నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు.

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు
మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

 

జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
కోరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కోరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలికి ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెట్ పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు అనంతరం
ఆర పేటలో వై కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాలలా గర్జనలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సభ్యులు కీ”శే” గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి
విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.

కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .

వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ ను పునః ప్రారంభించిన ఉప్పల్ శాసన సభ్యులు.

* మలబార్ గోల్డ్ & డైమండ్స్ ను పునః ప్రారంభించిన ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి

కాప్రా నేటిధాత్రి 04:

 

 

 

డీ యర్ ఏఎస్ రావు నగర్
లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్బార్ గోల్డ్ & డైమండ్స్ షో రూమ్ ప్రారంభోత్సవం నకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

BRS party leaders Bandari Lakshma Reddy.

 

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
కరోనాకాలం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధాని మోదీ
కృతజ్ఞతలు తెలిపిన ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు ప్రణయ్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సందర్భంగా భాజాపాయనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్షాకాల దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి చేయడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు ప్రణయ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు మరియు రేషన్ బియ్యం తీసుకున్న పేద మహిళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కరోనాకాలం నుండి దాదాపు నాలుగు ఏళ్లుగా ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు, మోడీజీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పేదల పక్షపాతిగా అనిపించుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కోట కిరణ్ కుమార్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తాటికాయల ఆనందం, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, మాదాసు వేణు, కట్ట విజయ్, మహేష్, లెనిన్, శివమణి, తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా ఇటీవల విధుల్లో చేరిన పట్టణ సి.ఐ రఘుపతిరెడ్డి ని స్థానిక స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు.ఈ సందర్బంగా సి.ఐ మాట్లాడుతూ స్వచ్చంధంగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు తమ వంతు పోలీస్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో ప్రతిభా సంస్థ నిర్వాహకులు, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వచ్చంధ వాలంటీర్ కాసుల వెంకటాచారి, గన్ మెన్ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కవి రచయిత మ్యాదరి సునీల్ మాట్లాడుతూ గద్దర్ అవార్డులలో తెలంగాణ సినిమాకు ఆన్యాయం జరిగిందని పులి అమృత్ నిర్మించిన సలాం హైదరాబాద్ సినిమాకు ఆన్యాయం జరిగిందని తెలంగాణ సినిమా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొడ్యూసర్, దర్శకులు రచయిత పులి అమృత్ సలాం హైదరాబాద్ సినిమా పాటల రచయిత మ్యాదరి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు, సలాం హైదరాబాద్ సినిమా పై వరకు వెళ్లి పైనల్ గా ఈ సినిమాను పక్కన పెట్టి ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది గద్దర్ భావజాలానికి విరుద్ధమని అమృత్ మాట్లాడుతూ ఈ సలాం హైదరాబాద్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసిన కవి రచయిత మ్యాదరి సునీల్ కి గద్దర్ అవార్డు వచ్చే అవకాశం ఉండని ఇందులో నటి నటులకు కూడా అవకాశం ఉండని పులి అమృత్ అన్నారనితెలంగాణ చరిత్ర తెలువని వారికి జ్యూరీ చైర్మన్ల అని వెంటనే తెలంగాణ చరిత్ర తెలిసిన అటువంటి మేధావులను జ్యూరి మెంబర్ గా ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాలను బ్రతకనివ్వండి అని సునీల్ తెలిపారు.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.

CM Revanth Reddy.

 

 

 

మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.

పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.

విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.

ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్ ఏకగ్రీవం.

బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్ ఏకగ్రీవం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భూపాలపల్లి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడు నూతల నిషిదర్ రెడ్డి, మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి ఆదేశాల మేరకు చిట్యాల మండలం బిజెపి నూతన కమిటీ ప్రకటించడం జరిగింది ఉపాధ్యక్షులుగా మాచర్ల రఘు
నల్ల శ్రీనివాస్ రెడ్డి.సుదగాని శ్రీనివాస్.చింతల రాజేందర్ ప్రధాన కార్యదర్శ గా మైదం శ్రీకాంత్ రావుల రాకేష ఎన్నికైనారు,
కార్యదర్శులుగా కుసుంబసుందర్, చిన్నవేణి సంపత్, అనుప మహేష్, వల్లాల నిరోషా,కోశాధికా: పెరుమాండ్ల అనుష
మండల కార్య వర్గసభ్యులుగా
గాజా నరేష్, ఉమ్మనవేణి రాజేష్ ,బుర్ర తిరుపతి, గుగులోతు వెంకన్న, గజనాల రవీందర్, ఓదెల శ్రీహరి ,బావు బుగులయ్య, రాకేం రాజేందర్, మల్లవేని రమేష్ ,సదా సదానందం, మార్తా అశోక్, గుర్రపు రవీందర్, బుర్ర సాంబయ్య ,పంచిక స్రవంతి, రాయిని మమత ,మైదం శ్రావ్య, జరుపుల కరుణ, గుగులోతు విజేందర్,లావుడియా రాజు, శ్యామల వెంకటేశ్వర్లు, కొడిమాల సారంగపాణి ,పాలకుర్తి బిక్షపతి ,మహేందర్ ,కింసారపు సంధ్యారాణి, తుమ్మల రాజు*లకవత్ నరేష్, నీలం శ్యాంసుందర్, చాడా సమ్మిరెడ్డి, జంగా మధుకర్, యాదన్ల గట్టయ్య, లను*
ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ తెలిపారు.

