జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు…

జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామంలో 2018 మరియు 2020లో జైనులకాలం నాటి పార్శానాథుడు, వృషభనాథుడు విగ్రహాలు బయటపడ్డయి. అప్పటి జిల్లా కలెక్టర్ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి వాటిని అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయితీ ఆదినంలో భద్రపరచవల్సిందిగా తెలిపారు. కాని ఇప్పుడు వాటికి సరైనా భద్రత కలిపించక పోవడంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆలయం నిర్మించి, భద్రత పెంచవల్సిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

వారసత్వ సంపదలను కాపాడుకోవడం మన బాధ్యత- తల్లోజు ఆచారి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి శుద్ధి కార్యక్రమం గత మూడు రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది మూడవరోజు మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి పాల్గొన్నారు.ముందుగా శివాలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో పాల్గొన్న అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొని కాసేపు మట్టికుప్పల తట్టలు మోశారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన తల్లోజు ఆచారి కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా తరలిరావడం శుభపరిణామం వారసత్వ సంపద అయినటువంటి గచ్చుబావి పరిరక్షణ కోసం ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి కాపాడుకోవాలనే ఆలోచన చాలా గొప్పదని వారసత్వ సంపదలు మన సంస్కృతికి సాంప్రదాయానికి మూల స్తంభాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని ఇంతటిపాల్గొన్నారు. మాహాత్కార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శివయ్య కృపను పొందాలని ఇకపై తరచూ గచ్చుబావిని సందర్శిస్తుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version