బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T125252.744.wav?_=1

 

బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ,

◆:- మండల ప్రజలకు 14 సంవత్సరాలు సేవలందించిన హోంగార్డ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా పనిచేసి సంగారెడ్డి బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ, పోలీస్టేషన్ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్తలు పూజారులు శాలువా పూలమాలతో సత్కరించి సంగమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు.

దారూర్ జాతర భక్తులకు యువకుల అన్నదానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T124532.135.wav?_=2

 

 

కాలి నడకన దారూర్ జాతర వెళ్తున్న భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యువకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నుండి దారూర్ జాతరకు కాలి నడకన వెళ్తున్న భక్తులందరికీ బంటారాం గ్రామం వద్ద జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు . పాదయాత్ర గా వెళ్తున్న వారికి మార్గ మధ్యలో భోజనానికి మంచి నీళ్లకు ఇబ్బంది కలగకుండా భోజనాలు పండ్లు మంచి నీళ్లు సౌకర్యం అందుబాటులో పాదయాత్రగా వెళుతున్న భక్తులకు ఇబ్బందులు కలగాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు, దారూర్ వెళ్లే భక్తులను జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాల సంతోషంగా జీవించాలని దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు,
ఈ కార్యక్రమంలో తిమోతి, ప్రభాకర్, వినోద్ భాను, భాస్కర్, యువరాజ్ రాజు తదితరులు పాల్గొన్నారు,

ప్రజలను మోసం చేస్తున్న జహీరాబాద్ రిలయన్స్ మార్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T123637.749.wav?_=3

 

ప్రజలను మోసం చేస్తున్న జహీరాబాద్ రిలయన్స్ మార్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రిలయన్స్ మార్ట్ వినియోగదారుల ఆరోపణలు మరోసారి రిటైల్ రంగంలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తాయి.ఆఫర్ల పేరుతో అసలు ఎం.ఆర్.పి నే వసూలు చేస్తున్నట్లు కస్టమర్లు గుర్తించడం, అనంతరం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఇవి పెద్ద రిటైల్ చైన్లలో కొనసాగుతున్న ధరల్లో అనిబంధితుల దందాకు స్థానిక ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలో ఇటీవలి సంవత్సరాల్లో ఫుడ్ అండ్ కన్జ్యూమర్ సేఫ్టీ విభాగం పలు మార్ట్లపై జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయిబీ అయినప్పటికీ, బిల్లింగ్ పారదర్శకత, ఎంఆర్పీ అమలు, ఆఫర్ క్లెయిమ్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ మేనేజర్ తప్పును ఒప్పుకోవడం సమస్య యొక్క తీవ్రతను సూచించినప్పటికీ, ఇది వ్యవస్థాగత లోపాలను సరిచేయడానికి సరిపోదు. స్థానిక వినియోగదారులు, పౌరసంఘాలు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.
రిలయన్స్ మార్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలి, కేసు నమోదు చేయాలని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మహిపాల్.రిలయన్స్, ఇతర పెద్ద పెద్ద మార్ట్ లలో మోసాలను ప్రజలు గమనించి లోకల్ కిరణా షాపులను ప్రోత్సహించాలన్నారు,

వండర్ మెమొరీ కిట్ అవార్డు అందుకున్న ఈశాన్వీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T121910.288.wav?_=4

 

వండర్ మెమొరీ కిట్ అవార్డు అందుకున్న ఈశాన్వీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన డాక్టర్ భీమగాని స్పందన గోపీచంద్ దంపతుల కుమార్తె ఈశాన్వీ కి వండర్ మెమోరీ కిడ్ అవార్డ్ కు ఎంపికైనారు అనంతరం వారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈశాన్వీ

తల్లిదండ్రులు మాట్లాడుతూ హైదరాబాదులో చిల్డ్రన్స్ డే సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో మా కూతురు ఈశాన్వీ కి వండర్ మెమొరీ కిడ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని ఉన్నంతమైన స్థానాలకు ఈశాన్వీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ఈ అవార్డు ప్రదానం చేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య కు వినతి పత్రం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T121459.235.wav?_=5

 

సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య కు వినతి పత్రం

భూపాలపల్లి జిల్లాకు డిటిడిఓ అధికారిని నియమించాలి

పోలం రాజేందర్
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాదులో సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ శ్రీ దివ్య దేవరాజన్ వినతి పత్రం ఇచ్చిన
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్
ఈ సందర్భంగా పోలం రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుమారు యాభై వేలకు పైగా ఆదివాసి గిరిజన లు ఉన్న జిల్లా ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు గిరిజన అభివృద్ధి కార్యాలయం కేటాయించి అధికారిని నియమించలేదంటే ఆదివాసులు లేరనుకుంటుందా లేదా పాలకులు వివక్ష చూపుతున్నారా అని ప్రశ్నించారు,అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నిజకవర్గం పరిధిలోని మహదేవపూర్, పలిమేల, కాటారం,మల్హరావు, మహా ముత్తారం మండలాల ఆదివాసులకు మహదేవపూర్ కేంద్రంగా ఉన్న మాడ కార్యాలయం సేవలందించింది అట్టి కార్యాలయాన్ని జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ ఐదు మండలాలను భూపాలపల్లి, ములుగు ప్రాంతాన్ని కలిపి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటుచేసి ఒకే జిల్లాలో రెండు గిరిజన అభివృద్ధి కార్యాలయాలు ఉండవని ఎత్తివేయడం జరిగిందన్నారు, మళ్ళీ ములుగు ప్రాంతాన్ని సపరేటు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మాడ కార్యాలయం కేటాయించి సేవలందించాలనే సోయి లేకుండా పోయిందన్నారు,ఆతరువాత మంత్రిగారు గిరిజన దర్బారు పెట్టి కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తాము అన్నారే తప్ప ఇప్పటి వరకు అతిగతి లేదన్నారు,అదేవిధంగా ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్లకు ఐడిఎం
రీజనల్ మేనేజర్ కు,జిల్లా కలెక్టర్ కి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పలితం లేకపోవడం వల్లనే సీఎం ప్రజావానికి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు,ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గిరిజన అభివృద్ధి కార్యాలయం కేటాయించి, డిటిడిఓ నీ నియమించాలని మాడ కార్యాలయానికి ఏపీఓ నీ నియమించాలి రైతులందరికీ పంట రుణాలు అందించాలని లేని యెడల పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాగాల రాజన్న ఏర్మ పున్నం, కొమరం భీం జిల్లా అధ్యక్షురాలు కోరింగ మాలాశ్రీ తదితరులు పాల్గొన్నారు

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T120933.523.wav?_=6

 

 

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం

ప్రజలు మద్దతు ప్రజా ప్రభుత్వం వైపే

సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు,సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరో అద్భుత విజయాన్ని అందుకుందని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేక పోయారని అన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం,సమాగ్ర హక్కులు సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నవీన్ యాదవ్ గెలుపు ప్రజల విజయమని అన్నారు.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజ బాబు అధ్యక్షతన నిర్వహించిన 58 వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ప్రతీ విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్‌ఫోన్‌ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరి చేస్తామని,అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు 10 లక్షల రూపాయలు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోటా రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్…

మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు స్పెషల్ ట్రైనింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా సమైక్య ఆఫీస్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ సభ్యులకు కోకో కోలా కంపెనీ నిర్వాహకులు కృష్ణ రుచికరమైన వంటలు, చేవట్ట విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ అధికారి హమీద్, ట్రైనర్ సుజాత, పీఎం నాగరాజు, డీపీఎం రాము, ఏపీఎం సమత పాల్గొన్నారు. జహీరాబాద్, ఝురసంగం, ఇస్నాపూర్, సంగారెడ్డి టౌన్, పత్తూర్లలో కొనసాగుతున్న క్యాంటిన్ల సభ్యులకు ఈ శిక్షణ అందించారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ సెంటర్ దోమల యశోద, టు సెంటర్ జి లలిత.ఆయా పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి.

కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి.

#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి .
నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

కపాస్ కిసాన్ యాపను రద్దుచేసి ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తేమ పేరుతో ఆంక్షలు విధించకూడదని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రైతు సంఘ నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కుమారస్వామి మాట్లాడుతూ 1970లో ఏర్పాటు చేసిన సీసీఐ రైతు పండించిన పత్తిని కొనుగోలు చేస్తూ వస్తున్నది . మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చే ప్రయత్నం చేయడంతో రైతాంగం చేసిన తీవ్రమైన ప్రతిఘటనతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించినప్పటికీ రైతాంగం మీద కుట్రలు చేస్తూనే ఉన్నది అన్నారు. ఓపెన్ మార్కెట్లో పత్తి నీ అమ్ముకోకుండా కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైతాంగం స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ లో చూపించిన తేదీ సమయం ప్రకారం ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే అమ్ముకునే నిబంధనలు విధించడం ఎనిమిది శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ధరలో తేడాలు ఉంటాయని పేర్కొనడం రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. కౌలు రైతులు పేద సన్నా చిన్నకారు రైతులు ఈ అకాల వర్షాలకు పంటలతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి రానీ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు మండలంలో ఇప్పటివరకు అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం యొక్క పంట వివరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు కనీసం ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైతాంగానికి అండగా నిలవాలన్నారు లేనిచో రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేయడం తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జన్ను జయరాజు సిపిఎం పార్టీ మండల నాయకులు బొడిగె సమ్మయ్య , గోనె సంజీవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు నష్టపరిహారం ఇప్పించండి…

ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లకు నష్టపరిహారం ఇప్పించండి…

శాంతినగర్ కాలనీవాసులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఫోర్ గడ్డ శాంతినగర్ కాలనీ సమీపంలో రామకృష్ణాపూర్ ఉపరితల గని రెండో దఫ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3 రోజున ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న సందర్భంగా శాంతినగర్ కాలనీవాసులు తమ అభిప్రాయాలను ముందస్తుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ లకు కాలనీవాసుల అందరి సంతకాలు సేకరించి వినతి పత్రాలు అందించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడారు. మొదటి దఫా పనులు జరిగిన సందర్భంగా బాంబు బ్లాస్టింగ్ లతో కాలనీలలోని ఇల్లుల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలంతా అనారోగ్య బారిన పడ్డారని తెలిపారు. మళ్లీ రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం కేటాయిస్తే కాలనీ నుండి వెళ్లిపోతామని కలెక్టర్, ఆర్డిఓ ,మున్సిపల్ కమిషనర్, జిఎం లకు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు..

