పుస్తకాలతో జ్ఞానం సంపాదించుకోవచ్చు

పుస్తకాలతో జ్ఞానం సంపాదించుకోవచ్చు

నర్సంపేట,నేటిధాత్రి:

 

సంపాదించగలుగుతామన్నారు.ఎంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త కొత్త పరికరాలు వచ్చిన పుస్తకాలకు సాటిరావని, ప్రాచీన కాలం నుంచి నేటితరం వరకు పుస్తకాలకున్న ప్రాధాన్యత ఎవరు తగ్గించలేదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్,సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కెవి చలపతిరావు,సీనియర్ ఫ్యాకల్టీ పి. వాసుదేవరావు తెలిపారు.నర్సంపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంబించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించారు.వారు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయాలను సందర్శించడం ద్వారా గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని తమ భవిష్యత్తు కొరకు సోపానాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసామని విద్యార్థులు ఉపయోగించుకుని ప్రపంచంలో ఉన్న నలుమూలల జ్ఞానాన్ని పొంది ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థి దశ నుంచి పుస్తకాల పఠనం అలవర్చుకోవాలని అప్పుడే ఉన్నత స్థానానికి ఎదగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ ఆర్.గణేష్,ఎ. లావణ్య పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయగా అధ్యాపకులు,విద్యార్థులు పుస్తకాల ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజ బాబు అధ్యక్షతన నిర్వహించిన 58 వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ప్రతీ విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్‌ఫోన్‌ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరి చేస్తామని,అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు 10 లక్షల రూపాయలు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోటా రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version