బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.

ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,

ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో

 

Sports

 

 

ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు

ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా

కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

 

తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహిచడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ వారు జూన్ 2 నుండి ఆన్లైన్ లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ చెల్లింపులకు స్లాట్ బుకింగ్ కు సంబంధించి కేవలం ఒక్క రోజులోనే 48 స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని.

Slot Booking.

 

బుక్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ స్లాట్ నిర్దిష్టమైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని జూన్ 2 నుండి అమలు కానున్న సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రకటన ద్వారా సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్.వి.వి. స్వామి తెలిపారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు ఎవ‌రిదంటా గురువు గారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు.. ఎవ‌రిదంటా గురువు గారు

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.

 

నేటి ధాత్రి:

Rashmika Mandanna
Rashmika
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక (Rashmika Mandanna) మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది.
అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.
త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, తాజాగా ఎల్లో శారీలో దిగిన ఫొటోలు వాటి గురించి ర‌ష్మిక చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) ల‌వ్‌లో ఉన్నారు..
ఏ క్ష‌ణంలోనైనా పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే వార్త‌లు ఎలాగో ఉన్నాయి.
అంతేగాక‌ త‌రుచూ ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేకుండా ఒకే లొకేష‌న్‌ ఫొటోలు షేర్ చూస్తూ నెటిజ‌న్ల‌కు దొరికి పోతుంటారు.
తాజాగా ఇలాంటి ఫొటోలే మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి.
రీసెంట్‌గా ర‌ష్మిక (Rashmika Mandanna) ప‌సుపు ప‌చ్చ చీర ధ‌రించి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌ల సినిమా లాంచింగ్‌కు ముఖ్య‌ అతిథిగా హ‌జ‌రైన‌ సంగ‌తి విధిత‌మే.
ఆపై ఆదే చీర‌పై ఫొటోషూట్ చేయుంచుకున్న ర‌ష్మిక ఈ ఫొటోల‌లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి.
Rashmika
ఇష్టమైన రంగుల చీర, గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ లేడీ, ఈ ఫొటోలు తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇంకేముంది విజ‌య్ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) అభిమానుల‌తో పాటు చాలామంది త‌మ బుర్ర‌ల‌కు, త‌మ అకౌంట్ల‌కు ప‌ని చెప్పి సోష‌ల్ మీడియాల్లో త‌మ స్టైల్ క్రియేటివిటీలతో హాల్‌చ‌ల్ చేశారు.
ఆ ఫోటోలు విజ‌య్ ఇంట్లోనే దిగిన‌వ‌ని, వాటిని విజ‌య్ స్వ‌యంగా తీశాడ‌ని, ఆ చీర‌ను విజ‌య్ అమ్మ‌గారు బ‌హూమ‌తిగా ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.
గ‌తంలోనూ ఆ ఫొటోలో ఉన్న‌ బ్యాగ్రౌండ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం క‌లిసి దిగిన ఓ పాత‌ చిత్రం ఉండ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. ఇక‌నైనా విజ‌య్‌, ర‌ష్మిక‌లు త‌మ రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని, ఇంకా ఎన్నాళ్లు దాచుతారంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రి మండలంలోని మామిడి గట్టు గ్రామ శివారులో గత వారం పది రోజుల నుండి ఈదురు గాలులకు ఒక చెట్టు వేర్లతో సహా విద్యుత్ వైర్లపై పడింది..
అయితే దానిని సదరు విద్యుత్ అధికారులు మరియు చుట్టుపక్కల వారు చూసి చూడనట్లుగా వెళుతున్నారు.. ఆ విధంగా ఆ విద్యుత్ తీగలపై ఆ చెట్టు ఒరిగి ఉన్నా సరే విద్యుత్ అధికారులు ఆ లైన్ గుండానే విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చి ఆ తీగలు తెగితే ఆ దారి గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులకు కచ్చితంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది….
కావున
సదరు విద్యుత్ అధికారులు వెంటనే పై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు.