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

◆- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి*

◆ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటికల నెరవేరాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.మొగడంపల్లీ మండలంలోని మాడ్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి, పునాదులు తీసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

Congress party state leaders Dr. Siddham.

 

ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సోసైటి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,మొగడంపల్లీ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ హర్షద్ పటేల్,ఎంపిడివో మరియు వివిధ శాఖల అధికారులు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు.

ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తెలంగాణ సిరిసిల్ల జిల్లా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మ దిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పర్శ హన్మాండ్లు ను శాలువా తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు బానిసలు కాదు పాలకులు కావాలని ఉద్యమించుచున్న మహోన్నతమైన వ్యక్తి హన్మాండ్లు అన్నారు,ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పర్శ హన్మాండ్లు జన్మదినం బీసీ లందరికి పండుగ దినం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు హైదరాబాదులో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం జైలు జీవితాన్ని అనుభవించిన గొప్ప వ్యక్తి పర్ష హన్మాండ్లు అని అన్నారు. పర్ష హన్మాండ్లు మునుముందు ఎన్నో పదవులు అధిరోహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు, మల్లేశం, తదితర బీసీ సంఘం నేతలు పాల్గొనడం జరిగినది.

మృతుడి కుటుంబానికి పరామర్శించిన పీసీసీ సభ్యులు.

మృతుడి కుటుంబానికి పరామర్శించిన పీసీసీ సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణ 19వ చెందిన మండల యాదగిరి మరణించగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాడెం నాగేశ్వర్లు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 8వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, 16వ వార్డు ఇన్చార్జ్ బాణాల శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, కొంకిస కిరణ్ గౌడ్, రచ్చ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మహిళలు విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు,విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ గారు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మే నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,06 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.

తొలి ప్రేమే తోపు కాదే.

తొలి ప్రేమే తోపు కాదే

 

నేటి ధాత్రి:

 

 

 

 

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో…

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్‌, ఎస్కేన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌, గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌ లవ్‌ ఫెయిలైతే బెస్ట్‌ లవ్‌ ఎక్కడో మొదలవుతుంది’ అని చెబుతూ సాగిన గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. అంతం వరకూ అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమే అనీ, అదే తుది కాదనే కాన్సె్‌ప్టను ఈ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్‌ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ సంగీత దర్శకుడు మణిశర్మ బీజీఎం కంపోజ్‌ చేశారు.

వార్డుల విభజన నోటిఫికేషన్.

వార్డుల విభజన నోటిఫికేషన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మున్సిపాలిటీలో వార్డుల విభజనకు నోటిఫికేషన్ జారీ అయినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పదివేల 10, 859 మంది ఓటర్లకు 16 వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంటి నెంబర్ల ఆధారంగా కొత్త వార్డుల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీ వరకు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి

అప్పటివరకు 25వేల పనుల ప్రతిపాదనలు కలెక్టర్ల పరిశీలనలోనే

పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల మంజూరుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కలెక్టర్లకూ అదే సూచన చేసింది.

గత ఏడాది (2024-25) చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రూ.2,200 కోట్లకు చేరాయి.

ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ గత మూడు నెలల్లో నాలుగుసార్లు దిల్లీ వెళ్లి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిణామాలతో కొత్త పనుల మంజూరుకు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం తొందరపడట్లేదు. బిల్లుల పెండింగ్ కారణంగా కొత్త పనులు చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువగా ఉంటారన్నది ఒక కారణమైతే..

Pending Bills.

 

 

వర్షాలు మొదలైనందున ఆదరాబాదరాగా చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించే అవకాశం ఉందన్నది మరో కారణం.

ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 25వేలకు పైగా కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్లు తాత్కాలికంగా పక్క పెట్టారు.

వర్షాకాలం ముగిశాకే కొత్త రోడ్ల పనులు

పూర్తయిన పనులను పోర్టల్లో అప్లోడ్ చేసిన 45 రోజుల్లో కేంద్రం బిల్లులు చెల్లించేది.

గత ఏడాది చేసిన మెటీరియల్ పనులకు అన్ని రాష్ట్రాలకూ అక్టోబరు నుంచి నిధులు నిలిపివేసింది.

గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 2025-26 వార్షిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ నుంచే కొత్త పనులు మొదలవ్వాలి.

