నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం
ప్రజలు మద్దతు ప్రజా ప్రభుత్వం వైపే
సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్
పరకాల,నేటిధాత్రి
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు,సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరో అద్భుత విజయాన్ని అందుకుందని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేక పోయారని అన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం,సమాగ్ర హక్కులు సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నవీన్ యాదవ్ గెలుపు ప్రజల విజయమని అన్నారు.