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా ఎమ్మెల్యే గారు

మూడు నెలల్లో ఓపెనింగ్ అంటిరి

ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

చెన్నూరు శాసన సభ్యులుగా ఎన్నికైన అనంతరం మందమర్రి మార్కెట్ లో గల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం గత సంవత్సరం జనవరి 21వ తేదీన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు టాయిలెట్స్ కి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన మీరు టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని ప్రశ్నించారు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
వెంటనే టాయిలెట్స్ పనులు పూర్తి చేసి ప్రజ వినియోగంలోకి తేవాలన్నారు, లేనియెడల మందమర్రి పట్టణ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న MLA TSS CCDC.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చీలేపల్లి గ్రామం మహ్మద్ హుస్సేన్ కుమారుడు మహ్మద్ ఆరిఫ్ వివాహా వలిమా వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,
మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాగన్న, శేషి వర్ధన్ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సిద్దప్ప,అక్బర్ సహబ్, సభహ ,గ్రామ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ రాజు,మల్ రెడ్డి,నబి సాబ్, చెంగల్ జైపాల్,మహ్మద్ అక్రమ్,మహ్మద్ హుస్సేన్,ఖాజామియా,మహ్మద్ ఆషిఫ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి.

— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి
• వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం
• సైంటిస్ట్ చిన్నబాబు నాయక్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే రోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పురుగులు నారిమడి పోసినప్పుటి నుండి వరి ఆకులపై గుడ్లను పెట్టి వాటి ఉత్పత్తిని పెంచుకుంటుందన్నారు. వాటి నివారణకు మందులను వాడాలని సూచించారు. వానపాము ఎరువుల ద్వారా వరి పంట అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎరువులపై కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పరిధిలోని కూలీ, సమయం తగ్గించే విధంగా డ్రోన్ సహాయంతో మందును పిచ్కారి చేయవచ్చన్నారు. డ్రోన్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు ఊడెడు రాజయ్య, కూడవెల్లి చంద్రం, ఊడెపు శ్రీశైలం, కోమ్మిడి రాజు, బురాని మల్లేశం, మంగలి అమర్, మ్యాదరి కనకరాజు, సౌడ స్వామి, పాతూరి రాంరెడ్డి, రాకేష్, వేణు తదితరులు ఉన్నారు.

వలిమా వేడుక లో పాల్గొన్న TGIDC.

వలిమా వేడుక లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల్ చిల్లపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ గారి వలిమా వేడుకలో పాల్గొని వరుడునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వారితోపాటు మాజీ ఎంపిటిసి ఆఫీస్ కీజర్ ఖాన్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ మోయిన్ మాణిక్ రెడ్డి మొహమ్మద్ ఏజాబ్ బాబా గోవర్ధన్ రెడ్డి జఫర్ అసద్ మతిన్ తదితరులు ఉన్నారు.

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మద్యం కోసం తాకట్లు….

మద్యం కోసం తాకట్లు….

◆ రూపాయిలు. 200 రూపాయిలు . 2000 వసూలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వింత దోపిడీ జరుగుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు తమ వద్ద డబ్బులు లేకపోతే వాచ్లు, చైన్లు, ఉంగరాలు, మొబైల్ ఫోన్లను తాకట్టుపెడుతున్నారు. అయితే, రెండు రోజుల్లో వాటిని విడిపిం చుకోకపోతే, రూ. 200 విలువైన మద్యం కోసం తాకట్టు పెట్టిన వస్తువుకు ఏకంగా రూ. 2000 డిమాండ్ చేస్తున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా ఉన్న స్నాక్స్ షాపులు, ఇతర దుకాణాల్లో ఈ తరహా దోపిడీ ఎక్కువగా జరుగుతోందనే ఆరోప ణలు ఉన్నాయి. వైన్స్ పర్మిట్ రూముల్లో కూర్చుని మద్యం తాగిన తర్వాత, మరికొంత మద్యం తాగేందుకు డబ్బులు లేని వారు తమ వస్తువులను తాకట్టు పెడుతున్నారు. మరుసటి రోజు వాటిని విడిపించుకోవడానికి వెళ్లే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైన్స్ దుకాణదారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది.

