కేసముద్రంలో వసంత పంచమి ఉత్సవాలు

వసంత పంచమి… శ్రీ సరస్వతీ మాత పూజా అభిషేకం

చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం

కేసముద్రం/ నేటి ధాత్రి

సమత ఇంటిగ్రేటెడ్ ప్లేవె స్కూల్ నందు వసంత పంచమి పునరస్కరించుకొని శ్రీ సరస్వతి మాత పూజ అభిషేకం మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరామయ్య ఆచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు మరియు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నారులు, స్కూల్ పిల్లలు సరస్వతి మాత శ్లోకాలు వల్లవేస్తూ సరస్వతి మాత గేయాలనుపాడడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాణాల నాగరాజు మాట్లాడుతూ సరస్వతి మాత కృపా కటాక్షాలు ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. దీంతోపాటు ఈ సంవత్సరం నర్సరీలో అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని తెలపడం జరిగింది. కావున ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా యాజమాన్యం కోరుకుంది. ఈ కార్యక్రమంలో పండితుల కరుణాకర్ రావు,బేబీ సరోజినీ, అల్లం జ్యోతి, ముత్యాల ప్రజ్ఞ శ్రీ,, లలిత పద్మ,సిమ్రాన్ , భాగ్యలక్ష్మి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షర ద స్కూల్ ,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల విద్యకోసం ఎనలేని కృషి చేసారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జయంతిని మహిళా టీచర్స్ డే గా నిర్వహించడం చాలా గొప్పన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ,సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆర్.జ్యోతి గౌడ్,జి. భవాని,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఏర్పాటు చేసి విద్యార్థు. మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠశాలల్లోని కొన్ని కొన్ని సబ్జెక్టులు తీసుకొని పాఠశాలలోని తరగతులకు ఉపాధ్యాయులై పాఠశాల బోధనలు చేయడం జరిగింది అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version