి, డీలర్ల దగ్గర కూడా కచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరనే విత్తనాలు కొనుగోలు చేయాలి, రసీదులను పట్టకాలమంతా కూడా భద్రపరచాలి.

 

తప్ప నిసరిగా రైతు తీసుకునే రసీ దు మీద షాపు యజమాని సంతకంతో పాటు రైతు సంత కం కూడా ఉండేలాగా చూసు కోవాలి.

తీసుకున్న రసీదులో విత్తనాలు,ఎరువుల పురుగు మందుల పూర్తిస్థాయి సమా చారం ఉండేలాగా చూసు కోవాలి తగు జాగ్రత్తలు తీసు కోవాలి.

మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి, తద్వారా భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా మనము ఎరువులు వేసుకో వడానికి అవకాశం ఉంది రైతులు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించడం జరిగింది.

అనం తరం ప్రజ్వల్ సంస్థ రైతుల కోసం తయారు చేసిన నవధాన్యాల మినీ కిట్స్ రైతులకు పంపిణీ చేయడం జరిగింది, నవధాన్యాల ద్వారా కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్, ప్రజ్వల్ సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కల్పన, రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురక్షరించుకొని

◆ జాతీయ పతాకాఆవిష్కరణ చేసినా

◆ జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. సాయి చరణ్

◆ డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, ఏఎంసీ.డైరెక్టర్లు,కండేం.సుజాత,శేఖర్ ముదిరాజ్,అఖిల్,జఫ్ఫార్,శంకర్ పాటిల్ , అంజాద్ ,నర్సింలు, కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్, నయుంభాయ్, హగ్గెల్లి రాములన్న గారు, శుక్లవర్ధన్ రెడ్డి, మొయిజ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, INTUC (F) రాజ్ కుమార్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఏవో గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగా జమున తనిఖీ చేయడం జరిగింది. అందులో లైసెన్స్ మరియు పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం చేయకూడదని సూచించడం జరిగింది, రిజిస్టర్లు బిల్లు బుక్కులను మరియు రైతు వారిగా విక్రయాల వివరాల తోకూ డినటువంటి రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించడం జరిగింది, రైతులు అధికృత డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి,బిల్లు రసీదులను కచ్చితంగా తీసుకోవాలి, రసీదుల మీద షాపు యజమాని మరియు రైతు యొక్క సంతకం తప్పని సరిగా ఉండాలి. ఈ యొక్క బిల్లును రైతులు పంట కాలం అయిపోయే వరకు కూడా భద్రపరుచుకోవాలని సూచిం చడం జరిగింది. రైతులు తమకు నచ్చిన రకాన్ని ఎంచుకొని సాగుచేసుకొ నవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version