అబ్కారీ సీఐ ఏమన్నారంటే..

CI Srinivas Reddy

 

 

వైన్స్ దుకాణాల్లో నగదు లేదా పేటీఎం ద్వారామాత్రమే మద్యం విక్రయించాలని జహీరాబాద్ అబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైన్లో గానీ, వాటికి అనుబంధంగా ఉన్న షాపుల్లో గానీ వస్తు వులు తాకట్టు పెట్టుకుని మద్యం ఇచ్చిన ట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

బక్రీద్ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో “పీస్ మీటింగ్”ఏర్పాటు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్, ఆధ్వర్యంలో జరిగిన “పీస్ మీటింగ్”నకు ఝరాసంగం లోని హిందూ,ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై నరేష్, మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు.దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని అన్నారు. ప్రజా భద్రత, లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు,ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఝరాసంగం ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి,అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని కోరారు.

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ.

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున ఉదయం చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో డాక్టర్ జనపాల శంకరయ్య విరచితమైన (మచ్చలేని మహనీయులు పుస్తక ఆవిష్కరణ )ఘనంగా జరిగినది ఈ సందర్భంగా ఆకునూరి పూర్వ గ్రంథాలయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ పిల్లల కోసం మహనీయుల చరిత్రలు రాయడం శుభదాయకం అన్నారు ముఖ్యఅతిథి మాట్లాడుతూ పిల్లలు కేవలం సెల్లుకు బానిసలు అవుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం మార్గదర్శకంగా చిన్న చిన్న పదాలతో రాయడం సృజనాత్మకవుకు నిదర్శనం అన్నారు అంతేకాకుండా చందమామ కోరస్ లో చక్కని కథా గేయంగా మలచడం భవిష్యత్తులో మంచి పేరు ఉంటుందని ఆశించారు.

 

Book launch

 

 

 

పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య ,జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య ,గీతా ప్రచార సమితి అధ్యక్షులు కోడం నారాయణ, వ్యాపార సంఘం అధ్యక్షులు పాములకు పత్తి దామోదర్ , కార్యదర్శి గౌడ రాజు ,ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, జిల్లా కవులు, రచయితలు బూర దేవానందం, అంకారపు రవి, మల్లేష్ చక్రాల,సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాసు బంధు వర్గం ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి 50 సంవత్సరాల పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగినది

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు.

◆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నుండి భరత్ నగర్ ,అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & అండ్ బి ఈఈ , సీఈ తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు ,కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఏవో గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని గల సాయి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును మండల వ్యవసాయ అధికారి గంగా జమున తనిఖీ చేయడం జరిగింది. అందులో లైసెన్స్ మరియు పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు, లూజుగా అమ్మే విత్తనాలను వ్యాపారం చేయకూడదని సూచించడం జరిగింది, రిజిస్టర్లు బిల్లు బుక్కులను మరియు రైతు వారిగా విక్రయాల వివరాల తోకూ డినటువంటి రిజిస్టర్లను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించడం జరిగింది, రైతులు అధికృత డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి,బిల్లు రసీదులను కచ్చితంగా తీసుకోవాలి, రసీదుల మీద షాపు యజమాని మరియు రైతు యొక్క సంతకం తప్పని సరిగా ఉండాలి. ఈ యొక్క బిల్లును రైతులు పంట కాలం అయిపోయే వరకు కూడా భద్రపరుచుకోవాలని సూచిం చడం జరిగింది. రైతులు తమకు నచ్చిన రకాన్ని ఎంచుకొని సాగుచేసుకొ నవచ్చు, మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో జూన్ 2న నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.

Collector

 

వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏ ఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version