ఈ ఏడాది కూడా 4,000 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం భావించింది.

పనులను తాత్కాలికంగా పక్కన పెట్టి కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

మరో రెండు వారాల్లో అవి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అయినా వర్షాకాలం ముగిశాకే పనులు మంజూరుచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తాత్కాలిక సర్దుబాటుకు సమస్యలు

ఉపాధిలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున తాత్కాలికంగా నిధుల సర్దుబాటుకు సాంకేతిక సమస్యలు అడొస్తున్నాయి.

ఉపాధి సిబ్బందికి రెండు నెలల జీతాల బకాయిల చెల్లింపులకు ఇటీవల రూ.60 కోట్లు సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

మెటీరియల్ పనులకు బిల్లుల విషయంలో వెనకడుగు వేస్తోంది.

ఉపాధి పనులకు మెటీరియల్ సరఫరా చేసే వెండర్లకు కేంద్రం నేరుగా బిల్లులు చెల్లిస్తోంది.

గతంలో పంచాయతీలకు చెల్లించేది. 2019-24 మధ్య వెండర్ విధానం తీసుకొచ్చింది.

 

Pending Bills.

 

 

మెటీరియల్ సరఫరాదారులను వెండర్ల కింద రిజిస్ట్రేషన్లు చేయించారు. వారికే కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా నిధులు సర్దుబాటు చేసినా ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం అసాధ్యమని అధికారులు అంటున్నారు.

ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణకు లేబర్ బడ్జెట్లో 4% నిధులు పరిపాలన ఖర్చులకు (అడ్మిన్ కాస్ట్) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తోంది.

దీనివల్ల సిబ్బంది జీతాలకు ప్రస్తుతం సర్దుబాటు చేసిన రూ.60 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేశాక తిరిగి వెనక్కి తీసుకునే వీలుంది.

మెటీరియల్ పనుల బిల్లులు నేరుగా వెండర్లకు చెల్లిస్తున్నందున, ప్రస్తుతం నిధులు సర్దుబాటు చేసినా తరువాత వెనక్కి రావడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ. చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.సూఫీ చారిటబుల్ క్లినిక్ ఆధ్వర్యంలో మౌజన్ మరియు ఇమామ్ లకు ఉచిత వైద్యం అందించనున్నారు. మరియు నిరుపేదలకు అతితక్కువ ధరలో ₹50 రూపాయలకే వైద్యం అందించనున్నారు.ఇలాంటి గొప్ప కార్యాన్ని చేస్తున్నా సూఫీ చారిటబుల్ క్లినిక్ వారిని ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ వారిని ఎంతో ప్రశంశించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు,మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ గారు,కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు గారు, మరియు సూఫీ చారిటబుల్ క్లినిక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

థగ్‌లైఫ్‌ కమల్‌హాసన్‌ పారితోషికం ఎంత.

థగ్‌లైఫ్‌ కమల్‌హాసన్‌ పారితోషికం ఎంత

 

నేటి ధాత్రి: 

 

 

 

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు..

ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల….

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు..

ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు హీరో, చిత్ర నిర్మాతల్లో ఒకరైన కమల్‌హాసన్‌.

ఈ విషయాన్ని ఆయన హైకోర్టుకు తెలిపారు.

అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గట్లేదు.

‘నాయకుడు’ సినిమా తర్వాత 38 ఏళ్లకు కమల్‌ హాసన్‌, మణిరత్నం కలయికలో తెరకెక్కిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్‌ ఇచ్చాయి.

దీంతో సినిమాను తొలిరోజే చూడడానికి సిద్ధమవుతున్నారు సినీ ప్రియులు.

అడ్యాన్స్‌ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోందీ చిత్రం.

ఆన్‌లైన్‌లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాదిలో ఇంత వరకూ వచ్చిన సినిమాల కంటే ‘థగ్‌లైఫ్‌’ అత్యధిక ఓపెనింగ్స్‌ను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ట్రేడ్‌ పండితులు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్‌, నటీనటుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బడ్జెట్‌.. నటీనటుల పారితోషికాలు

 

కమల్‌హాసన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర బడ్జెట్‌ దాదాపు రూ.300 కోట్లు అని తెలుస్తోంది.

ఈ చిత్రానికి వారిద్దరూ ప్రత్యేకంగా పారితోషికాలు తీసుకోలేదు.

ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటాను పంచుకోనున్నారు.

శింబు రూ.40 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారని తెలిసింది.

త్రిష రూ.12 కోట్లు తీసుకున్నారని సమాచారం.

ఇది ఇంతకు ముందు ఆమె నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం కంటే మూడింతలు ఎక్కువని టాక్‌.

అలాగే, ఇందులో కీలక పాత్రలు పోషించిన జోజు జార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, అభిరామి కూడా మంచి మొత్తాన్నే అందుకున్నారట.

ఈ గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా సుధాకర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version