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు

విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి

తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొందరు తమ ఇండ్లను స్వచ్ఛందంగా ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా తమ ఇండ్లను కులగోట్టుకున్నారని వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పానగల్ రోడ్డులో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో రోడ్ల విస్తరణ కొరకు నిధులు మంజూరు చేయించారని రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేయించారని గుర్తు చేశారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు స్పందించి కర్నూల్ రోడ్ పాన్ గ ల్ ల రోడ్డు చిన్నగా ఉండడంవల్ల వెంటనే కులగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు . రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు . వనపర్తి జిల్లా కేంద్రం విస్తరించి పోయిందని ప్రతి ఇంట్లో కార్లు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల నడపడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు స్వచ్ఛందంగా పానగల్ రోడ్డు కర్నూల్ రోడ్డు లో రోడ్ల విస్తరణ కొరకు ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా కుల గోట్టుకున్నందుకు వారికి వనపర్తి ప్రజల తరఫున కొత్త గొళ్ల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు https://cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు…

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు

అభివృద్ధికి డోకా లేదు

ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు…

పరకాలలో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు

రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి..

ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్

గుండాల,నేటిదాత్రి:

 

గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ముఖ్య నాయకుల సమావేశం పూనెం రమణ బాబు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి సి దొర పాల్గొని మాట్లాడుతూ గుండాల మండల కేంద్రం లొకి 1970 తర్వాత నుంచి నేటి వరకు విచ్చలవిడిగా వలస గిరిజనేతరలు వస్తున్నా కానీ స్థానిక పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి కొరకు మీరు ఇక్కడి నియమించబడ్డారు అని తెలుసుకోవాలని అన్నారు.
నేటి తెలంగాణకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుల రాష్ట్రాల నుంచి మరియు తెలంగాణలోని మైదన ప్రాంతాల నుంచి గిరిజనేతరులు మరియు లంబాడీలు గుండాలకు విచ్చలవిడిగా 1/70 చట్టానికి విరుద్ధంగా వలసలు వచ్చి, ఏదేచ్చగా అధిక ధరలు వెచ్చించి భూములు కొని,
బహుళ అంతస్తులు నిర్మించుకొని వ్యాపారాలు,వడ్డీ వ్యాపారాలు యదేచ్ఛగా చేస్తున్న కానీ పంచాయితీ అధికార్లు కాని రెవిన్యూ అధికార్లు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ 1/70 చట్టం ఉందా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.గుండాల మండల పరిధిలోని వలస గిరిజనేతరుల ఆదీనంలో ఉన్న భూలను ప్రభుత్వం వెంటనే హస్తంగతం చేసుకొని,ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి,బహుళ అంతస్తులు వ్యాపార గిడ్డంగులను నేలమట్టం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
దీని కొరకు వచ్చే నెల డిసెంబర్ 2న గుండాల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయాలి అని సన్నాహక సమావేశం నిర్వహించారు. దానికి ఆదివాసులు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లొ ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పెండెకట్ల మహేష్,గోగ్గేలా సుధాకర్,పూనెం వసంత్,
జబ్బ సుధాకర్ ,తాటి పాపారావు,తెల్లం కిరణ్, చీమల ప్రశాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ లో నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టిన దినోత్సవం సందర్భంగా బాలల దినోత్సవం విద్యార్థినీ విద్యార్థులు చాచా నెహ్రూ వేశాధారణ లో పాల్గొని ఆటపాటలతో మరియు ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు వి శ్వేత ఉపాధ్యాయులు సాయి కుమార్ పవన్ కుమార్ మల్లయ్య ఈశ్వరమ్మ సుస్మిత నాగజ్యోతి స్రవంతి మరియు పాఠశాల కరస్పాండెంట్ బి నాగన్న గారు పాల్గొన్నారు,

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి శుద్ధి కార్యక్రమం గత మూడు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది మూడవరోజు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పాల్గొన్నారు.ముందుగా శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొని కాసేపు మట్టికుప్పల తట్టలు మోశారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలిరావడం శుభపరిణామం వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి పరిరక్షణ కోసం ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి కాపాడుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని వారసత్వ సంపదలు మన సంస్కృతికి సాంప్రదాయానికి మూల స్తంభాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని ఇంతటిపాల్గొన్నారు. మాహాత్కార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివయ్య కృపను పొందాలని ఇకపై తరచూ గచ్చుబావిని సందర్శిస్తుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version